వైఎస్ జగన్ ను కలిసిన రాజధాని ప్రాంత రైతులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ ను కలిసిన రాజధాని ప్రాంత రైతులు

వైఎస్ జగన్ ను కలిసిన రాజధాని ప్రాంత రైతులు

Written By news on Tuesday, December 16, 2014 | 12/16/2014


గుంటూరు: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసమీకరణ వ్యతిరేక గ్రామాల రైతులు  కలిశారు. మంగళవారం మాజీ ఎంపీపీ, జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్, రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాలుపురం రాము) పెద్ద కుమారుడు రాజమన్నార్ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన జగన్‌మోహన్‌రెడ్డిని రైతులు కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డితో సహా నిడమర్రు, కురగల్లు, పెనమాక, ఉండవల్లి గ్రామాల రైతులు జగన్ ను కలిశారు.
 
తమ భూములన్నింటినీ సర్కార్ లాక్కుంటే రోడ్డున పడతామని రైతుల జగన్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రైతులను జగన్ ఓదార్చారు. రైతుల తరపున అసెంబ్లీలో పోరాడుతామని..  అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని జగన్ వారికి భరోసా ఇచ్చారు.
Share this article :

0 comments: