09 November 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ఇది అబద్ధాల ప్రభుత్వం!

Written By news on Saturday, November 15, 2014 | 11/15/2014


* బాబు సర్కారుపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
ఎన్నికలకు ముందు చంద్రబాబు అన్నీ చేస్తామని హామీ ఇచ్చారు
ఇప్పుడేమో ఒక్కటీ అమలు చేయలేకపోతున్నారు
మైనార్టీ గురుకుల పాఠశాలకు ఆరుగురు మంత్రులు.. 9సార్లు వచ్చి ఏం చేశారు?
పిల్లలు పడుకోవడానికి చోటు లేక క్లాస్ రూమ్‌లో పడుకుంటున్నారు
స్నానం చేయడానికి స్నానాల గదులు లేని దౌర్భాగ్యం
విద్యార్థులకు తాగడానికి మంచినీరు ఇవ్వలేరా?
ఎంపీ గ్రాంటు కేటాయించి సమస్యలు తీరుస్తామని జగన్ హామీ

సాక్షి, కడప: ‘‘అధికారంలోకి రాకముందు అన్నీ చేస్తామన్నారు.. ఇప్పుడేమో ఒక్కటీ చేయలేకపోతున్నారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ఇది అబద్ధాల ప్రభుత్వం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం వేంపల్లె సమీపంలోని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా అక్కడ విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల (ఇంగ్లిష్ మీడియం) రాయలసీమలో ఒక్కటి మాత్రమే ఉందని, దీన్ని కూడా ప్రభుత్వం ఇంత అధ్వానంగా నడుపుతూ విద్యార్థుల సంక్షేమాన్ని మరిచిపోయిందన్నారు. ఆధునిక యుగంలో ఉన్నాం.. చిన్నారులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? అని ఆయన ప్రశ్నించారు.

మైనార్టీ పాఠశాలలో 250 మంది విద్యార్థినులు చదువుతుంటే.. కేవలం 7 బాత్రూములను ఏర్పాటు చేశారన్నారు. విద్యార్థులు కనీసం స్నానం చేసుకోవడానికి కూడా బాత్రూములను పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఇవ్వకపోవడం చాలా దౌర్భాగ్యమైన చర్యగా అభివర్ణించారు. అంతమంది విద్యార్థులకు ఏడు బాత్రూములు ఎలా సరిపోతాయని ఆలోచన చేయకపోవడం విచారకరమన్నారు. చివరకు విద్యార్థినులు పడుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారని... ప్రత్యేక వసతి గదుల నిర్మాణం పూర్తి చేయకపోవడంతో ఇప్పటికీ తరగతి గదిలో పడుకుంటుండటం ప్రభుత్వానికి సిగ్గు చేటు అని అన్నారు. పాఠశాల ఆవరణలో లైట్లు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. తాగడానికి మంచినీటి సరఫరా కూడా లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

ఆరుగురు మంత్రులు 9సార్లు వచ్చి ఏం చేశారు?
‘‘తెలుగుదేశం ప్రభుత్వానికి చెందిన ఒక ఉప ముఖ్యమంత్రి సహా ఆరుగురు మంత్రులు..  వేంపల్లెకు తొమ్మిదిసార్లు వచ్చారు. ఏమి చేశారు.. చివరకు పాఠశాలలో నెలకొన్న చిన్న, చిన్న పనులను కూడా పూర్తి చేయలేదు.. మంత్రులు కూడా పట్టించుకోలేదు. ఎన్నిసార్లు వస్తే ఏం ప్రయోజనం?’’ అని జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ఇన్నిసార్లు వేంపల్లెకు వచ్చినా.. విద్యార్థుల మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించకపోవడం ఏమిటన్నారు.

ఎంపీ నిధులతో మౌలిక వసతులు కల్పిస్తాం
విద్యార్థులు సమస్యలపై ఏకరువు పెట్టడంతో వెంటనే జగన్ స్పందించారు. పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో మాట్లాడి.. పాఠశాలకు సంబంధించి బాత్రూములు, లైట్లు, మినరల్ వాటర్ ప్లాంటు, పెండింగ్‌లో ఉన్న డార్మేటరి బిల్డింగుల నిర్మాణాలకు ఎంపీ నిధులు వెచ్చించి పూర్తి చేస్తామని చిన్నారుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

నెహ్రూ చిత్రపటం వద్ద వైఎస్ జగన్ నివాళి
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన జవహర్‌లాల్ నెహ్రూ చిత్ర పటానికి జగన్‌మోహన్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ప్రభావతి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వేంపల్లె మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ షబ్బీర్‌వలీ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్ వెంటే

Written By news on Friday, November 14, 2014 | 11/14/2014


'రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్ వెంటే'
విశాఖపట్నం: రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే నడుస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ ఇన్ చార్జి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ స్పష్టం చేశారు.

సింహాచలంపై భూసమస్యపై వినతిపత్రం అందజేయడానికే మంత్రి గంటా శ్రీనివాసరావును కలిశానని ఆయన తెలిపారు. వివిధ వార్తాచానళ్లలో వస్తున్నట్టుగా తమ మధ్య రాజకీయపరమైన చర్చలు జరగలేదని ఆయన వివరణయిచ్చారు. తనపై అసత్య ప్రచారం చేయొద్దని ఆయన కోరారు.

అక్రమ కేసులకు భయపడం: పిన్నెల్లి


అక్రమ కేసులకు భయపడం: పిన్నెల్లి
మాచర్ల(గుంటూరు జిల్లా): అక్రమ కేసులకు భయపడేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాచర్ల ఎమ్మెల్నే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా ఎదుర్కొంటామని చెప్పారు. తమపై తప్పుడు కేసులు పెట్టినవారు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని అన్నారు.

శుక్రవారం మాచర్ల చేరుకున్న పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి ఘనస్వాగతం లభించింది. నాగార్జున్ సాగర్ నుంచి భారీ బైక్ ర్యాలీతో మద్దతుదారులు ఆయనకు స్వాగతం పలికారు. సరస్వతి పవర్, ఇండస్ట్రీస్ భూముల వ్యవహారంలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన అరెస్ట్‌పై హైకోర్టు గురువారం స్టే విధించింది.

మాజీ ప్రధాని నెహ్రూకు వైఎస్ జగన్ నివాళి


వైఎస్సార్ జిల్లా: భారత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. శుక్రవారం నెహ్రూ 125 జయంతి వేడుకల్లో భాగంగా వేంపల్లి ఉర్దూ బాలిక గురుకుల పాఠశాలకు విచ్చేసిన జగన్.. ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో జగన్ ముచ్చటించారు.
 
ఈ క్రమంలోనే పాఠశాలలో సౌకర్యాలు సరిగా లేవంటూ విద్యార్థులు జగన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన జగన్.. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అఖిలప్రియ


* ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అఖిలప్రియ  
ఆళ్లగడ్డతోపాటు నంద్యాల ప్రజలనూ కలుసుకుంటానని వెల్లడి

సాక్షి, హైదరాబాద్: ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన భూమా అఖిలప్రియ గురువారం ఎమ్మెల్యేగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఉదయం 9.40 గంటలకు ఆమెతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీలోని తన చాంబర్‌లో ప్రమాణం చేయించారు. తెలుగులో దేవునిసాక్షిగా ప్రమాణం చేసిన అఖిలప్రియ పీఏసీ ఛైర్మన్ భూమా నాగిరెడ్డి, దివంగత ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి దంపతుల కుమార్తె. తన తల్లి శోభ మృతి వల్ల ఏర్పడిన ఖాళీ నుంచి ఆమె ఏకగ్రీవంగా ఇటీవలే ఎన్నికైన విషయం విదితమే.

నవంబర్ 3వ తేదీనే ప్రమాణస్వీకారం చేయాలని భావించినప్పటికీ తన తండ్రి నాగిరెడ్డి అక్రమ కేసులో అరెస్టయి ఉన్నందున ఈ కార్యక్రమాన్ని గురువారం నాటికి వాయిదా వేసుకున్నారు. బెయిల్ లభించక పోవడంతో తన కుమార్తె ప్రమాణస్వీకారోత్సవానికి నాగిరెడ్డి హాజరు కాలేక పోయారు. ఇదే విషయాన్ని అఖిలప్రియ తన ప్రమాణస్వీకారం పూర్తయిన తరువాత మీడియాతో మాట్లాడుతూ ఆవేదనగా వెల్లడించారు.

‘‘అమ్మ లేని లోటు ఓ వైపు, నాన్న ఉండి కూడా రాలేని పరిస్థితి చూస్తే నాకు చాలా బాధగా ఉంది. నాన్న పక్కన లేనిదే ప్రమాణం చేయనని తాను చెప్పానని, అయితే తాను వచ్చేవరకూ నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉండటం ఏ మాత్రం సరికాదని, వారి అవసరాలు చూడాల్సిన బాధ్యత మనపై ఉందని నాన్న నచ్చ జెప్పడంతో ప్రమాణస్వీకారానికి వచ్చాను’’ అని ఆమె తెలిపారు. తానికపై ప్రజ ల్లోకి వెళతానని, ఆళ్లగడ్డతో పాటుగా నంద్యాల ప్రజలను కూడా కలుసుకుంటానని తెలిపారు.

తప్పుడు కేసులు అన్యాయం
తన తండ్రి నాగిరెడ్డితో పాటుగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలపై సర్కారు తప్పుడు కేసులు పెట్టి వేధించడం అన్యాయమని, సమయం వచ్చినపుడు ప్రజలే తగిన రీతిలో సమాధానం చెబుతారని అఖిలప్రియ హెచ్చరించారు. అక్రమ కేసులకు గురై వేధింపుల పాలవుతున్న నంద్యాల మున్సిపల్ కౌన్సిలర్లను, వారి కుటుంబీకులను తాను తొలుత కలుసుకోబోతున్నట్లు తెలిపారు. ఆ తరువాత ఆళ్లగడ్డలోని ప్రతి మండలంలోనూ పర్యటిస్తానన్నారు. తన తండ్రికి త్వరలో బెయిల్ వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆయన బయటకు వచ్చాక ఇద్దరమూ కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తనపై ఉంచిన నమ్మకానికి సార్థకత చేకూరుస్తూ ఆయన గర్వపడేలా ఎమ్మెల్యేగా పనిచేస్తానని అఖిలప్రియ చెప్పారు.

కక్షసాధింపు తగదు
తమ పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, ప్రజాస్వామ్యంలో ఇదెంత మాత్రం మంచిది కాదని వైఎస్సార్‌సీ శాసనసభాపక్షం ఉప నేత జ్యోతుల నెహ్రూ విమర్శించారు. అందరికీ తలలో నాలుక మాదిరిగా మెలిగే మంచి నాయకురాలు శోభ మృతి చెందడం, భూమా నాగిరెడ్డి రిమాండ్‌లో ఉండటం చూస్తే ఆ కుటుంబాన్ని దురదృష్టం వెన్నాడుతోందన్న బాధ కలుగుతోందన్నారు. తల్లి, తండ్రులిద్దరూ లేని స్థితిలో అఖిలప్రియ ప్రమాణస్వీకారం చేయాల్సి రావడం నిజంగా బాధాకరమన్నారు.

జగన్ టీంలోకి ఒక యువశాసనసభ్యురాలిని అందించిన కర్నూలు ప్రజలకు తాను అభినందనలు తెలుపుతున్నానని, వైఎస్సార్‌సీపీకి ఆ జిల్లాలో ఇక తిరుగు లేదని చెప్పారు. భవిష్యత్‌లో అఖిల ప్రియ ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు  మైసూరారెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎస్.వి.మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, భూమా కుటుంబీకులు హాజరయ్యారు. ఏపీ శాసనసభ కార్యదర్శి (ఇన్‌చార్జి) కె.సత్యనారాయణరావు ప్రమాణస్వీకారాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు.

పాల కల్తీ నెపం రైతులపైకా?


పాల కల్తీ నెపం రైతులపైకా?: గడికోట
‘హెరిటేజ్’పై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట మండిపాటు 
సాక్షి, హైదరాబాద్: హెరిటేజ్ పాలల్లో కల్తీ నెపాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రైతులపైకి నెట్టడం దారుణమని వైఎస్సార్‌సీ శాసనసభాపక్షం కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. రైతులు తమ గేదెల నుంచి అమృతాన్ని హెరిటేజ్ సంస్థకు అప్పగిస్తే ప్యాకింగ్ సందర్భంగా వాటిలో విషం కలిస్తే అందుకు బాధ్యత రైతులదవుతుందా? అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శ్రీకాంత్‌రెడ్డి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాటాడారు. హెరిటేజ్‌లో విష పదార్థాలున్నాయని చెబితే తమకు గేదెలు లేవని రైతుల నుంచే పాలు సేకరిస్తున్నామని చెప్పడం అర్థమేమిటని ప్రశ్నించారు. విషపదార్థాలున్నాయని ఎవరైనా చెబితే హెరిటేజ్ పాలల్లో అలాంటివి లేవని నాణ్యతా పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ పొంది ప్రజలకు చెప్పాలే గాని, ఆ నెపాన్ని రైతులపై తోసి వేయకూడదన్నారు.
 
‘పాల్మాలిన్’ అనే  పదార్థం హెరిటేజ్ పాలల్లో ఉన్నందువల్ల నిషేధిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం తన గెజిట్‌లో ప్రకటించిందని వెల్లడిస్తూ దాని ప్రతిని విలేకరులకు చూపించారు. థర్డ్‌పార్టీ నిపుణులతో వాటిని పరీక్షింపజేసి, ఆ పాలు ఆరోగ్యరీత్యా సురక్షితమైనవేనని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. వాస్తవానికి ప్రస్తుతం మార్కెట్‌లో అన్ని రకాల ఆహారపదార్థాల్లోనూ విపరీతంగా కల్తీ జరుగుతోందని, దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి తీరని హాని కలుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజల ఆరోగ్యం కన్నా తన కుమారుడి వ్యాపారం బాగుంటే చాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారని విమర్శించారు. ఒక్క హెరిటేజ్‌వే కాదు, మార్కెట్‌లో ఉన్న అన్ని బ్రాండ్‌ల ఆహారపదార్థాలపైనా ఇదే విధమైన తనిఖీని నిర్వహించి వాటిలో ఎలాంటి కల్తీ లేదని, విషపూరితాలు లేవని సర్టిఫికెట్లు ఇవ్వాలని సూచించారు. తాము ఎవరిమీదనో బురద జల్లే ఉద్దేశ్యంతోనో, రాజకీయ లబ్ధి కోసమో ఈ అంశాలు చెప్పడం లేదని ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విషయాలు చెబుతున్నామని ఆయన తెలిపారు.

పోలవరం బాధితులను ఆదుకోండి: తాటి


పోలవరం బాధితులను ఆదుకోండి: తాటి
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల ప్రజలకు న్యాయం చేయాలని వైసీపీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గిరిజనులు, అక్కడి ఉద్యోగులు తీవ్ర ఆందోళన లో ఉన్నారని, శాసనసభ వేదికగా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. వారందరికీ తెలంగాణలోనే పునరావాసం కల్పించాలని కోరారు. ఏడుమండలాలు ఆంధ్రప్రదేశలో విలీనమయ్యాయనే సాకుతో బూర్గంపాడు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని.. జెడ్పీటీసీకి అర్హత లేకుండా చేయటం అన్యాయమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రస్తావిం చారు.

పత్తికి మద్దతు ధర కల్పించండి: ఎంపీ పొంగులేటి


పత్తికి మద్దతు ధర కల్పించండి: ఎంపీ పొంగులేటికేంద్రమంత్రి రాధామోహన్ కు వినతిపత్రం అందిస్తున్న ఎంపీ పొంగులేటి
సాక్షి, న్యూఢిల్లీ: పత్తికి మద్దతు ధర కల్పించి తెలంగాణ రైతులను ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కేంద్రాన్ని కోరా రు. ఈ మేరకు ఆయన గురువారం కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించకపోవడంతో ఉన్న రుణా లు మాఫీకాక, బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వక పత్తి రైతులు ప్రైవేటుగా అప్పులు తీసుకువచ్చి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి పంట సాగుచేశారని పేర్కొన్నారు. కొద్దిమంది రైతులు మంగళసూత్రాలు తాకట్టుపెట్టి డబ్బులు తీసుకువచ్చారని అన్నారు.
 
  కరువు కారణంగా పంట రాక తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పండిన కొద్దిపాటి పంటకూ గిట్టుబాటు ధర చెల్లించకపోవడంతో కూలీ రేట్లు కూడా రావడం లేదని వాపోయారు. పత్తికి మద్దతు ధర  కేవలం రూ. 4,050  ప్రకటించినా కాటన్ కార్పొరేషన్‌కు చెందిన కొనుగోలు కేంద్రాలు ఆ ధర చెల్లించడం లేదని వాపోయారు. ఇప్పటివరకు 350 మంది పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.  పత్తికి కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ. 4050 నుంచి రూ. 5 వేలకు పెంచాలని, కాటన్ కార్పొరేషన్ కేంద్రాలను మరిన్ని పెంచి మద్ధతు ధర కల్పించాలని, మృతిచెందిన రైతుల కుటుంబాలకు రూ. 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆయన కేంద్రానికి సూచించారు.

మింగడానికి మెతుకు లేదుగాని....

Written By news on Thursday, November 13, 2014 | 11/13/2014

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం... అందుకు భూముల సేకరణపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై గుంటూరు జిల్లాలోని ఉండవల్లి, పినమాక, నిడమర్రు గ్రామాల్లోని రైతులు నిప్పులు చెరిగారు.  గురువారం వైఎస్ఆర్ సీపీ రైతు పరిరక్షణ కమిటీ సదరు గ్రామాలలో పర్యటిస్తూ... పొలాలను  సందర్శిస్తూ.... రైతులతో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు బాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజధాని కోసం తమ భూములు తీసుకుని సింగపూర్ చేస్తానంటున్న చంద్రబాబు వైఖరి చూడబోతే మింగడానికి మెతుకు లేదుగాని మీసాలకు సంపెంగ నూనె రాసినట్లుగా ఉందని వారు ఎద్దేవా చేశారు.
 
రాజధాని నిర్మాణం కోసం వాడెవడికో ఎకరాలకు ఎకరాలు ఇస్తాడంటా.... తమ భూములు తీసుకుని ప్రత్యామ్నాయంగా గజం స్థలం కూడా ఇవ్వడం లేదని వారు బాబు వైఖరిని తుర్పారబెట్టారు. రాజధానిని నిర్మించే ప్రాంతానికి సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఇస్తే చాలు అంతకన్నా ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదని వారు అభిప్రాయపడ్డారు. పదేపదే బాబు సింగపూర్ లా నిర్మాస్తామంటున్నారు.... అంటే సింగపూర్, మలేషియా వాళ్లు బాగా పరిపాలించుకునేవాళ్లు... మనం మాత్రం చేతగానివాళ్లమా అని ప్రశ్నించారు.

రాజధానికి భూములు ఇవ్వబోమని ఉండవల్లి రైతులు వైఎస్ఆర్ సీపీ కమిటీ సభ్యుల ఎదుట స్పష్టం చేశారు. ఆ క్రమంలో తాము చేసే పోరాటంలో కలసి రావాలని వారు కమిటీ సభ్యులకు కోరారు. దేశంలో ఎక్కడా లేని సౌకర్యాలన్నీ... తమ ప్రాంతాలో ఉన్నాయని వారు గుర్తు చేశారు. ఈ విషయంలో మనం చైనాను మనం నేర్చుకోవాలన్నారు. పేద రైతుల నుంచి భూములు తీసుకుని ... అదీ ఇదీ చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు.

రాజధానిని నిర్మించే ముందు నిపుణుల సలహాలు సూచనలు తీసుకోవాలని రైతులు చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సరైన అధ్యయనం, ప్రణాళిక లేకుండా చంద్రబాబు రాజధానిని ఏర్పాటు చేస్తామంటున్నారని విమర్శించారు. ప్రతి అంశంలోనూ చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణం విషయంలో సీఎంగా ఉన్న చంద్రబాబు ఏనాడైనా రైతులు, నాయకులను పిలిచి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారా అని ప్రశ్నించారు.  

కృష్ణానది ఒడ్డున సారవంతమైన భూములు ఉన్నాయి... వాటిని రాజధాని పేరుతో తీసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం కోసం మొదట 30 వేలు ఎకరాలు ... ఆ తర్వాత 60 వేల ఎకరాలు... ఇప్పుడు లక్షన్నర ఎకరాలు అంటున్నారని తీవ్ర ఆందోళనతో వెల్లడించారు. ఇంత భూమి తీసుకుని రాజధానిని ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా కట్టారా ? అని ప్రశ్నించారు. తమ భూముల్లో సంవత్సరానికి మూడు పంటలు పండుతున్నాయి... ఈ భూముల ఆధారంగా చేసుకుని వ్యవసాయ కార్మికులు, కూలీలు బతుకుతున్నారని రైతులు గుర్తు చేశారు.అలాంటి భూములు ఇస్తే మా జీవితాలకు భద్రత కోల్పోతామని వారు తీవ్ర కలత చెందారు. రాజధాని నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని రాకముందే... ఇక్కడ భూములకు విపరీతమైన ధర పలికిందని తెలిపారు. కానీ ఆ సమయంలోనే తాము భూములు విక్రయించలేదని ఉండవల్లి రైతులు వైఎస్ఆర్ సీపీ పరిరక్షణ కమిటీ ఎదుట తమ గోడు వెల్లబుచ్చారు.

లోకేష్ వ్యాపారాల కోసం ప్రజల ఆరోగ్యం పణం:శ్రీకాంత్ రెడ్డి


లోకేష్ వ్యాపారాల కోసం ప్రజల ఆరోగ్యం పణం:శ్రీకాంత్ రెడ్డిశ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేష్ బాబు వ్యాపారాల కోసం ప్రజల ఆరోగ్యం పణంగా పెడుతున్నారని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. హెరిటేజ్ పాలలో కల్తీ జరుగుతుందంటూ కేరళ ప్రభుత్వం గతంలో నిషేధం విధిస్తూ గెజిట్ లో కూడా ఇచ్చిందని తెలిపారు. హెరిటేజ్ పాలలో కల్తీని రైతులపై నెట్టడం సరికాదన్నారు. ప్రజల భద్రత కోసం ఆలోచన చేసి మాట్లాడాలన్నారు. ధైర్యముంటే తమ కంపెనీలో ఎలాంటి కల్తీలేదని చెప్పాలని సవాల్ విసిరారు. తప్పులను ఇతరులపై నెట్టడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. రైతులు అమృతం ఇస్తే, తను ప్రజలకు విషం ఇస్తున్నాడన్నారు.

నిపుణులతో తనిఖీలు చేయించేంత వరకు హెరిటేజ్ ఉత్పాదనలు నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. హెరిటేజ్ పాలలో క్యాన్సర్ కారక ఉత్ప్రేరకాలు ఉన్నాయా? లేదా? అన్నది స్పష్టం చేయాలన్నారు. ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని తాము డిమాండ్లు చేస్తున్నట్లు తెలిపారు. తమకు ఎటువంటి దురుద్దేశాలు లేవని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.

ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్ పై హైకోర్టు స్టే


ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్ పై హైకోర్టు స్టేపిన్నెల్లి రామకృష్ణా రెడ్డి
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్ట్ పై హైకోర్టు స్టే విధించింది. గుంటూరు జిల్లా సరస్వతి భూముల వ్యవహారంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, వెంకట రమణా రెడ్డి, వేణుగోపాల రాజులతోపాటు మరికొంతమంది అరెస్ట్ పై స్టే విధించింది.

తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నిందితులను అరెస్ట్ చేయరాదని కోర్టు తెలిపినట్లు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు.

వైఎస్ఆర్ సీపీ నియామకాలు

వైఎస్ఆర్ సీపీ ఏపీ  ప్రధాన కార్యదర్శిగా సి.మధుసూదన రెడ్డిని నియమించారు. చిత్తూరు జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిగా టి.ఆదికేశవులు రెడ్డిని నియమించారు.

చిత్తూరు జిల్లా పార్టీ క్రమశిక్షణా సంఘం సభ్యుడిగా తిరుపతి రెందిన మణిని నియమించారు.

నేడు భూమా అఖిలప్రియ ప్రమాణ స్వీకారం


నేడు భూమా అఖిలప్రియ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన భూమా అఖిలప్రియ గురువారం ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్యేగా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీలోని తన చాంబర్‌లో ఆమె చేత ప్రమాణం చేయిస్తారని వైఎస్సార్ సీపీ శాసనసభాపక్షం ఒక ప్రకటనలో తెలిపింది.

నేటి నుంచి వైఎస్సార్ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన


నేటి నుంచి వైఎస్సార్ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
3 రోజుల పాటు జిల్లాలో పలు కార్యక్రమాలకు హాజరు
 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 13వ తేదీ నుంచి మూడు రోజుల పాటు వైఎస్సార్  జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం, శుక్రవారం, శనివారం ఆయన జిల్లాలో స్థానికంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

బాబూ.. మీ పేరు సింగపూర్ నాయుడుగా మార్చుకోండి

Written By news on Wednesday, November 12, 2014 | 11/12/2014


'బాబూ.. మీ పేరు సింగపూర్ నాయుడుగా మార్చుకోండి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత పనుల కోసమే సింగపూర్ పర్యటనకు వెళ్లారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబుకు చెందిన వ్యాపారాలు, హోటళ్లు సింగపూర్ లో ఉన్నాయని తెహల్కా వెల్లడించిందని అంబటి అన్నారు. చంద్రబాబు-సింగపూర్ ల వైఖరి దృఢమైనదని ఆరోపించారు.

చంద్రబాబు తన పేరును సింగపూర్ నాయుడుగా మార్చుకుంటే మంచిదని అంబటి వ్యాఖ్యానించారు. చంద్రబాబు సింగపూర్ పర్యటనకు ఇంత ఆర్భాటాలు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి ఓ వైపు ప్రజల నుంచి చందాలు అడుగుతూ.. చంద్రబాబు బృందం రెండు ప్రత్యేక విమానాల్లో సింగపూర్ పర్యటనకు వెళ్లాల్సిన అవసరమేంటని అంబటి రాంబాబు విమర్శించారు.

దాడులు చేసి...మళ్లీ ఎదురు కేసులా?


హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరగటం పరిపాటిగా మారిందని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల దాడిలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైెఎస్ఆర్ సీపీ పార్టీ కార్యకర్త పుట్టా దస్తగిరి రెడ్డిని ఆయన బుధవారం పరామర్శించారు.
 
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ దాడులపై ఎన్నిసార్లు ప్రశ్నించినా..ఎంత ఒత్తిడి చేసినా స్పందన శూన్యమని అన్నారు.  జరుగుతున్న అరాచకాలపై కేసులు పెడతామన్నా...తీసుకునే  పరిస్థితి లేదని ఆయన అన్నారు. అధికార పక్షం నేతలే దాడులు చేసి వాళ్లే ఎదురు కేసులు పెడుతున్నారని... ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.

ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత మైసూరారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ పాలనలో రాజ్యాంగేతర శక్తుల జోక్యం ఎక్కువైందని, దాడులు చేసిన ముద్దాయిలే... మళ్లీ కేసులు పెట్టడం ఎంత వరకూ సమంజసమని మైసూరారెడ్డి ప్రశ్నించారు.

మిరియాల వెంకట్రావు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

Written By news on Tuesday, November 11, 2014 | 11/11/2014


మిరియాల వెంకట్రావు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాపునాడు అధ్యక్షుడు దివంగత మిరియాల వెంకట్రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం విశాఖపట్నం వెళ్లిన వైఎస్ జగన్ మిరియాల వెంకట్రావు ఇంటికి వెళ్లారు. వెంకట్రావు చిత్రపటం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. వైఎస్ జగన్.. వెంకట్రావు కుటుంబ సభ్యులను ఓదార్చారు.

అవినాష్ రెడ్డి దీక్షకు దిగి వచ్చిన ఆర్టీపీపీ


అవినాష్ రెడ్డి దీక్షకు దిగి వచ్చిన ఆర్టీపీపీ
కడప : భూ నిర్వాసితుల కోసం  కడప వైఎస్ఆర్ సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి చేపట్టిన దీక్షకు రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఆర్టీపీపీ) యాజమాన్యం దిగివచ్చింది. ఆర్టీపీపీ డైరెక్టర్ వెంకటేశ్వరరావు అవినాష్ రెడ్డితో చర్చలు జరిపారు. భూ నిర్వాసితుల డిమాండ్ మేరకు జనవరి 1 లోపు 96 ఉద్యోగాలు ఇస్తామని డైరెక్టర్ చెప్పారు. దీంతో అవినాష్ రెడ్డి, నారాయణ రెడ్డి, రైతులు దీక్ష విరమించారు.

ఆర్టీపీపీ, భూములు కోల్పోయిన రైతుల మధ్య చర్చలు విఫలం కావటంతో  భూ నిర్వాసితులు రిలే దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. గత 15 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనలకు ఎంపీ అవినాష్ రెడ్డి మద్దతు పలికారు. యాజమాన్యం దిగి రాకపోవటంతో ఎంపీ అవినాష్ రెడ్డి కూడా దీక్షకు దిగారు.

నేడు విశాఖకు వైఎస్ జగన్


నేడు విశాఖకు వైఎస్ జగన్
 కాపునాడు నేత మిరియాల కుటుంబీకులను పరామర్శించనున్న వైఎస్సార్‌సీపీ అధినేత
 

 సాక్షి, హైదరాబాద్: కాపునాడు నేత మిరియాల వెంకట్రావు కుటుంబీకులను పరామర్శించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విశాఖ నగరానికి వెళ్తున్నారు. ఆయన ఉదయం 11.30 గంటలకు విమానంలో విశాఖకు వెళ్తారు. వెంకట్రావు కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. తిరిగి సాయంత్రం హైదరాబాద్‌కు వస్తారని పార్టీవర్గాలు తెలిపాయి. జగన్ సోమవారం మిరియాల వెంకట్రావు కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించారు. వెంకట్రావు భార్య ప్రమీల, కుమారుడు ఎం.వి.శేషగిరిబాబులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. మిరియాల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. ఆయన మృతి యావత్ రాష్ట్రానికి తీరని లోటని ఆవేదన వ్యక్తంచేశారు. కాపు సామాజికవర్గం పెద్ద దిక్కును కోల్పోయిందన్నారు. విషాద సమయంలో నిబ్బరంగా ఉండాలని శేషగిరిబాబుకు ధైర్యం చెప్పారు.

రాజధాని ప్రాంతంలో భూముల పరిరక్షణ కమిటీ పర్యటన

Written By news on Monday, November 10, 2014 | 11/10/2014


రాజధాని ప్రాంతంలో భూముల పరిరక్షణ కమిటీ పర్యటన
హైదరాబాద్: ఏపి రాజధానిగా ప్రకటించిన ప్రాంతంలో వైఎస్ఆర్ సిపి ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన భూముల పరిరక్షణ కమిటీ పర్యటిస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజధాని భూముల వ్యవహరంపై  పరిరక్షణ కమిటీ చర్చించినట్లు తెలిపారు. కమిటీ రాజధాని భూసేకరణ గ్రామాలలో పర్యటిస్తుందని చెప్పారు.

రైతులు, కూలీల అభిప్రాయాలు తెలుసుకుంటామన్నారు. అభిప్రాయ సేకరణ తరువాత కమిటీ మళ్లీ సమావేశమవుతుందని చెప్పారు. భూసేకరణపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడమే మొదటి పనని అన్నారు. అవసరమైతే అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు, ప్రజలు, కూలీల హక్కులు కాపాడాలన్నదే తమ ధ్యేయం అన్నారు. కమిటీలోకి అదనంగా మరో నలుగురిని తీసుకున్నట్లు అంబటి చెప్పారు

మహేశ్వర్ రెడ్డి కుటుంబసభ్యులకు వైఎస్ జగన్ ఫోన్


హైదరాబాద్ :  అసోంలో కిడ్నాప్ అయిన సివిల్ కాంట్రాక్టర్ మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఫోన్ లో మాట్లాడారు. ఆయన ఈ సందర్బంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ సూచించారు. కిడ్నాప్ వ్యవహారాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళతామని ఆయన హామీ ఇచ్చారు. పార్టీ ఎంపీలు అవినాష్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి ఢిల్లీలో ఉండి ఈ ఘటనపై ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదింపులు జరపాలని వైఎస్ జగన్ ఆదేశించారు.


కాగా  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సివిల్ కాంట్రాక్టర్ మహేశ్వర్ రెడ్డిని అసోంలోని దివాస్ జిల్లా గౌడీ(అటవీ) ప్రాంతంలో బోడో మిలిటెంట్లు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.  మహేశ్వరరెడ్డి స్వస్థలం వైఎస్సార్ జిల్లా రామాపురం మండలం హసనాపురం.  క్లాస్‌వన్ కాంట్రాక్టర్ అయిన మహేశ్వరరెడ్డి హసనాపురం గ్రామానికి గతంలో సర్పంచ్‌గా కూడా పనిచేశారు. గత మూడేళ్ల నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య సుభద్రమ్మ, కూతురు నిశిత, కొడుకు మంజునాథ్ ఉన్నారు. ప్రస్తుతం మహేశ్వరరెడ్డి గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, అసోం రాష్ట్రాలలో ఐఎల్‌ఎఫ్ (రాంకీ కంపెనీ )లో సబ్ కాంట్రాక్టర్‌గా పనులు చేయిస్తున్నారు.

సాయంపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థనలు..

సత్వర సాయం అందించండి
కేంద్ర నిధులు వెంటనే విడుదల చేయండి రాజ్‌నాథ్‌సింగ్‌కు జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి
 
న్యూఢిల్లీ: హుద్‌హుద్ తుపానుతో తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజ లను ఆదుకునేందుకు సత్వర సాయం అందించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యలకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తుపాను బాధితులకు కేంద్ర సాయం అర్థిస్తూ పార్టీ ఎంపీలతో కలిసి రెండు రోజుల పర్యటన కోసం శనివారం ఢిల్లీకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి రెండో రోజు ఆదివారం కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యారు. పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, వై.ఎస్.అవినాష్‌రెడ్డి, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌లతో కలిసి మధ్యాహ్నం 3.45 గంటలకు ఇక్కడి అశోకారోడ్డులోని రాజ్‌నాథ్ నివాసానికి చేరుకున్నారు. అరగంటకుపైగా ఆయనతో భేటీ అయ్యారు. తుపాను కారణంగా జరిగిన నష్టం, బాధితులకు సాయం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, కేంద్రం నుంచి రావాల్సిన సాయం తదితర అంశాలపై కూలంకశంగా చర్చించారు.అన్ని అంశాలను పేర్కొంటూ ప్రతినిధి బృందం తరఫున రాజ్‌నాథ్‌కు ఓ వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం రాజ్‌నాథ్ నివాసం వద్ద జగన్‌మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘‘హుద్‌హుద్ తుపాను నష్టానికి సంబంధించిన సహాయ కార్యక్రమాల గురించి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి ఇచ్చిన లేఖనే.. విపత్తు చర్యలకు సంబంధించిన మంత్రి కూడా అయిన రాజ్‌నాథ్‌సింగ్‌కూ అందించాం. ఉత్తరాంధ్రలోని చాలా గ్రామాల్లో ఈ రోజుకీ కరెంటు రాని పరిస్థితి ఉందని, సహాయ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో సాగటం లేదని అన్ని విషయాలు వివరిస్తూ వినతిపత్రం ఇచ్చాం’’ అని తెలిపారు.
 పనిచేసే వారిపై బురదచల్లుతున్నారు..

