చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ లో రైతులు పంటలు నష్టపోయి మూడేళ్లు అవుతున్నా ప్రభుత్వం ఇప్పటివరకూ పరిహారం ఇవ్వకపోవడం దారుణమని వైఎస్ ఆర్ సీపీ నేతలు మండిపడ్డారు. శనివారం చిత్తూరులో వైఎస్ ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి విలేకరులతో మాట్లాడారు.
చంద్రబాబు సొంత మండలంలోనే రైతుల పరిస్థితి ఇంతా దారుణమా ? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. బాధితుల సమస్యను వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం కోసం ప్రభుత్వంతో పోరాడుతామని వైఎస్ ఆర్ సీపీ నేతలు పేర్కొన్నారు.
0 comments:
Post a Comment