చంద్రబాబును నిలదీయడానికే ధర్నాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబును నిలదీయడానికే ధర్నాలు

చంద్రబాబును నిలదీయడానికే ధర్నాలు

Written By news on Tuesday, December 2, 2014 | 12/02/2014


'చంద్రబాబును నిలదీయడానికే ధర్నాలు'
హైదరాబాద్: చంద్రబాబు పాలన ఎప్పుడు పోతుందా అని గ్రామాల్లో ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏ ప్రభుత్వం మీదైనా వ్యతిరేకత రావడానికి కనీసం రెండేళ్లు పడుతుందని, దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా చంద్రబాబు ప్రభుత్వంపై ఆరు నెలలకే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. మంగళవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

చంద్రబాబును నిలదీయాలని, సమస్యల పరిష్కారం కోసం ఈనెల 5న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపడుతున్నామని జగన్ తెలిపారు. చంద్రబాబు మాటలతో రైతులు, డ్వాక్రా మహిళలు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 84 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. అడ్డగోలుగా పెన్షన్లు కత్తిరించారని విమర్శించారు. ఉత్తరాంధ్రలో 'హుద్ హుద్' పరిహారం అందని వారి తరపున కూడా పోరాడుతున్నామన్నారు.
Share this article :

0 comments: