హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. శనివారం లోటస్ పాండ్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్ జగన్.. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
0 comments:
Post a Comment