30 March 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్ జగన్ ను కలిసిన సిఐఐ ప్రతినిధి బృందం

Written By news on Saturday, April 5, 2014 | 4/05/2014

వైఎస్ జగన్ ను కలిసిన సిఐఐ ప్రతినిధి బృందంవీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందం ఈ రోజు లోటస్‌పాండ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డిని కలిశారు. వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోలో పరిశ్రమలు, విద్యుత్, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అంశాలను చేర్చాలని వారు జగన్ కు విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉండగా,  ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్‌ రాష్ట్ర అధ్యక్షుడు మల్లారెడ్డి  లోటస్‌పాండ్‌లో జగన్‌ సమక్షంలో ఐఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈనాడు చంద్రబాబును భుజాలపై మోస్తోంది

ఈనాడు చంద్రబాబును భుజాలపై మోస్తోంది
హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ఈనాడు దినపత్రిక భుజాలకెత్తుకుని మోస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ విమర్శించారు. 2009 ఎన్నికల్లో ఈనాడు టీడీపీకి అనుకూలంగా ఎన్ని రాతలు రాసినా పరాభవం తప్పలేదని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైనా, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనా అసత్యపు రాతలు రాస్తూ విషం కక్కుతోందని విమర్శించారు. చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడానికి నీతిమాలినపనులకు పాల్పడుతోందని ఆరోపించారు. జగన్ పై లేనిపోని కథనాలను అల్లుతున్నారని పద్మ మండిపడ్డారు. నిరాధారమైన ఆరోపణల్ని ఈనాడు అధిపతి రామోజీరావు నిరూపించాల్సిన అవసరముందని సవాల్ విసిరారు.

దివంగత మహానేత రాజశేఖర రెడ్డి బతికున్న రోజుల్లో ఆయనకు వ్యతిరేకంగా పుంఖానుపుంఖాలుగా ఈనాడు కథనాలను ప్రచురించిందని పద్మ విమర్శించారు. రాజశేఖర రెడ్డి చనిపోయిన రోజున ఆయన గొప్పతనాన్ని వివరిస్తూ నిజమైన వార్తలు రాసిందని చెప్పారు. వైఎస్ఆర్ మరణం తర్వాత జలయజ్ఞం పనులు నిలిచిపోయాయని, ప్రాజెక్టులు పూర్తిచేయకపోవడం గురించి ఈనాడు ఎందుకు స్పందించలేదని పద్మ ప్రశ్నించారు

కమలాపురంలో కాంగ్రెస్ కు షాక్

 రాష్ట్ర విభజన నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్న నేపథ్యంలో  వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో ఆ పార్టీకి షాక్ తగిలింది. కమలాపురం కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త రాజోలి వీరారెడ్డి శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
లోటస్ పాండ్ లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రాజోలి వీరారెడ్డి మాట్లాడుతూ పార్టీ గెలుపు కృషి చేస్తానని తెలిపారు. అలాగే కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి సోదరుని కుమారులుతో పాటు పలువురు స్థానిక కాంగ్రెస్ నేతలు ...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Jagan prefers direct interaction with people

YSR Congress President Y.S. Jaganmohan Reddy greets people during roadshow in Itchapuram on Friday.YSR Congress president Y.S. Jaganmoha Reddy on Friday continued his roadshow in Srikakulam district by touring several areas of border town Itchapuram. He gave importance to direct interaction with common people, including senior citizens, widows and farmers. Several locals jostled with one another to greet him.
The party leaders expressed happiness over the good response for his two-day tour. He did not give any political speeches during the second day. TDP Patapatnam in-charge Kovagapu Sudhakar has met Mr.Jagan and said he would join the YSRC. He was reportedly unhappy with the joining of former Minister Satrucharla Vijayarama Raju into the Telugu Desam. Former Minister Dharmana Prasada Rao and YSRC MP candidate Reddi Santi said that many more TDP leaders were coming forward to join the YSRC saying that only their party could ensure overall development of the State.

http://www.thehindu.com/news/national/andhra-pradesh/jagan-prefers-direct-interaction-with-people/article5872023.ece

అశాస్త్రీయ సర్వేలతో ప్రజలను పక్కదోవ పట్టించే యత్నం

హ్హ.. హ్హ.. హవా.. హ్హ
అశాస్త్రీయ సర్వేలతో ప్రజలను పక్కదోవ పట్టించే యత్నం
వైఎస్సార్ సీపీ ఓటు శాతం తగ్గిందంటూ దుష్ర్పచారం
ఇరవై రోజుల్లోనే పెను రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాయా అంటూ పరిశీలకుల ఆశ్చర్యం
ఎన్నికల ముందు గందరగోళం సృష్టించేందుకే పచ్చ మీడియా ఎత్తుగడలంటూ అనుమానాలు
ఎన్నికల వేళ ప్రతిసారీ జాతీయ ఛానళ్లదీ ఇదే తంతు
2004, 2009లో వైఎస్ సారధ్యంలోని పార్టీకి ఎదురుగాలి అంటూ అశాస్త్రీయ సర్వేలను పెకైత్తిన ఎల్లో మీడియా
ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పినా మారని తీరు

 
 ఊదరగొట్టి ఉట్టికెత్తి.. ‘‘చూడండి బాబూ.. చూడండి.. మాయా లేదు.. మంత్రం లేదు..
 మీ కళ్ల ముందే వంద నోటును ఈ డబ్బాలో పెట్టా. ఇప్పుడది  500 రూపాయల నోటు అయింది. ఇదంతా ఈ తాయత్తు మహిమ...’’
 - పొట్ట నింపుకునేందుకు రోడ్డుమీద గారడీ చేసే వాళ్ల మాటలివీ!
 ‘‘నాయనలారా.. అమ్మల్లారా.. చూడండి.. అంతా మావైపే ఉంది..
 ఆ సర్వే చూడండి.. ఈ సర్వే చూడండి.. ఎన్నికల్లో విజయం మాదే..

 ప్రభుత్వం ఏర్పాటు చేసేది మేమే...’’ 

 - ఎన్నికల చౌరస్తాలో నిలబడి టీడీపీ అధినేత చంద్రబాబు, రాజగురవింద రామోజీ, బాబు అనుకూల జాతీయ చానెళ్లు ప్రదర్శించే టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలివీ!! ఐదేళ్ల కోసారి పచ్చ బుట్టలోంచి బయల్దేరే ‘సర్వే’ పాములు బాబుకు వంత పాడటం, ఆ వెంటనే తన్మయత్వంలో ‘బాబూ.. నీవు రావాలి..’ అని పలవరిస్తూ రామోజీ తన పత్రికలో అక్షరాలను అచ్చొత్తి జనాలపైకి విసిరేయడం గత పదేళ్లుగా రాష్ట్ర ప్రజలు చూస్తున్నదే. అధికారం లేక బక్కచిక్కిన చంద్రబాబుకు గాలి కొట్టి..కొట్టి.. కొండంత ‘బెలూన్ బాబు’ను చేసుకొని రామోజీ మురిసిపోవడం, నిజంగానే పెరిగిపోతున్నానేమోనని బాబు భ్రమించడం, చివరికి జనం ఓటు అనే సూదితో ఆ బెలూన్ గాలి తీసేయడం ప్రజలకు సుపరిచితమే! 2004, 2009 ఎన్నికల్లో జరిగిందే. ఇప్పుడు కూడా అచ్చంగా అదే జరుగుతోంది.
 
 వనం దుర్గాప్రసాద్, ఎలక్షన్ సెల్: కేవలం 20 రోజులు... రెండు అవే సంస్థలు.. కానీ సర్వేల్లో ఎంత తేడా? ఈ కొద్ది రోజుల్లోనే దేశ, రాష్ట్ర రాజకీ యాలగతి మొత్తం మారిపోయిందా..? రాజకీయ సమీకరణలన్నీ తలకిందులయ్యాయా..? ప్రజల ఆలోచనల్లో ఇంతటి అనూహ్య మార్పు వచ్చిందా..? ఇవేవీ జరగలేదు. జరిగిందల్లా ‘పచ్చ’బుట్టల్లోంచి సర్వే పాములు బయటకొచ్చాయి. అవన్నీ ఎప్పట్లాగే ఎన్నికలకు ముందు టీడీపీకి అనుకూలంగా ఫలితాలు ఇచ్చాయి. జాతీయ ఛానళ్లలో ఊదరగొడుతున్నాయి. వాటినే నెత్తినెత్తుకొని ‘బాబు ఆహో.. ఓహో’ అంటూ పచ్చ మీడియా వీరంగం వేస్తోంది.
 
 ఇదే సీఎన్‌ఎన్-ఐబీఎన్ మార్చిలో నిర్వహించిన సర్వేలో సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీ 45 శాతం ఓట్లు సాధిస్తుందని చెప్పగా.. అంతలోనే మాట మార్చి 33 శాతానికి పరిమితం చేయడం అనేక అనుమానాలకు తావి స్తోంది. ఇంత తక్కువ వ్యవధిలో వైఎస్సార్‌సీపీకి ఏకంగా 12 శాతం ఓట్లు తగ్గేలా పెను రాజకీయ మార్పులు ఏం జరిగాయని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో టీడీపీకి ఉన్నట్టుండి ఆరు శాతం ఓట్లు పెరిగాయనడం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు. 2004, 2009 ఎన్నికల ముందు కూడా జాతీయ ఛానళ్లు ఇలాగే టీడీపీ బలాన్ని అతిగా చూపించి బొక్కబోర్లా పడ్డాయి!
 
2009లో టీడీపీకి 13 సీట్లు వస్తాయని ఎన్‌డీటీవీ, 14-16 సీట్లు వస్తాయని ఇండియా టుడే, 16 సీట్లు వస్తాయని సీఎన్‌ఎన్-ఐబీఎన్ ప్రకటించాయి. కానీ తీరా ఆ ఎన్నికల్లో టీడీపీకి దక్కింది ఆరు సీట్లు మాత్రమే కావడం గమనార్హం. 2009లో జాతీయ స్థాయిలో నీల్సన్ వెల్లడించిన సర్వే ఫలితాలు మాత్రమే వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. గతంలోనూ జాతీయ ఛానళ్లు చంద్రబాబు బలాన్ని ఎక్కువ చేసి చూపించాయని, ఇప్పుడు మళ్లీ అలాంటి ప్రయత్నమే జరుగుతోందని పాలగుమ్మి సాయినాథ్, సంజయ్‌బారు వంటి విశ్లేషకులు అంటున్నారు. భారీ శాంపిల్ తీసుకుని మార్చి 30న నీల్సన్ వెలువరించిన సర్వే ప్రకారం వైఎస్సార్‌సీపీకి 19-21 ఎంపీ సీట్లు, టీడీపీకి 4-6 స్థానాలు వస్తాయని తేలింది. ఈ సర్వే వెలువడిన నాలుగైదు రోజుల్లోనే సీఎన్‌ఎన్-ఐబీఎన్, ఎన్‌డీటీవీ.. తాము కొద్దిరోజుల కిందటే వెలువరించిన ఫలితాలకు పూర్తి విరుద్ధంగా సర్వేలను వెలువరించడంపై విశ్లేషకులు, ప్రొఫెసర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
 
 2004లో ఇదే ప్రచారం..
 తనకు అనుకూలంగా సర్వేలు చేయించుకోవడం, వాటిని ‘ఈనాడు’ ద్వారా ప్రచారంలో పెట్టడం అలవాటైన చంద్రబాబు 2004లో ఇదే పంథా అవలంబించారు. తొమ్మిదేళ్లపాటు నరకాన్ని చవిచూసి, టీడీపీపై జనం విసుగెత్తిపోయిన సమయంలో కూడా టీడీపీ హవా వీస్తోందంటూ సర్వేలు చేయించుకున్నారు. దాని ప్రకారం సెంటర్ ఫర్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సర్వేలో టీడీపీ-బీజేపీకి కలిసి 208 సీట్లు వస్తాయని చెప్పింది. వైఎస్ సారథ్యంలోని పార్టీకి 83 స్థానాలు, ఇతరులకు మూడు స్థానాలు లభిస్తాయని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కూటమికి 30 సీట్లు దక్కుతాయని, కాంగ్రెస్ కూటమికి 11 స్థానాలు వస్తాయని వెల్లడించింది.
 
 తెలుగుదేశం కూటమికి తొలి దశలో 103 సీట్లు, రెండో దశలో 105 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక రెండో దశకు ముందురోజు డీఆర్‌ఎస్ సర్వే పేరుతో మరో జిమ్మిక్కు చేశారు. టీడీపీకి ఒంటరిగానే 160 స్థానాలు వస్తాయని ఆ సర్వే ద్వారా చెప్పించారు. కాంగ్రెస్‌కు 120 సీట్లు, బీజేపీకి 6 సీట్లు వ స్తాయని ఆ సర్వే తెలిపింది. తొలి విడతలో తాము జరిపిన ఎగ్జిట్ పోల్స్‌లో 147 సీట్లకు గాను 77 టీడీపీకి వచ్చాయని సర్వే వివరించింది. రెండో విడతలో మరో 89 సీట్లు వస్తాయని చెప్పింది.
 జరిగిందేమిటి?
-     సర్వేల పేరుతో చంద్రబాబు ఎంత హంగామా చేసినా.. జనం వైఎస్ రాజశేఖరరెడ్డికే పట్టం కట్టారు. అఖండ మెజారిటీ కట్టబెట్టి అధికార పీఠంపై కూర్చోబెట్టారు. బలమైన స్థానాలని చెప్పుకునే చోట్ల కూడా టీడీపీకి చావుతప్పి కన్ను లొట్టబోయింది.
 
 2009లో ‘మహా’ మాయ...
 2009 ఎన్నికల్లో చంద్రబాబు సారథ్యంలోని మహాకూటమి ప్రభంజనం సృష్టిస్తుందంటూ ప్రచారం చేశారు. అందుకు అవసరమైన సర్వేలను విడతల వారీగా సిద్ధం చేశారు. చంద్రబాబును ఏ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయో ఆ వర్గాల నుంచే మద్దతు వస్తున్నట్టు సర్వేల్లో చెప్పించారు. మారిన మనిషి చంద్రబాబుగా చూపించే ప్రయత్నాలు చేశారు. ఎలా చూసినా మహాకూటమికి 178-190 సీట్లు ఖాయమని సర్వేల ద్వారా పదేపదే చెప్పించారు. అంతేనా... ఫలితాలు వెలువడకముందే ప్రభుత్వం ఏర్పడ్డాక ఎవరికి ఏ పదవులు ఇవ్వాలనే దానిపై టీడీపీలో చర్చలు జరుగుతున్నాయంటూ ఈనాడులో వార్తలు రాయించారు. మహా కూటమికి 149 సీట్లు వస్తాయని మహా ఛానల్ చెప్పింది.
 
 టైమ్స్ నౌ సర్వే కూటమికి 121 సీట్లు వస్తాయని తెలిపింది. టీవీ-9 సర్వే టీడీపీకి 105 సీట్లు వస్తాయని పేర్కొంది. మొదటి విడత పోలింగ్ ముగియడంతోనో టీడీపీ గ్యాంగ్ ఎగ్జిట్ పోల్స్‌తో మరో నాటకానికి తెరదీశారు. తొలి విడతలోనే మహాకూటమికి 120 సీట్లు ఖాయమని ప్రచారం చేశారు. తద్వారా రెండో విడత పోలింగ్‌పై ప్రభావం పడేలా వ్యూహరచన చేశారు. అంతేగాకుండా డీఎన్‌ఏ సర్వే ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 14 ఎంపీ స్థానాలు కూడా రావని ‘ఈనాడు’లో రాయించారు. కాంగ్రెస్‌కు ఎదురుగాలేనంటూ పేరూ ఊరులేని సర్వే గణాంకాలన్నింటినీ ప్రచురించారు.
 జరిగింది ఇదీ..
మహా కూటమి ప్రభంజనం అంటూ ఎల్లో మీడియా పెకైత్తిన సర్వేలన్నీ ప్రజాతీర్పులో కొట్టుకుపోయాయి. అందులో ఏ ఒక్క సర్వే నిజం కాలేదు. టీడీపీ, టీఆర్‌ఎస్, వామపక్షాలతో కూడిన మహాకూటమి చావు దెబ్బతింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. 157 సీట్లను దక్కించుకున్న వైఎస్ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
 
ఇంత తేడా ఉండకూడదు
 పది రోజుల్లో జరిగిన సర్వేకి... రెండ్రోజుల క్రితం జరిగిన సర్వే ఫలితాల్లో జగన్‌కు ఇంతగా ఓట్లు తగ్గుతాయంటూ వెల్లడైన అంశాల్లో శాస్త్రీయత కనిపించడంలేదు. వారం పది రోజులో రాజకీయాల్లో భారీ మార్పులుగానీ... ఇతరత్రా పెద్ద ఎత్తున సంఘటనలు గానీ జరగలేదు. కాబట్టి ఇంత తేడా ఉండకూడదు. ఉంటేగింటే ఒకట్రెండు శాతం మాత్రమే తేడా ఉండే అవకాశం ఉంది. ప్రజాభిప్రా య సేకరణ ఇంత పెద్ద ఎత్తున మారే అవకాశమే ఉండదు. ఈ పరిస్థితి చూస్తుంటే ఏదో ఒకవైపునకు సర్వే ఉంటుందన్న విమర్శ వచ్చే అవకాశం ఉంది.
- ప్రొఫెసర్ అనిత, జర్నలిజం శాఖ,
 నాగార్జున యూనివర్సిటీ

 
 ఆ సర్వేల్లో శాస్త్రీయతేది..?
 ‘సీఎన్‌ఎన్-ఐబీఎన్, ఎన్‌డీటీవీలు నెల క్రితం వెల్లడించిన సర్వేకి తాజా సర్వే ఫలితాలను విశ్లేషిస్తే వాటిలో శాస్త్రీయత లేదన్నది రూఢీ అవుతోది. కేవలం 1300 నుంచి 1400 మందిని సర్వే చేసి.. అదే కోట్ల మంది ప్రజల అభిప్రాయంగా చెప్పడం హేయం. నెల రోజుల్లో ఇంత మార్పు ఎలా సాధ్యమన్నది ఆ సర్వేల విశ్లేషణల్లో కన్పించడం లేదు. 2004, 2009 ఎన్నికల సమయంలో ఆ రెండు సంస్థలు ప్రకటించిన సర్వే ఫలితాలు..ఎన్నికల ఫలితాలతో సరిపోలేదు. ఇప్పుడు సర్వేలు సైతం 2014 ఫలితాలతో సరిపోలే అవకాశమే లేదు.’
- బి.మురళీధర్‌రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎస్కేయూ, అనంతపురం
 
వాస్తవానికి విరుద్ధం
 ఎన్నికల సర్వేలు శాస్త్రీయంగా జరగాలి. అన్ని వర్గాల నుంచి ఎక్కువ సంఖ్యలో శాంపిల్స్ తీసినప్పుడే ఫలితాలు సక్రమంగా తెలుస్తాయి.  శాంపిల్స్ తక్కువగా తీస్తే ఆ సర్వేలు వాస్తవాలను ప్రతిబింభించలేవు.  సీఎన్‌ఎన్, ఐబీఎన్ సర్వేలు చాలా తక్కువ శాంపిల్స్‌తో చేశారు  కాబట్టి ఇవి వాస్తవానికి విరుద్ధంగా ఫలితాలు వచ్చాయి.  ఇదే విషయాన్ని సర్వే ప్రముఖులు పి.సాయినాథ్, సంజయ్‌బారులు తేల్చి చెప్పిన విషయాన్ని మనం గమనించాలి.  రాజకీయ ప్రముఖులు, మేధావులే కాదు సామాన్యజనం కూడా ఆ సర్వే నమ్మే పరిస్థితి లేదు.
 - ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు,
 రాజనీతి శాస్త్ర అధ్యాపకులు

 
 పచ్చ పత్రికలు నెత్తికెత్తుకున్న సర్వేలు
- 2009లో వైఎస్ నేతృత్వంలోని పార్టీకి 124 సీట్లు, మహా కూటమికి 106 సీట్లు వస్తాయని ‘ది వీక్, సీ ఓటర్’ తేల్చింది.
 -    రాష్ట్రంలో వైఎస్ సారథ్యంలోని పార్టీకి 14 ఎంపీ సీట్లు మాత్రమే రావచ్చు. ఇదీ డిఎన్‌ఏ సర్వే.
-     రాష్ట్రంలో అధికార పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే.
     - స్టార్ న్యూస్, నీల్సన్ సర్వే.
     రాష్ట్రంలో అధికార పార్టీకి 21 ఎంపీ స్థానాలే రావచ్చు
     - టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే
 
శాంపిల్ చాలా తక్కువ
వారం పది రోజుల వ్యవ ధిలో జరిగిన రెండు సర్వేల మధ్య సీమాంధ్రలో వైఎస్ జగన్‌కు ఏకంగా పది శాతం ఓట్లు పడిపోతాయని సర్వే తేల్చడం ఆశ్చర్యకరం. ఈ కాలంలో రాజకీయంగా పెద్ద ఎత్తున వచ్చిన మార్పులేమీ లేవు. నీల్సన్-ఎన్టీవీ సర్వే వారు దేశవ్యాప్తంగా 40 వేల శాంపిల్స్ తీసుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున సర్వే శాం పిల్స్ తీసుకోవడం వల్ల రాబోయే ఎన్నికల ఫలితాలు కూడా అందుకు అనుగుణంగా ఉండే అవకాశం ఉంది. సీఎన్‌ఎన్-ఐబీఎన్ దేశవ్యాప్తంగా 18,000 శాంపిల్స్ (రాష్ర్టంలో కేవలం 1,300 శాంపిల్స్) మాత్రమే తీసుకుంది. దీని వల్ల సర్వే ఫలితాలు ఎన్నికల ఫలితాలకు వాస్తవ దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీవీ-నీల్సన్ ప్రశ్నలు అన్ని కోణాల్లో ఉన్నాయి. శాస్త్రీయంగానూ ఉన్నాయి. అయితే ఎన్టీవీ సర్వే నచ్చని వారు తమకు జరిగిన నష్టాన్ని నివారించేందుకు మరో సర్వే ద్వారా ఇలా చేశారన్న విమర్శలు వినవస్తున్నాయి.
- ప్రొఫెసర్ జి.తులసీరావు, అంబేద్కర్ యూనివర్సిటీ, శ్రీకాకుళం
 
ఎందరిని చేశారన్నది ముఖ్యం
 ఇంత తక్కువ వ్యవధిలో సర్వేల్లో ఇంత తేడా ఉండటం సాధ్యం కాదు. అయితే ఎన్నికల సర్వేలకు సంబంధించి రెండు అంశాలు అత్యంత కీలకమైనవి. 1) ఎంత మందిని శాంపిల్ సర్వే చేశారన్నది ముఖ్యం, 2) ఎవరితో మాట్లాడారు అన్నది. ఉదాహరణకు పాతబస్తీకి వెళ్లి ఎవరికి ఓటేస్తారు అంటే చాలామంది ఎంఐఎం అనే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ లేదా టీడీపీ బలంగా ఉన్నచోట్లకు వెళ్లి అడిగితే ఆయా పార్టీలకే అని చెప్తారు. పార్టీ కార్యకర్తల వద్దకు వెళితే వాళ్లు తమ పార్టీనే గెలుస్తుంది అంటారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇలా గందరగోళం సృష్టించేందుకు వెనుకబడిన పార్టీ ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అయితే సర్వే చేసే సంస్థ గతంలో వెల్లడించిన ఫలితాలు ఎన్నికల ఫలితాలకు ఏ మేరకు దగ్గరగా ఉన్నాయో గుర్తించి నమ్మాల్సిందే.
- ప్రొఫెసర్ స్టీవెన్‌సన్, జర్నలిజం శాఖ, ఉస్మానియా యూనివర్సిటీ
 సర్వేలు మేనేజ్ అవుతున్నాయి

 
ఈమధ్య పెద్దగా రాజకీయ మార్పులు జరగలేదు. అందువల్ల సర్వేల్లో భారీగా తేడా ఉండే అవకాశం లేనేలేదు. అలా ఉందంటే సర్వేలను మేనేజ్ చేసే అవకాశాలను తోసిపుచ్చలేం. సర్వేలు శాస్త్రీయంగా చేశారా? ఎవరిని అడిగారు? సర్వే చేస్తున్న వారు ఏ ఉద్దేశంతో చేశారు? అనేవి చూడాల్సి ఉంటుంది. ఎవరు చేస్తున్నారు? ఎవరిని ఎంపిక చేసుకున్నారు? ఇలాంటివన్నీ ఉంటాయి. ఏదో పార్టీకి అనుకూలంగా రావాలంటే దాని ప్రకారం సంబంధిత సర్వే సంస్థ ప్రశ్నలు రూపొందించే అవకాశం ఉంటుంది. ఎంపిక చేసే శాంపిల్స్ కూడా అలాగే ఉంటాయి. తటస్థంగా సర్వే ఫలితాలు రావాలంటే అందుకనుగుణంగా ప్రశ్నలను రూపొందించి శాంపిల్స్‌ను అదే పద్ధతిలో సేకరిస్తారు. - బాలస్వామి, జర్నలిజం శాఖాధిపతి, ఉస్మానియా యూనివర్సిటీ
 
 సీఎన్‌ఎన్-ఐబీఎన్
 మార్చి 4
 వైఎస్సార్‌సీపీకి  11-17 ఎంపీ సీట్లు.
 45 శాతం ఓట్లు.

 టీడీపీకి
 10-16 సీట్లు.
 33 శాతం ఓట్లు
 
 ఏప్రిల్ 2
 వైఎస్సార్‌సీపీకి
 9-15 ఎంపీ సీట్లు.
 33 శాతం ఓట్లు.
 
 టీడీపీకి
 13-19 సీట్లు.
 39 శాతం ఓట్లు.
 
 ఎన్‌డీటీవీ
 మార్చి 14
 వైఎస్సార్‌సీపీకి
 15 ఎంపీ సీట్లు.
 43 శాతం ఓట్లు.
 
 టీడీపీకి 9 సీట్లు.
 37 శాతం ఓట్లు.
 
 ఏప్రిల్ 3
 వైఎస్సార్‌సీపీకి
 10 ఎంపీ సీట్లు.
 38 శాతం ఓట్లు.
 
 టీడీపీకి 14 సీట్లు
 46 శాతం ఓట్లు.

వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థిగాపొంగులేటి నామినేషన్

ఖమ్మం పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్‌కు ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పొంగులేటితో ప్రతిజ్ఞ చేయించారు. తొలుత వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నుంచి భారీ ప్రదర్శనగా బయలుదేరి బస్టాండ్, వైరా రోడ్, జెడ్పీ సెంటర్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్, జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ పొంగులేటి నామినేషన్ పత్రాలను పరిశీలించి స్వీకరించారు.

 అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. దివంగత మహానేత రాజన్న ఆశయ సాధన కోసమే వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించిందన్నారు. రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ అమలు కావాలంటే జగనన్నతోనే సాధ్యమవుతాయని అన్నారు. గత నెల 5న ఖమ్మంలో నిర్వహించిన ఎన్నికల శంఖారావ సభలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తనను ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారని, ఈ నేపథ్యంలోనే నామినేషన్ దాఖలు చేశానని చెప్పారు. ప్రజలందరూ జగనన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు ఎదురు చూస్తున్నారని తెలిపారు.

 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ ప్రాంతంలో సైతం వైఎస్సార్ కాంగ్రెస్ గాలి వీస్తోందని చెప్పారు. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి తాను అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు, నియోజకవర్గ సమన్వయకర్తలు బానోతు మదన్‌లాల్, యడవల్లి కృష్ణ, తాటి వెంకటేశ్వర్లు, నాయకులు నిరంజన్‌రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధనే ధ్యేయంగా జిల్లా ప్రజలందరి అండదండలతో ముందుకెళ్తానని వైఎస్సార్‌సీపీ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. జరగనున్న ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభంజనం ఖాయమని ఆయన అన్నారు. జిల్లాలోని అన్నివర్గాల ప్రజల సహకారంతో జిల్లా అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు.

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ఆశయాల సాధన కోసం జగనన్న బాటలో నడుస్తున్న తనను జిల్లా ప్రజలు మరింతగా ఆదరిస్తూ ప్రోత్సహిస్తుండడం సంతోషకరమన్నారు. వైఎస్ ఏ కార్యక్రమం చేపట్టినా   తెలంగాణ నుంచే ప్రారంభించేవారన్నారు.  జగన్మోహన్‌రెడ్డి కూడా పార్టీ తరఫున మొదటి అభ్యర్థిగా ఇదే మైదానం నుంచి తెలంగాణ ప్రాంతానికి చెందిన తనను ప్రకటించడం  తెలంగాణ అభివృద్ధి పట్ల వైఎస్ కుటుంబానికి ఉన్న శ్రద్ధ ఏమిటో తెలియచేస్తోందన్నారు. అచంచల మనస్తత్వం ఉన్న వైఎస్.. జలయజ్ఞంతో పాటు ఇతర అనేక రకాల సంక్షేమ, అభివృద్ధి పథకాల విషయంలో తెలంగాణ ప్రాంతానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారన్నారు.

 గిరిజన ప్రాంతమైన ఖమ్మం జిల్లాలో అనేక మంది గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత వైఎస్‌దేనన్నారు. పావలా వడ్డీ, పింఛన్లు ఇతర అనేక పథకాలు ప్రజలకు పక్కాగా అందేలా వైఎస్ కృషి చేశారన్నారు. రాజన్న స్ఫూర్తితో ఖమ్మం జిల్లా నుంచి లోక్‌సభ, 10శాసనసభ స్థానాలను గెలిపించి జగన్‌కు కానుకగా ఇవ్వాలన్నారు. వైఎస్సార్‌సీపీ గురించి ఛలోక్తులు విసిరే పార్టీలు తమ అభ్యర్థులెవరో ఇప్పటికీ చెప్పలేని పరిస్థితిలో ఉండడాన్ని గమనించాలన్నారు. వైఎస్సార్‌సీపీ మాత్రం ఆరు నెలల కిందే అభ్యర్థులను ఎంపిక చేసిందన్నారు. ప్రతిఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించనున్న వైఎస్సార్‌సీపీతో నవ తెలంగాణ నిర్మాణం సాధ్యం అవుతుందన్నారు. అన్నివర్గాల ప్రజలకు మేలు కలిగించిన రాజన్న పథకాలను వైఎస్సార్‌సీపీ మాత్రమే పూర్తి స్థాయిలో కొనసాగిస్తుందన్నారు. నవ తెలంగాణలో ఇవి అత్యంత కీలకమని పొంగులేటి అన్నారు.

 శీనన్నను గెలిపిస్తే కేంద్రమంత్రి
 అవుతారు: పాయం వెంకటేశ్వర్లు
 పొంగులేటి శీనన్నను గెలిపిస్తే తప్పకుండా కేంద్రమంత్రి అవుతారని  వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ  కేంద్రప్రభుత్వ ఏర్పాటులో వైఎస్సార్‌సీపీ కీలక ప్రాత్ర పోషిస్తుందన్నారు. గత నెల 5వ తేదీన ఖమ్మంలో జగన్ ప్రకటించినట్లు శీనన్న తప్పకుండా కేంద్రమంత్రి అవుతారని, అత్యధిక మెజారిటీతో గెలిపించి ఢిల్లీకి పంపాలన్నారు.

 పొంగులేటి గెలుపుతోనే జిల్లా అభివృద్ధి: కూరాకుల నాగభూషణం
 పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని, తద్వారా జిల్లా అభివృద్ధికి చక్కటి బాటలు పడతాయని వైఎస్‌ఆర్‌సీపీ ఖమ్మం శాసనసభ నియోజకవర్గ సమన్వయకర్త కూరాకుల నాగ భూషణం అన్నారు.  జిల్లాకు చెందిన పొంగులేటిని గెలిపించేందుకు అన్నివర్గాల ప్రజలు ఓట్లు వేయాలన్నారు.

 కొత్తగూడెం సెగ్మెంట్ నుంచి అత్యధిక మెజారిటీ: ఎడవల్లి కృష్ణ
 రాజన్న ఆశయ సాధన కోసం, జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గెలిపించేందుకు అన్ని వర్గాల ప్రజలు కృషిచేయాలని వైఎస్‌ఆర్‌సీపీ కొత్తగూడెం నియోజకవర్గ సమన్వయకర్త ఎడవల్లి కృష్ణ అన్నారు.  శీనన్న గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా కృషిచేయాలన్నారు. కొత్తగూడెం సెగ్మెంట్ నుంచి అత్యధిక మెజారిటీ వచ్చేలా చేస్తానన్నారు.

 రైతుబిడ్డ శీనన్నను ఆదరించాలి:  తాటి వెంకటేశ్వర్లు
 రైతుబిడ్డగా జన్మించి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు ఆదరించాలని  పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ కన్వీనర్ తాటి వెంకటేశ్వర్లు అన్నారు.  శీనన్న ఖమ్మం ప్రతినిధిగా పార్లమెంటుకు వెళితే జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. జగనన్న ఆశయ సాధన కోసం శీనన్నను గెలిపించాలన్నారు. తెలంగాణ ఎంపీల్లో పొంగులేటికి అత్యధిక మెజారిటీ ఇచ్చి ఖమ్మం జిల్లాను వైఎస్‌ఆర్ జిల్లాగా నిలబెట్టాలన్నారు.

 జగనన్నకు కానుకగా ఇవ్వాలి:  మదన్‌లాల్
 పొంగులేటి శీనన్నను ఖమ్మం ఎంపీగా గెలిపించి జగన్‌కు కానుకగా ఇవ్వాలని పార్టీ వైరా నియోజకవర్గ సమన్వయకర్త మదన్‌లాల్ అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉన్న శ్రీనివాసరెడ్డిని గెలిపించేందుకు వైరా నుంచి అత్యధిక మెజారిటీ ఇచ్చేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానన్నారు.

 శీనన్న వ్యక్తిగా వచ్చి శక్తిగా మారారు: గుగులోత్ రవిబాబు నాయక్
 సాధారణ గ్రామీణ రైతు కుటుంబం నుంచి వచ్చిన శీనన్న వ్యక్తిగా ప్రజల్లోకి వచ్చి శక్తిగా మారారని పార్టీ ఇల్లెందు నియోజకవర్గ కన్వీనర్ గుగులోత్ రవిబాబు నాయక్ అన్నారు.   శీనన్న గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు.

 అన్ని వర్గాలు శీనన్న నాయకత్వాన్ని కోరుకుంటున్నాయి: సాధు రమేష్‌రెడ్డి
 జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పార్టీ మూడు జిల్లాల యువజన విభాగం సమన్వయకర్త సాధురమేష్‌రెడ్డి అన్నారు. శీనన్నను గెలిపిస్తే ఎట్టిపరిస్థితుల్లో కేంద్రమంత్రి అవుతారన్నారు. వైఎస్ ఆశయాలు, పథకాలు కొనసాగించాలంటే యువనాయకులు జగనన్న, శీనన్నలతోనే సాధ్యమన్నారు.  

 ఖమ్మం జిల్లా జగన్ శీనన్న:  మెండెం జయరాజ్  
 ఏ పదవి లేకున్నప్పటికీ జిల్లాలోని పేద, బడుగు, బలహీన వర్గాల కోసం పెద్దమనసుతో పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్న శీనన్న మనసున్న మారాజని, ఖమ్మం జిల్లా జగన్ శీనన్న అని పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్  మెండెం జయరాజ్  అన్నారు.   శీనన్న రాజకీయాల్లోకి రావడం జిల్లా అదృష్టమన్నారు.   అందరి పట్ల ఆప్యాయంగా ఉండే శీనన్న గెలుపు జిల్లాకు అత్యవసరమన్నారు.

 ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ శీనన్న: సయ్యద్ అక్రం అలీ
 నిరాండబరుడు, నిగర్వి అయిన శీనన్న ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ అని జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ అక్రం అలీ అన్నారు.  అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పోయే  మనస్తత్వం ఉన్న పొంగులేటి శీనన్న గెలుపు జిల్లాకు, అన్ని వర్గాల ప్రజలకు అవసరమన్నారు. పొంగులేటి గెలిస్తే ఖమ్మం జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించడం తథ్యం అన్నారు.

 జిల్లా అభివృద్ధికి కంకణం కట్టుకున్న పొంగులేటి: కీసర పద్మజారెడ్డి
 రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిన రాజన్న కుటుంబానికి అండగా నిలిచిన శీనన్నను ప్రతిఒక్కరూ ఆశీర్వదించాలని పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి అన్నారు. జిల్లా అభివృద్ధికి కంకణం కట్టుకున్న పొంగులేటిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.

 అఖండ మెజారిటీతో గెలిపించాలి:  కొత్తగుండ్ల శ్రీలక్ష్మి
 జిల్లా అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తున్న పొంగులేటి శీనన్నను అఖండ మెజారిటీతో గెలిపించాలని   మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కొత్తగుండ్ల శ్రీలక్ష్మి అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త శీనన్న కోసం వంద చొప్పున ఓట్లు వేయించాలన్నారు.

 సర్వమత ప్రార్థనలు..
 సభ అనంతరం ప్రదర్శనకు ముందుగా పొంగులేటిని మైదానంలో బ్రాహ్మణులు, ముస్లిం, క్రిస్టియన్ మత గురువులు ఆశీర్వదించారు. శీనన్న సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మండుటెండలోనూ మైదానానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ సభలో జిల్లా అధికార ప్రతినిధి నిరంజన్‌రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ముస్తఫా, నగర పార్టీ అధ్యక్షుడు తోట రామారావు, వట్టికొండ జగన్మోహన్‌రావు, సంపెట వెంకటేశ్వర్లు, కొంపల్లి బాలకృష్ణ, కొండలరావు, మార్కం లింగయ్య, ఆకుల మూర్తి, జిల్లేపల్లి సైదులు, ఆరెంపుల వీరభద్రం, వెంకటేశ్వర్లు, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, కందిమళ్ల బుడ్డయ్య, జూపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
 జోరుగా నామినేషన్లు...
 ఖమ్మం పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు మూడోరోజైన శుక్రవారం నామినేషన్ల పర్వం జోరందుకుంది. ఖమ్మం ఎంపీ స్థానానికి మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 10 శాసనసభ నియోజకవర్గాలకు గాను ఆరు స్థానాల్లో నామినేషన్లు బోణీ అయ్యాయి. . భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాలకు మూడురోజులైనా ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఎంపీ స్థానానికి వైఎస్సార్ సీపీ తరఫున పొంగులేటి శ్రీనివాసరెడ్డి,  జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి ఖమ్మం నగరానికి చెందిన బానోతు లక్ష్మానాయక్, కాంగ్రెస్ అనుబంధ సంఘమైన గాంధీపథం నుంచి బూసిరెడ్డి శంకర్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఖమ్మం, మధిర, పాలేరు, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం శాసనసభ స్థానాలకు ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి.

 వాటిలో ఖమ్మం నియోజకవర్గానికి వైఎస్సార్ సీపీ తరపున కూరాకుల నాగభూషణం, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా కర్నాటి హరీష్ సక్సేనా, కొత్తగూడెం నియోజకవర్గానికి సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు, మధిర నియోజకవర్గానికి సీపీఎం తరఫున  లింగాల కమల్‌రాజ్, పాలేరు నియోజకవర్గానికి సీపీఎం అభ్యర్థిగా పోతినేని సుదర్శన్, వైరా నియోజకవర్గానికి లోక్‌సత్తా పార్టీ నుంచి తేజావత్ నరసింహారావు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరుపున భూక్యా బూదేష్, సత్తుపల్లి నియోజకవర్గానికి వైఎస్‌ఆర్‌సీపీ తరఫున మట్టా దయానంద్ విజయ్‌కుమార్ ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు.

 9న తుది గడువు...
 సార్వత్రిక ఎన్నికల నామినేషన్లకు ఈనెల 9 చివరి తేదీ కావడంతో ఆ రోజు నామినేషన్లు అధికంగా దాఖలయ్యే అవకాశాలున్నాయి. ఈనెల 6న జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణను నిలిపివేశారు. ఇప్పటి వరకు ప్రధాన పార్టీలు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించకపోవడంతో నామినేషన్లకు ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే ఆయా పార్టీలకు చెందిన ఆశావహులు మాత్రం రిటర్నింగ్ అధికారుల నుంచి ఇప్పటికే నామినేషన్ పత్రాలను తీసుకెళ్లారు. ముహూర్తం చూసుకుని నామినేషన్‌లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయా పార్టీల అధిష్టానం జాబితా ప్రకటించిన వెంటనే  రిటర్నింగ్ అధికారులకు బీఫామ్‌లు అందించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే పార్టీ టికెట్ రాని వారు సైతం ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసేలా ఆస్తులు, అప్పులకు సంబంధించిన పత్రాలు, అఫిడవిట్‌లు సిద్ధం చేసుకుంటున్నారు.

సింగపూర్ కాదు శ్మశానం చేస్తాడు

సింగపూర్ కాదు శ్మశానం చేస్తాడు
నంద్యాల : టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వస్తే సీమాంధ్రను సింగపూర్ చేయడం కాదు కానీ శ్మశానంగా మార్చడం ఖాయమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆరేళ్లలోపు పాలన సాగించిన వైఎస్సార్‌ను ప్రజలు ఆయన ఫొటోల్లో చూసుకుంటూ పూజలు చేస్తున్నారని, అలాంటిది తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు ఫొటో కూడా ఏ పేదవాడి ఇంట్లో లేదన్నారు. ఇందుకు ఆయన సాగించిన ప్రజావ్యతిరేక పాలనే నిదర్శనమన్నారు. దొర్నిపాడులో శుక్రవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రజలు ఘనస్వాగతం పలికారు.
 
స్థానిక పార్టీ కార్యాలయం నుంచి అంకాలమ్మ గుడి వరకు నిర్వహించిన రోడ్‌షోకు జనం బ్రహ్మరథం పట్టారు. అంకాలమ్మ సెంటర్‌లో ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వైఎస్సార్ ప్రజా సంక్షేమానికి పాటుపడితే చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 1999లో గుజరాత్‌లో ముస్లింలపై దాడులు జరిగిన సమయంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న చంద్రబాబు అందుకు సంబంధించి రాష్ట్ర ముస్లింలకు క్షమాపణ చెప్పారని, నరేంద్రమోడీని రాష్ట్రంలోకి అడుగుపెట్టనివ్వబోనని ప్రకటించారన్నారు. అయితే అందుకు విరుద్ధంగా ప్రస్తుతం అదే పార్టీతో పొత్తుకు కాళ్లబేరానికి వెళ్తున్నాడన్నారు.
 
 కేసీసీకి నీరు రాజశేఖరెడ్డి చలవే : కేసీ కాల్వకు సమృద్ధిగా నీరు పారుతూ ఇరుగారు పంటలు పండుతున్నాయంటే అందుకు వైఎస్సార్ కృషే కారణమని ఎమ్మెల్యే అన్నారు. పొతిరెడ్డిపాడు విస్తరణ పనులను వైఎస్సార్ చేపట్టడం వల్లే పంటలకు సాగునీటి సమస్య లేకుండా పోయిందన్నారు. వైఎస్సార్ ఆశయాలు సాధిస్తూ ప్రజారంజక పాలన అందించడమే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని, ఓదార్పు యాత్ర ద్వారా పేదలను ప్రత్యక్షంగా కలుసుకున్న ఆయనకు వారి కష్టాలేంటో తెలుసని, వాటి పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు.
 
 వరుసగా జరిగే అన్ని రకాల ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చాకరాజువేముల గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు తులసీరాముడు, మరో 150 మంది వైఎస్సార్‌సీపీలో చేరారు.
  ఆయా కార్యక్రమాల్లో డెయిరీ చైర్మన్ భూమా నారాయణరెడ్డి, నాయకులు రామకృష్ణారెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు భూమా వీరభద్రారెడ్డి, వేమయ్య తదితరులు పాల్గొన్నారు.
 

సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీదే హవా!

సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీదే హవా!
న్యూస్-ఎక్స్ సర్వేలో వెల్లడి
సీమాంధ్రలో 17 ఎంపీ సీట్లు చేజిక్కించుకుంటుందని అంచనా
 
 సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగిస్తుందని ప్రముఖ ఇంగ్లిష్ న్యూస్ చానల్ న్యూస్-ఎక్స్ సర్వేలో వెల్లడైంది. సీమాంధ్రలోని మొత్తం 25 సీట్లలో వైఎస్సార్‌సీపీ 17 స్థానాలను చేజిక్కించుకుంటుందని, టీడీపీ ఎనిమిది స్థానాలకే పరిమితమవుతుందని ఆ చానల్ నిర్వహించిన సర్వేలో స్పష్టమైంది.
 
 సర్వే ఫలితాలను న్యూస్-ఎక్స్ చానల్ శుక్రవారం ప్రసారం చేసింది. సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీ హవాకు తిరుగుండదని ఎన్‌టీవీ-నీల్సన్ సర్వేలో వెల్లడైన సంగతి తెలిసిందే. అయితే గత నెలరోజుల్లో పరిస్థితులు మారిపోయాయని, టీడీపీ పుంజుకుందని జాతీయ చానళ్లు సీఎన్‌ఎన్-ఐబీఎన్, ఎన్డీటీవీ తాజా సర్వేల పేరుతో కొత్త అంచనాలను అందించాయి. వీటిపై ఆ చానళ్ల చర్చల్లో పాల్గొన్న హిందూ రూరల్ అఫైర్స్ ఎడిటర్ పాలగుమ్మి సాయినాథ్, ప్రధాని మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారు అసంతృప్తి వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. నెలరోజుల్లో ఏం రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని సర్వే ఫలితాలు అంతగా మారిపోయాయని పలువురు విశ్లేషకులు కూడా ఆశ్చర్యం వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజనలో ప్రధాన పాత్ర పోషించిన బీజేపీతో పొత్తువల్ల సీమాంధ్రలో టీడీపీకి నష్టమే తప్ప లాభం ఉండదని విశ్లేషించారు. వారి వాదనలను నిజం చేస్తూ సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీయే అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని న్యూస్-ఎక్స్ చానల్ సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, మొత్తం 17 సీట్లలో పదిసీట్లు గులాబీదళానికే దక్కుతాయని ఈ సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్‌కు ఐదు, బీజేపీకి ఒకటి, ఇతరులకు ఒక ఎంపీ సీటు దక్కే అవకాశాలున్నాయని పేర్కొంది. జాతీయస్థాయిలో బీజేపీకి 220 ఎంపీ సీట్లు వస్తాయని, కాంగ్రెస్ 100 స్థానాల దగ్గరే ఆగిపోతుందని సర్వే ఫలితాల్లో వెల్లడైంది.
 

రామోజీకి సాక్షి సవాల్

రామోజీకి సాక్షి సవాల్
ఇది సాక్షి సవాల్. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా దాన్ని ‘సాక్షి’ వ్యవస్థాపక చైర్మన్ వైఎస్ జగన్‌కుఅంటగడుతున్న రామోజీకి ఇది సాక్షి ప్రత్యక్షంగా విసురుతున్న సవాల్. ఏం రామోజీ! చేతికొచ్చినట్లు రాయటం కాదు. ఈ సవాల్‌ను స్వీకరిస్తారా? ఆ ధైర్యం మీకుందా? టైటానియం తవ్వకాల కోసం దిమిత్రీ ఫిర్టాష్ కంపెనీ ఇండియాలోని పలువురికి లంచాలిచ్చిందంటూ అమెరికా దర్యాప్తు సంస్థ ఆరోపణలు చేసిందని, అందులో పేరు వెల్లడించకుండా ‘సి’ అనే వ్యక్తిని పేర్కొందని... ఆ ‘సి’ జగనేనని మీ విషపుత్రిక ‘ఈనాడు’ రాసేయటం... మీ కవలలాంటి చంద్రబాబు అవునంటూ తలూపటం... ఇవన్నీ మీకు తప్పనిపించలేదా? 40 ఏళ్లుగా పత్రిక నడుపుతున్న మీకు... ఏమైనా విలువలున్నాయా?
 
 
అమెరికాలో ఎఫ్‌బీఐ అభియోగాలు నమోదు చేసిన ‘టైటానియం మైనింగ్’ వ్యవహారానికి సంబంధించి రెండ్రోజులుగా తన విషపుత్రిక ‘ఈనాడు’లో పతాక శీర్షికలు వండి వారుస్తున్నారు రామోజీ. తొలిరోజు ఎఫ్‌బీఐ అభియోగాల్లో పేరున్న కె.వి.పి.రామచంద్రరావుపై కథనాన్ని ప్రచురించి... రెండోరోజు మాత్రం దాన్లో పేర్కొన్న ‘సి’ అనేవ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డేనంటూ తన ఊహల్ని ఆకాశానికి ఎగదోసి నిలువెల్లా విషం కక్కారు. అక్కడితో ఆగలేదు కూడా! ‘అలాంటి స్కెచ్చే’ అంటూ మరో కథనాన్ని వండేసి... వర్జిన్ ఐలాండ్ కంపెనీల ద్వారా జగన్ సంస్థల్లోకి ఈ నిధులు వచ్చాయని కూడా రాసేశారు. సి అంటే సిన్నోడు... అదెవరో మీకందరికీ తెలుసు!! అంటూ అందరి ఊహాశక్తీ తనలానే కుట్రపూరితంగా ఉంటుందని అనుకున్నారు రామోజీ. అందరి మాటా ఏమోగానీ చంద్రబాబుకు అచ్చంగా రామోజీలాంటి ఊహాశక్తే ఉంది. అందుకే ఆయన విలేకరుల సమావేశం పెట్టి మరీ... ఇంకెవరు! జగన్‌మోహన్‌రెడ్డేనన్నారు. అసలు ‘స్కెచ్’ అంటే ఏంటి? ముందే రామోజీ, చంద్రబాబు మాట్లాడుకోవటం... ఇద్దరూ కూడబలుక్కుని ఒకే ఆరోపణ చేయటం... జగన్‌పై దుష్ర్పచారం చేస్తూ అచ్చేసిన వార్త కిందే... ‘సైకిల్ జోరు’ అంటూ బాబు ఫోటోతో మరో వార్త వెయ్యటం!! ఇది కాదూ.. స్కెచ్ అంటే!!
 
 జగన్ పేరుంటే వదిలేవారా?

 ఎఫ్‌బీఐ ఆరోపణ పత్రంలో నిజంగానే జగన్‌మోహన్ రెడ్డి పేరు ఉంటే ‘ఈనాడు’కు కోతికి కొబ్బరి కాయ దొరికినట్టే కదా!. మరి అప్పుడు జగన్‌ను వదిలి కేవీపీ బొమ్మతో పతాక శీర్షికన వార్తలెందుకు అచ్చేస్తుంది? ఈ మాత్రం జ్ఞానం కూడా జనానికి ఉండదన్నది రామోజీ ఫీలింగ్. అందుకే తొలిరోజు కేవీపీ పేరుతో వార్త ప్రచురించినా... రెండోరోజు బాబుతో కలిసి మొత్తం వ్యూహాన్ని చర్చించి, జగన్‌ను ఎన్నికల్లో అడ్డుకోవాలంటే ఎలాగైనా ఆయన్నే టార్గెట్ చేస్తూ దుష్ర్పచారం చేయాలని తీర్మానించుకున్నారు. ఆ వ్యూహం ప్రకారమే ఇద్దరూ కూడబలుక్కుని జగన్‌పై విషం గక్కే ప్రయత్నం చేశారు. జర్నలిజం అంటే నిజాన్ని రిపోర్ట్ చేయటం. ఎల్లో జర్నలిజం అంటే నిజంతో నిమిత్తం లేకుండా మనకు కావాల్సింది రాసుకోవటం. రామోజీ... ఆరోపణ పత్రంలో లేనివి ఉన్నట్టు రాసిన మీది ఏ జర్నలిజం..?
 
 జగన్‌కు ఏం సంబంధం?
 
 అసలు టైటానియం డీల్‌కీ, జగన్‌మోహన్‌రెడ్డికీ ఏమిటి సంబంధం? ఆ కంపెనీ సొమ్ము ఏ రకంగానూ ఒక్క పైసా కూడా జగన్ కంపెనీల్లోకి రాలేదన్నది పచ్చి నిజం. జగన్‌కు ఆ కంపెనీలో ఉన్న వ్యక్తులెవరో కూడా తెలియదు. అన్నిటికీ మించి ఆయన ఏనాడూ సెక్రటేరియట్‌కు వెళ్లింది లేదు. హైదరాబాద్‌లో నివసించిందీ లేదు. బెంగళూరులో ఉంటూ... తన వ్యాపారాలేవో తాను చేసుకునేవాడన్నది రహస్యమేమీ కాదు. మరి అధికారులతో మాట్లాడి జగన్ పైరవీలు చేశాడని రాసిన రామోజీకి, ‘ఈనాడు’కు... ఆయన ఏ ఒక్క అధికారితో అయినా మాట్లాడినట్టు నిరూపించే గుండె ధైర్యం ఉందా?
 
 కొడుకునెవరైనా బంధువంటారా?
 
 ఈ ఆరోపణ పత్రంలో నిందితులుగా పేర్కొన్న ఆరుగురిలో కేవీపీ ఒకరు. నిందితులుగా పేర్కొనకపోయినా... ‘వైఎస్ బంధువు వీరికి సహకరించారు’ అని దాన్లో ఉందని, ఆ బంధువు జగనేనని ‘ఈనాడు’, తోకపత్రిక కూడా చంద్రబాబు సహకారంతో స్క్రిప్టు రెడీ చేసి ప్రచారం చేసేశాయి. పెపైచ్చు మామూలు బంధువులకు వైఎస్‌కు అంత దగ్గరగా ఉండటం సాధ్యం కాదని, జగన్‌కే సాధ్యమని తన సొంత భాష్యం జోడిస్తూ మరీ రెచ్చిపోయారు రామోజీ!! కొడుకుని ఎవరైనా కుటుంబ సభ్యుడంటారు కానీ బంధువంటారా? అమెరికాలో అయినా.. ఇండియాలో అయినా కొడుకుని ‘మా బంధువు’ అని ఎవరైనా చెబుతారా? రామోజీరావుకు కిరణ్‌గానీ, సుమన్‌గానీ బంధువులు కాదుగా? కొడుకులేగా!! చంద్రబాబుకు లోకేష్ బంధువా లేక కొడుకా?
 
 అమెరికా ఆరోపణలేమైనా కొత్తా!

 అమెరికా ప్రభుత్వం భారతీయ పౌరులపై ఆరోపణలు చేయటం ఇదేమీ తొలిసారి కాదు. ఇంతకుముందూ చేసింది. ఒకవేళ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ఈ డీల్‌తో సంబంధం ఉంటే నేరుగా ఆయన పేరే రాసేదిగా! ప్రభుత్వమే బయట పెట్టేదిగా! గోధ్రా మారణకాండకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కారకుడని తానే తేల్చేసిన అమెరికన్ ప్రభుత్వం... ఆయనకు వీసా కూడా ఇవ్వం పొమ్మంది. అలాగే యూపీఏ అధ్యక్షురాలు సోనియాకు 1984 సిక్కుల ఊచకోత కేసుతో సంబంధం ఉందంటూ అమెరికా కోర్టు సమన్లూ ఇచ్చింది. తాజా చార్జిషీట్లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్న రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావును నిందితుడిగా పేర్కొంది. మరి జగన్‌మోహన్ రెడ్డి కూడా నిందితుడైతే అమెరికా కోర్టు ఆ మేరకు ఆరోపణ చేయకుండా ఉంటుందా? దాన్నెవరైనా ఆపగలరా? మరి రామోజీకి ఇదంతా తెలియదా? తెలిసి కూడా ఎన్నికల ముందు జగన్‌పై బురద జల్లుతుండడాన్ని చూసి ఏమనుకోవాలి?
 
 ఎఫ్‌బీఐ అయినా... సీబీఐ అయినా
 
 రామోజీకి ఏదైనా ఒకటే. తననెవరైనా ప్రశ్నిస్తే నచ్చదు. అందుకే గతంలో సీబీఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా ఏకి పారేశారు. కానీ అదే సీబీఐ జగన్‌పైకి వచ్చేసరికి... దానికి విపరీతమైన పవిత్రతను ఆపాదించి, దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అంటూ కితాబులిచ్చేశారు. బాబు సూత్రధారిగా ఆరోపణలున్న ఐఎంజీ కేసులో సిబ్బంది లేరంటూ దర్యాప్తు చేయకపోయినా లక్ష్మీనారాయణను తప్పుబట్టలేదు సరికదా... వైఎస్ కుటుంబ పరువు ప్రతిష్టలే టార్గెట్‌గా జగన్ కేసులో తనకు లీకులివ్వటంతో  ఆయన్ను ఆకాశానికెత్తేశారు. అలాంటి రామోజీ... ఇపుడు ఎఫ్‌బీఐని ప్రపంచంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థగా పేరుపొందినదంటూ కీర్తించటం వింతేమీ కాదు. ఇదే ఎఫ్‌బీఐ గతంలో చంద్రబాబు సహచరులు, తెలుగుదేశం సన్నిహితులు పలువురిపై ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులూ పెట్టింది. నేరాలు నిరూపణై వాళ్లు జరిమానాలూ కట్టారు. కానీ రామోజీ అలాంటివేవీ తన పత్రికలో రాయరు. దీన్నేమనుకోవాలి? రామోజీకున్న విదేశీ భక్తా! లేక తెలుగుదేశం భక్తా!!
 
 ఇదంతా ఎందుకంటే!!
 
 ఎన్నికల ముందు ప్రసారమయ్యే సర్వేలను రిగ్గింగ్ చేయటం, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై విషప్రచారం చేయటం ఇవన్నీ చంద్రబాబుకంటే రాజకీయ అవసరాలు. ఎందుకంటే పదేళ్లుగా ప్రజలు అధికారానికి దూరంగా కూర్చోబెట్టారు కనక. మరి రామోజీకి ఏంటవసరం? నిజానికి రామోజీ కూడా పరోక్షంగా అధికారానికి దూరమయ్యారు. ఎందుకంటే బాబు అధికారంలో ఉంటే తెరవెనక ఉండి చలాయించేది ఈయనే కనక. పదేళ్లుగా బాబు అధికారంలో లేకపోవటం వల్ల తన కొత్త కంపెనీలేవీ పెట్టలేకపోయారు సరికదా... మార్గదర్శి కుంభకోణం నుంచి బయటపడటానికి ఉన్న చానళ్లను సైతం రిలయన్స్‌కు కట్టబెట్టాల్సి వచ్చింది. బాబు గెలిస్తే రెండు రాష్ట్రాల్లోనూ మళ్లీ పాత రోజులు వస్తాయనేది ఈయన దింపుడు కళ్లం ఆశ. అందుకే నాలుగున్నరేళ్లుగా రాష్ట్రం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నా తన పత్రికలో చోటివ్వని రామోజీ... రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినా నోరెత్తని రామోజీ... ఇరు ప్రాంతాల ప్రజల హక్కులూ సర్వనాశనమైనా స్పందించని రామోజీ... ఇప్పుడు మాత్రం గొంతెత్తుతున్నారు. దేశం కోసం కాదు... తెలుగుదేశం కోసం!!!
 
 అవినీతిని విదేశాలకు పాకించింది బాబు కాదా?
 
 అసలు అవినీతిని దేశం దాటించిందెవరు? భూములు కేటాయించి, గనులు కేటాయించి లంచాలు తీసుకున్నదెవరు? చంద్రబాబు కాదా!! ఫ్లోరిడాకు చెందిన ఐఎంజీ అకాడమీకి అనుబంధమంటూ ఇక్కడ తన బినామీలతో డమ్మీ కంపెనీ పెట్టించి... ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా... అప్పట్లోనే ఎకరా రూ.4 కోట్ల విలువ చేసే 850 ఎకరాల భూమిని రూ.50వేల చొప్పున కేటాయించింది చంద్రబాబు కాదా? దీనిపై సీబీఐ దర్యాప్తు చేయటం లేదేమని ఏనాడైనా అడిగారా రామోజీ? అంత పెద్ద కుంభకోణాన్ని కూడా అది కుంభకోణం అని ఏనాడైనా ఒక సింగిల్ కాలమ్ వార్త రాశారా? ‘ఈమార్’ వ్యవహారంలో వాళ్లు అడిగింది 250 ఎకరాలైతే బాబు కేటాయించింది 530 ఎకరాలు.
 
 అదికూడా ఆ అదనపు భూమిపై చంద్రబాబు స్వయంగా నోట్‌ఫైల్ రాశారు. హైదరాబాద్‌లో 280 ఎకరాలంటే ఈ రోజున కనీసంగా 10,000 కోట్ల ఆస్తిని చంద్రబాబు అడగకుండానే వారికి అప్పగించటం ద్వారా ఎంత ముడుపులు పొందాడు? హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 2,000 ఎకరాలు చాలునని కేంద్ర సంస్థలు నివేదికలిచ్చినా కూడా పక్కనబెట్టి 5,500 ఎకరాలు కట్టబెట్టిందెందుకు? ఈమార్‌పై దర్యాప్తు చేసిన సీబీఐ... భూములిచ్చిన చంద్రబాబును ఎందుకు పిలవలేదు? సంబంధిత సెక్రటరీనీ ప్రశ్నించలేదెందుకు? హెరిటేజ్ భాగస్వామి సుజనా చౌదరి డమ్మీ కార్యకలాపాలు చూపించి వందల కోట్లు పన్నులు ఎగ్గొట్టినా రామోజీకి కనిపించదా? విదేశాల్లోను, స్వదేశంలోను వందల కోట్లు మనీల్యాండరింగ్ చేస్తున్న సుజనా చౌదరిపై రామోజీ పెన్నెత్తరేం? ఈ ప్రశ్నలు ‘ఈనాడు’ ఏనాడూ అడగదెందుకు? చంద్రబాబు డీల్స్ అన్నిటా రామోజీకి కూడా కమిషన్ ముట్టిందా? ఏమో!!
 
 నోటికొచ్చినట్లు రాయటమేనా?
 
 జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సంస్థల్లో ‘2ఐ క్యాపిటల్’ పెట్టుబడులు పెట్టిందని, అవన్నీ వర్జిన్ ఐలాండ్స్‌లోని సంస్థల ద్వారా వచ్చాయని ఏదేదో రాశారు రామోజీ? 2ఐ క్యాపిటల్ ద్వారా వచ్చిన నిధులేమీ రహస్య నిధులు కాదే! సండూర్ పవర్‌లో అది పెట్టిన పెట్టుబడి బహిరంగ రహస్యమేగా? అందుకుగాను వాళ్లు షేర్లు కూడా తీసుకున్నారు. ఆ షేర్లను తరవాత కంపెనీయే కాస్త లాభంతో బైబ్యాక్ చేయటంతో వారు ఎగ్జిట్ అయ్యారు. ఇదే 2ఐ క్యాపిటల్... అప్పట్లో టాటాలకు చెందిన ఐడియా సెల్యులర్, సుబ్బరామిరెడ్డికి  చెందిన గాయత్రీ ప్రాజెక్ట్స్, గుజరాత్‌కు చెందిన పిపావవ్ షిప్‌యార్డ్ వంటి పలు లిస్టెడ్ కంపెనీల్లో సైతం పెట్టుబడులు పెట్టింది. అలాంటి సంస్థ జగన్ కంపెనీల్లో పెడితే తప్పయిపోయిందా? ఈ రాతలకేమైనా అర్థం ఉందా?
 
 జనం నమ్మట్లేదని తెలియదా!!
 
 వైఎస్‌పై, జగన్‌పై ‘ఈనాడు’ చేస్తున్న ఆరోపణలు ఎన్నికల ముందు మరింత తీవ్రం కావటం మామూలే. జ్వరాల సీజన్‌లా... ఇది ఎల్లో వైరస్ సీజన్. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఆవిర్భవించాక 20 ఎమ్మెల్యే ఉప ఎన్నికలు, 2 ఎంపీ ఉప ఎన్నికలు జరిగితే... వాటికి ముందు రామోజీ సంధించిన ఆరోపణాస్త్రాలు మామూలువి కావు. ఎన్ని చేసినా ఒక్కటంటే ఒక్కచోటా తెలుగుదేశం పార్టీ గెలిచింది లేదు. మొత్తంగా కలుపుకుంటే తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 16 కూడా లేదు. ఒక అభ్యర్థికి డిపాజిట్ రావాలంటే... కనీసం పోలైన ఓట్లలో ఆరింట ఒక వంతు రావాలి. అంటే 16.6 శాతం. అంటే వైఎస్ మరణించాక టీడీపీ... ‘టోటల్ డిపాజిట్లు పోయిన’ పార్టీగా మారిందన్న మాట. జనం రామోజీని, చంద్రబాబును నమ్మి ఉంటే ఇలా జరిగేది కాదుగా?
 
 ఏది విశ్వసనీయత?
 
 జర్నలిజం అంటే విశ్వసనీయత. ‘ఈనాడు’కు ఎప్పుడో పోయిందది. డబ్బులు పంచని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులకు మసిపూసే ప్రయత్నం చేస్తూ... మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఓటుకు తెలుగుదేశం పార్టీ కనీసంగా రూ. 1,000 నుంచి 3,000 వరకు పంచినా దానిపై సింగిల్ కాలమ్ ఐటమ్ కూడా రాయలేదు రామోజీ. గుర్రాల హసన్ ఆలీ డైరీల్లో డెరైక్ట్‌గా చంద్రబాబు నాయుడుతో తనకున్న లింకుల్ని  బయటపెడితే... చంద్రబాబు ఏకంగా కేంద్రంలోని కాంగ్రెస్ కాళ్లు పట్టుకుని తనమీద కేసులు పడకుండా చూసుకుని ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం సందర్భంగా నిలబెడితే- అదంతా అవినీతిగా కనిపించలేదు ఈయనకి. ఇదీ రామోజీ మార్కు జర్నలిజం... విశ్వనీయత.

ఇచ్ఛాపురంలో రోడ్‌షోకు ప్రజల బ్రహ్మరథం

రెండు నెలలు ఓపిక పట్టండి
మీ కష్టాలన్నీ తీరుస్తా  
ప్రజలకు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి  భరోసా


ఇచ్ఛాపురంలో రోడ్‌షోకు ప్రజల బ్రహ్మరథం
ఉత్కళాంధ్ర సీమలో జన నేతకు నీరాజనం
జాతీయ రహదారిపై వెల్లువెత్తిన జనాభిమానం
 

 శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలోని ఉత్కళాంధ్ర సాంస్కృతిక సీమ ఇచ్ఛాపురంలో పర్యటించారు. మున్సిపాలిటీలోని ఇరుకు వీధుల్లో కూడా ఆయన పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. ఆయన్ను చూసేందుకు ప్రజలు పోటెత్తారు. జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఇచ్ఛాపురం పట్టణంలో రోడ్ షో ప్రారంభించింది మొదలు సాయంత్రం వరకు పోటెత్తిన జనప్రవాహం మధ్య ఆయన పర్యటన సాగింది. జగన్‌ను చూసేందుకు.. పలకరించేందుకు మహిళలు, వృద్ధులు భారీగా తరలి వచ్చారు. మండుటెండను కూడా లెక్కచేయకుండా తన కోసం వచ్చిన వారందరితో జగన్ మనసారా మాట్లాడారు. ‘నాలుగున్నరేళ్లుగా మీరు పడుతున్న బాధలు తెలుసు. రాష్ట్రమంతా తిరిగి కళ్లారా చూశాను. రెండు నెలలు ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వస్తుంది. పేదలందరి బాధలు తీరుస్తా’ అని భరోసా కల్పించారు.
 
జగన్‌ను చూడాలని..

 జగన్‌మోహన్‌రెడ్డి తమ వద్దకు వస్తున్నారని తెలిసి.. ఆయనను చూడాలని ఇచ్ఛాపురంలో  నాగుల గంగు(102) అనే వృద్ధురాలు అతి కష్టం మీద ఇంటి బయటకు వచ్చింది. కానీ అప్పటికే ఆయన కాన్వాయ్ వెళ్లిపోయింది. దాంతో నిరాశతో కూర్చుండిపోయిన నాగుల గంగును ఒక యువకుడు చేతులపై మోసుకుని జగన్ వాహనం వద్దకు తీసుకువెళ్లగా... ఆమెను చూసిన జగన్‌మోహన్‌రెడ్డి వాహనం దిగి దగ్గరకు వెళ్లారు. తనకు రూ.200 మాత్రమే పింఛను వస్తోందని, అది సరిపోవడం లేదని చెప్పిన ఆమెతో... ధైర్యంగా ఉండవ్వా.. నీకు రూ.700 పింఛన్ నేను ఇస్తానంటూ భరోసా ఇచ్చారు. ఇచ్ఛాపురం దాసన్నపేటలో సరోజ అనే మహిళ వచ్చి తన వికలాంగ కుమారుడు హిమతేజకు ఇస్తున్న పింఛన్ సరిపోక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఆమెకు జగన్ ధైర్యం చెబుతూ తాను అధికారంలోకి రాగానే పింఛను రూ.1,000కు పెంచుతానని చెప్పారు. కండ్ర వీధిలో కండ్ర కులస్తులు కలిసి తమను ఎస్సీల్లో చేర్చాలని కోరగా..‘‘తప్పకుండా ఎస్సీల్లో చేర్చేందుకు చర్యలు తీసుకుంటాను. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతాను’’ అని హామీ ఇచ్చారు.

 వెల్లువెత్తిన జనసందోహం..

 జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షో సందర్భంగా ఇచ్ఛాపురం మున్సిపాలిటీ జన జాతరను తలపించింది. మున్సిపాలిటీలోని 23 వార్డుల నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు ఆయన్ను చూసేందుకు తరలివచ్చారు. దాంతో కాన్వాయ్ ముందుకు సాగడమే గగనమైపోయింది. ఇచ్ఛాపురం దాసన్నపేట నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయ ప్రాంతానికి చేరుకోవడానికి గంటన్నర సమయం పట్టిందంటే ఏ స్థాయిలో ప్రజాభిమానం వెల్లువెత్తిందో తెలుస్తోంది. కండ్ర వీధి, కస్పా వీధి, బ్రాహ్మణ వీధి, పంజా వీధి, కాపు వీధి, హరిజన వీధుల మీదుగా రోడ్ షో సాగింది. అప్పటికే సమయం మించిపోవడంతో రోడ్‌షోను ముగించాలని భావించారు. కానీ ఉప్పాడ వీధి, బెల్లుపడలకు చెందిన ప్రజలు వచ్చి తమ ప్రాంతానికి రావల్సిందేనని పట్టుబట్టారు. అప్పటికే మధ్యాహ్న భోజన వేళ మించిపోయింది. అయినా వారి మాట కాదనకుండా జగన్ ఉప్పాడ వీధి, బెల్లుపడ వెళ్లారు. రోడ్‌షో ముగించిన అనంతరం శ్రీకాకుళం మీదుగా విశాఖపట్నానికి బయలుదేరారు. జాతీయరహదారిపై పలుచోట్ల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి జగన్‌ను చూసేందుకు పోటీ పడ్డారు. దాంతో ఆయన తన వాహనాన్ని ఎక్కడికక్కడ ఆపి కిందకు దిగి అందరినీ ఆప్యాయంగా పలకరించారు. అలా లొద్దపుట్టి, శిలగాం, మఖరాం పురం జంక్షన్, అంపురం జంక్షన్, పలాసపురం, కొర్లాం తదితర చోట్ల వేలాదిగా ప్రజలు తరలివచ్చి జగన్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు.
 
 నీ వైద్యానికి నాదీ భరోసా
 
సుభాష్‌చంద్ర, ప్రమీల అనే పేద దంపతులు ఇచ్ఛాపురంలో జగన్‌ను కలిసి ‘‘అన్నా... మా పాప కాళ్లు చచ్చుబడి ఇంట్లో ఉంది. ఒకసారి వచ్చి చూడన్నా..’’ అని కోరడంతో జగన్ వెంటనే వాహనం దిగి వారి ఇంటికెళ్లారు. రెండు కాళ్లూ చచ్చుబడిపోయిన వారి కుమార్తె సుమిత్రా నందాను చూసి చలించిపోయారు. ఏమైందని అడిగారు. ఏదో వ్యాధి సోకి తమ అమ్మాయి నడుం నుంచి కాళ్ల వరకు చచ్చుబడిపోయాయని వారు చెప్పారు. రూ.లక్ష అప్పు చేసి విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించినప్పటికీ ఫలితం లేకపోయిందని వాపోయారు. ‘నాకూ అందరిలో నడవాలని ఉంది సార్’అని సుమిత్ర అనడంతో చలించిపోయిన జగన్.. లోక్‌సభ అభ్యర్థి రెడ్డి శాంతి, పార్టీ నేత నర్తు రామారావులకు ఆ అమ్మాయి బాధ్యత అప్పగించారు. ఆమెకు కావల్సిన వైద్యం చేయించాలని చెప్పారు. తాము పిలిచిన వెంటనే వచ్చి.. ఆదుకుంటామని మాటిచ్చారంటూ సుభాష్ నందా, ప్రమీల కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.
 

సుప్రీంకోర్టులో మొట్టికాయలు వేసిన విషయాన్ని ఎందుకు రాయలేదు?

జగన్‌ను తట్టుకోలేక ఎల్లోగ్యాంగ్ కుట్రలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ధ్వజం
రామోజీ ఆక్రమించిన ఫిలింసిటీ భూములు, పాలమాకుల భూముల గురించి ఎందుకు రాసుకోరు?
నిన్నటి దాకా సీబీఐ పవర్‌ఫుల్ అన్న రామోజీకి ఇప్పుడు ఎఫ్‌బీఐ పవర్‌ఫుల్‌గా కనిపించింది.
గీతం యూనివర్సిటీ కుంభకోణంలో బిగ్‌బాస్ అంటే చంద్రబాబే అని రామోజీ ఆయన పత్రికలో ఎందుకు రాయలేదు?

 
హైదరాబాద్: ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ బలహీనపడిపోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఎల్లోగ్యాంగ్‌లు రోజురోజుకు ప్రజాభిమానాన్ని పెంచుకుంటున్న జగన్‌పై కుట్రలు, కుతంత్రాలకు మరింత పదును పెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. ‘ఈనాడు రాసింది.. చంద్రబాబు వాగాడు. మళ్లీ చంద్రబాబు వాగిందే ఈనాడు రాయడం’ పరిపాటిగా మారిందన్నారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గట్టు మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల పరుగులో చతికిలపడి శల్య రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వీరి కుట్రలో భాగంగా కోతికి కొబ్బరికాయ దొరికిందన్నట్లు ఆమెరికాలోని ఎఫ్‌బీఐ సంస్థ అభియోగాలంటూ పేజీలకు పేజీలు రాసుకుంటూ జగన్‌పై ఎల్లోగ్యాంగ్ విషంగక్కుతోందని ధ్వజమెత్తారు. ‘ఈనాడు రామోజీరావుకు ఆమెరికా అభియోగాలయ్యేసరికి అంత అందంగా కనిపిస్తున్నాయా? ఏం రామోజీపై దేశంలో,
రాష్ట్రంలో ఎన్ని అభియోగాలు లేవు’ అని అన్నారు.

 ఆమెరికాలో ఉన్న కంపెనీతో టైటానియం డీల్ ఒకటి జరిగిందని, దాంట్లో కుంభకోణముందని ఆ అభియోగంలో ఆరుగురు పేర్లను ప్రస్తావించారట! అందులో ఒకటి కేవీపీ పేరుంటే దానికి జవాబు చెప్పుకోవాల్సింది ఆయనే. దాన్ని తీసుకొచ్చి ‘సిన్నోడి మేతే’ అంటూ రామోజీ తన పత్రికలో రాస్తారు.  దానికి చంద్రబాబు సిన్నోడంటే జగన్ అని చెబుతారు. అందులో ఎక్కడా జగన్ పేరు లేకపోయినా ఇరువురూ శివాలెత్తారు.

 ఎఫ్‌బీఐ ప్రస్తావించిన ఆరుగురి పేర్లలో వైఎస్ పేరుగాని, జగన్ పేరుగానీ ఎక్కడైనా ఉన్నాయా? ఎలాంటి సంబంధం లేని వాటిని తీసుకొచ్చి జగన్‌కు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఫిర్టాస్ అనే వ్యక్తి అసలు ఎవరికీ ముడుపులు ఇవ్వలేదంటున్నారు. కానీ దీన్ని తీసుకొచ్చి జగన్‌కు అంటగట్టడం సిగ్గుచేటు.

 ఎఫ్‌బీఐ మోపిన అభియోగంలో సీఎంకు బంధువని ప్రస్తావించారు. రక్తం పంచుకు పుట్టిన జగన్ ఏమైనా వైఎస్‌కు బంధువా? కుటుంబ సభ్యులను ఎక్కడైనా బంధువుగా ప్రస్తావిస్తారా? అంటే వారి ఆలోచన ప్రకారం చంద్రబాబుకు ఆయన కుమారుడు లోకేష్ బంధువా? రామోజీకి వారి కొడుకులు సుమన్, కిరణ్‌లు బంధువులా?
 
వీరి తీరు చూస్తుంటే చంద్రబాబు ఇంట్లో పిల్లి పాలు తాగకపోయినా దానికి జగన్ కుట్రే ఉందని ఎల్లోగ్యాంగ్ ప్రచారం చేసేలా ఉంది! జనాభిమానాన్ని పొందలేకజగన్ ఫోబియో పట్టుకొని నిత్యం బురద చల్లే ప్రయత్నంలో చంద్రబాబు, రామోజీ మునిగిపోయారు.
 ఓట్లు, సీట్ల కోసం ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తారా? వైఎస్ మరణం తర్వాత నాలుగేళ్లుగా ఎన్నో తప్పుడు ప్రచారాలు, అక్రమ కేసులతో అభాండాలు మోపుతూనే ఉన్నారు.

 రామోజీ.. అబ్దులాపూర్‌మెట్ దగ్గర నుంచి రామోజీ ఫిలిం సిటీ దాకా ఉన్న నాలుగు కిలోమీటర్ల దారి నీకెక్కడిదో, ఎవరి దగ్గర కొన్నావో నీ పత్రికలో రాసుకోగలవా? ఫిలిం సిటీలో ఉన్న 20 ఎకరాల అసైన్డ్ భూమిని వదిలిపెట్టావా? పాలమాకులలో అక్రమంగా ఆక్రమించుకున్న 320 ఎకరాల విషయాన్ని రాస్తావా? రామోజీని ఎన్నిసార్లు అరెస్టు చేయలేదు? విశాఖలోని ఈనాడు స్థలం వివాదానికి సంబంధించి

సుప్రీంకోర్టులో మొట్టికాయలు వేసిన విషయాన్ని ఎందుకు రాయలేదు?

 రామోజీకి సీబీఐకన్నా ఎఫ్‌బీఐ పవర్‌ఫుల్‌గా కనిపించిందట! నిన్నటిదాకా సీబీఐని మించిన పవర్‌ఫుల్ సంస్థ మరొకటి లేదన్నారు. అంతకుముందు అదే సీబీఐని... కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ప్రచారం చేసినదీ రామోజీయే. ఆ సంస్థ జగన్ కేసు చేపట్టే సరికి పునీతమైందట!  అసెంబ్లీలో గీతం యూనివర్సిటీ కుంభకోణంలో బిగ్‌బాస్ ఉన్న లెటర్‌ను మైసూరారెడ్డి బయటపెడితే, ఈ బిగ్‌బాస్ చంద్రబాబే అని రామోజీ ఆయన పత్రికలో ఎందుకు రాయలేదు?

వైఎస్సార్ సీపీలో టీడీపీ, కాంగ్రెస్ నాయకుల చేరిక

శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లాకు చెందిన పలువురు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నివాసానికి వచ్చినప్పుడు ఆయన్ని పలువురు నాయకులు కలిసి పార్టీలో చేరనున్నట్లు తమ అభిప్రాయాన్ని తెలిపారు. వీరందరికీ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
 
పార్టీలో చేరిన వారిలో పాతపట్నం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కొవగాపు సుధాకర్, టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర సభ్యుడు సిర్ల రామారావు, మాజీ కౌన్సిలర్లు పేర్ల ప్రకాష్, బరాటం కూర్మారావు, పిల్లల నీలాంద్రితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లు రెడ్డి మోహనరావు, ఎంఏ రఫీ, గన్ని రాజు, కెల్ల కొండలరావు, టెలికాం ఎడ్వయిజరీ కమిటీ సభ్యుడు డబ్బీరు వాసుదేవరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కిల్లాన భోజ్‌కుమార్, పైడి మురళీ, పి. సాయి, దూసి నాగేశ్వరరావు, బి.జ్యోతి, సౌజన్య, రాధారాణి, శిమ్మ రాజశేఖర్‌లు ఉన్నారు. వీరితో పాటు శ్రీకాకుళం రూరల్ మండలం, గార మండలాలకు చెందిన పలువురు దేశం, కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు.

హిందూ ధర్మ రక్షణకు వైఎస్ కృషి

Written By news on Friday, April 4, 2014 | 4/04/2014

వైఎస్ రాజశేఖరరెడ్డి హిందూ సమాజానికి ఎంతో మేలు చేశారు. ధార్మిక రక్షణ ప్రాముఖ్యతను గుర్తించారు. ముఖ్యమంత్రి అయ్యాక దేవాదాయ ధర్మాదాయ చట్టానికి 2007లో సవరణలు తెచ్చారు. దేవాలయాల పునరుద్ధరణకు నడుం బిగించారు. 25 వేల దేవాలయాలను పునరుద్ధరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. బ్రాహ్మణుల సంక్షేమానికి బాటలు వేశారు. వైఎస్ తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. రోశయ్య, కిరణ్‌లు చట్టాన్ని అమలుచేయలేదు. చాలా దేవాలయాలు శిథిలాలుగా మారుతున్నాయి.


వైఎస్సార్ 2003లో ‘ప్రజాప్రస్థానం’లో అర్చకులు పడే అవస్థలను, దేవాలయాల్లో పరిస్థితిని కళ్లారా చూశారు.

చిలుకూరు వెంకటేశ్వరుడిని సందర్శించుకున్న సందర్భంగా అర్చకులు వైఎస్సాఆర్‌ను ‘అధికారంలోకి వస్తే దేవాలయాల్ని రక్షిస్తారా?’ అని అడిగారు. తప్పకుండా చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు.

పాదయాత్ర ముగిశాక ఎన్నికల ప్రణాళికలో 1987 దేవాదాయ చట్టాన్ని సవరిస్తానన్న హామీని పొందుపరిచారు. ఈ అంశంపై సోనియా వద్ద కూడా చర్చ పెట్టారు కూడా.

ఈ హామీతో వైఎస్సాఆర్‌కు ఓటు వేయమని కోరుతూ దేవుడికి రెండు ప్రదక్షిణలు అదనంగా చేయమని అర్చకులు భక్తులకు విన్నవించారు. 2004లో వైఎస్సార్ అఖండ మెజారిటీతో గెలుపొందారు. 2007లో చ ట్టాన్ని సవరించారు.

అర్చక వెల్ఫేర్ ఫండ్‌ని ఏర్పాటు చేశారు. అందులో ప్రస్తుతం రూ. 130 కోట్లు ఉన్నాయి. దానిద్వారా వచ్చే వడ్డీ నుంచి దేవాలయాలకు సాయం చేస్తుంటారు.

అర్చకులకు ఆరోగ్య బీమా సౌక ర్యం కల్పించారు.

విద్య గృహనిర్మాణానికి రుణాలు అందజేశారు.

గ్రాట్యుటీ, పెన్షన్ స్కీంను ఏర్పాటు చేశారు.

ఎవరికైనా ఆపరేషన్ చేయాల్సి ఉంటే అర్చక సంక్షేమ నిధి నుంచి రూ.లక్ష ఇచ్చే వెసులుబాటు కల్పించారు

కామన్‌గుడ్ ఫండ్‌ను ఏర్పాటు చేసి దేవాలయాల పునరుద్ధరణకు శ్రీకారంచుట్టారు

వైఎస్ రాజశేఖరరెడ్డి ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేసి అర్చకులకు వేతనాలు అందించాలని చెప్పారు.

3/2007 సెక్షన్-ఎ ప్రకారం రాష్ట్ర స్థాయిలో ఒక బ్యాంకు ఏర్పాటు చేసి వేతనాలు అందించాలని చట్టాన్ని సవరించారు. అందరు ఎమ్మెల్యేలను ఒప్పించి మరీ ఈ చట్టాన్ని ఆమోదింపచేశారు.

రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాల్లో అర్చకులకు సేవా టిక్కెట్లలో వాటా, హుండీల్లో వాటా ఉండాలని చెప్పారు.

దేవాలయాల్లోని ధర్మకర్తల మండలిలో అర్చకులకు స్థానం కల్పించారు.

గ్రామాల్లో వర్షాలు పడాలన్నా... రైతుల జీవితాలు బాగుపడాలన్నా గ్రామీణ ప్రాంతాల్లోని దేవాలయాల్లో పూజలు కొనసాగాలని, అలా ఉండాలంటే అర్చకుల జీవితాలు బాగుపడాలని వైఎస్ ఆకాంక్షించారు.

ఆ మేరకు ఐదు వేల దేవాలయాల్లో దూపదీప నైవేద్యం కింద ప్రతి అర్చకునికి నెలకు రూ. 2,500 చొప్పున వేతనం అమలుచేశారు.

ప్రస్తుతం ఈ వేతనాన్ని ఐదు ఎకరాల భూమి ఉన్న దేవాలయాల్లోని అర్చకులకు నిలిపివేశారు. దీంతో ఆయా కుటుంబాలన్నీ నానా ఇబ్బందులు పడుతున్నాయి.

దేవాలయ వ్యవస్థను కుప్పకూల్చిన చట్టం


దేవాలయాలకు సంబంధించి 1983లో ఎన్టీఆర్ ప్రభుత్వం చల్లా కొండయ్య కమిషన్ వేసింది.

దేవాలయాలు బ్రాహ్మణులు జీవించడం కోసం పెట్టుకున్నవేనని కమిషన్ నివేదికను ఎన్టీఆర్ నమ్మారు. ఈ నేపథ్యంలోనే 1987లో దేవాదాయ ధర్మాదాయ చట్టం తీసుకొచ్చారు.

ఇది ఆలయాల్లో అర్చక బాధ్యతలకు వంశపారంపర్య హక్కును తొల గించింది.

హారతి పళ్లెంలో వచ్చే చిల్లరను కూడా అర్చకులు తీసుకోవద్దని శాసించింది.

అర్చకులకు ఆలయాల్లో భక్తులు ఇచ్చే సంభావనలను అడ్డుకుంది. వాటిని హుండీ లో వేయించింది.

అర్చకులు ఎక్కడ ఓ రూపాయి కోసం ఆశపడాతారోనన్న అనుమానంతో నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు.

ఈ చట్టం తమ జీవితాలను చిందరవందర చేసిందని అర్చకులంతా ఎన్టీఆర్‌కు మొరపెట్టుకున్నారు.

వాస్తవం గుర్తెరిగి అర్చకుల న్యాయమైన డిమాండ్లను అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఎన్టీఆర్ వేశారు.

1995 ఆగస్టు 15న ఏర్పడిన ఈ కమిటీ నివేదిక సమర్పించే సమయానికి ఎన్టీఆర్‌ను దించేసి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో పరిస్థితి మరింత దారుణమైన స్థితికి చేరుకుంది.

చంద్రబాబునాయుడు అర్చకుల గోడు ఏమాత్రం పట్టించుకోలేదు.
పైగా అర్చకులు, దేవాలయాల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్న చట్టాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేశారు.

2001లో పూజారులను తొలగించేందుకు రిటైర్‌మెంట్ స్కీంను పెట్టారు.

జీతాలు లేవు... పెన్షన్లు లేవు... రిటైర్‌మెంటు మాత్రం పెట్టి అనేకమందిని వెళ్లగొట్టారు. దీంతో అర్చకులు అల్లల్లాడిపోయారు.

మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్‌లో భీమసేనాచారి అనే అర్చకుడి కి 58 ఏళ్లు నిండాయని, రేపటి నుంచి రాకూడదని నోటీసు వచ్చింది.

దీంతో తనకు దిక్కూమొక్కూ లేదని భావించిన భీమసేనాచారి 2001, సెప్టెంబర్ 17 తెల్లవారుజామున గుడి గంటకు అంగవస్త్రంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.



http://community.ysrcongress.com/Welcome.aspx#/articles

Popular Posts

Topics :