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పార్టీ నేతలకు మంత్రి పదవులు ఇప్పించుకోవడంపై చూపుతున్న శ్రద్ధ, తుపాను బాధితులను ఆదుకునే విషయంలో పెట్టడం లేదని జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. బాబు తన పార్టీ నాయకులకు పదవులు ఇప్పించుకోవడంపై ప్రధానమంత్రితో మాట్లాడుతున్నారే కానీ.. ప్రజా సమస్యలపై ప్రధానిని కలవడం లేదని ఎండగట్టారు. ‘‘ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబునాయుడు ఇంతవరకు ప్రధానమంత్రిని కలిసి తుపాను సాయానికి సంబంధించి అభ్యర్థించింది లేదు. మంత్రివర్గంలోకి సుజనాచౌదరిని ఎలా తీసుకుపోవాలన్నదానిపైనే నరేంద్రమోదీతో ఫోన్లో మాట్లాడినట్టు చెప్పుకుంటున్నారు. ఆ ధ్యాస, ఆ శ్రద్ధ.. తుపాను బాధితులపై పెట్టి ఉంటే కనీసం రాష్ట్రానికి మంచి జరిగేది. బాబు, ఆయన మంత్రివర్గ సహచరులు చిత్తశుద్ధితో పనిచేయరు. పనిచేసే వారి మీద బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు’’ అని తూర్పారబట్టారు.

బాధితులకు ప్రభుత్వ సాయం సున్నా...

‘గతంలో ఏ ప్రభుత్వం చేయనంత త్వరగా హుదుహుద్ బాధితులకు సహాయక చర్యలు అందించామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు కదా..?’ అని ప్రశ్నించగా.. ‘‘ఒక్కసారి ఉత్తరాంధ్రకు పోయి చూస్తే, ఎంత గొప్పగా చేశారో అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం మీడియాలో ప్రచారం తప్ప చేసిందేమీ లేదు. ఈ రోజుకి ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లి చూస్తే కనీసం విద్యుత్ అందించలేని పరిస్థితి ఉంది. తుపాను బాధిత గ్రామాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సాయం సున్నా. మేం పది రోజులు ప్రతీ గ్రామాన్ని సందర్శించాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ సాయం అందడం లేదని గ్రామస్తులే చెప్పారు. రూపాయికి కిలో చొప్పున ఇచ్చే బియ్యం 25 కిలోలు ఇచ్చారు. అది కూడా అన్ని గ్రామాల్లో, అందరికీ ఇవ్వలేదు...’’ అని జగన్ విమర్శించారు. బాధితులకు సహాయం అందిం చడంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు.

అక్రమ కేసులపై న్యాయస్థానాల్లో పోరాడుతాం...

‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై మీరేమంటార’ని ఈ సందర్భంగా విలేకరులు ప్రశ్నించగా.. ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలమవుతున్నారు.. ప్రభుత్వ వ్యతిరేకత బలంగా కనిపిస్తోంది.. దీంతో ఆయన భయపడి అక్రమ కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఆ కేసులను మేం గట్టిగా ఎదుర్కొంటాం. న్యాయస్థానాలపై పూర్తి విశ్వాసం ఉంది. న్యాయస్థానాల్లో పోరాడి విజయం సాధిస్తాం’’ అని జగన్ బదులిచ్చారు.

వినతిపత్రంలోని ముఖ్యాంశాలు...

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు జగన్‌మోహన్‌రెడ్డి అందించిన వినతిపత్రంలోని ముఖ్యాం శాలు ఇవీ...  
 ఇటీవల సంభవించిన హుదుహుద్ తుపానుతో భారతదేశ తూర్పు తీర ప్రాంతం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు కోస్తా జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ప్రత్యేకించి పారిశ్రామిక రాజధాని అయిన విశాఖపట్నంపై తుపాను ప్రభావం తీవ్రంగా పడింది. గత మూడేళ్లలో నీలం, లెహర్, పైలీన్ వరుస తుపాన్లతో పాటు ఇటీవల వచ్చిన హుద్‌హుద్  ప్రాణ, ఆస్తి, పశు నష్టాల్ని మిగిల్చాయి.
 పంటలతో పాటు ఉద్యానవనాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తుపానును ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా స్వల్పంగా చర్యలు తీసుకుంది. నష్టపోయిన వారిలో 10 శాతం మంది రైతులకైనా నేటీకి ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అంద లేదు. రుణాల రీషెడ్యూల్ కానీ, వడ్డీ మాఫీ కానీ చేయలేదు. నిర్వాసితులైన వారికి తిరిగి వసతులు కల్పించలేదు.

 హుద్‌హుద్ వచ్చిన వెంటనే స్పందించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మూడో రోజే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు ఎంతో ఉదారంగా రూ. వెయ్యి కోట్ల సాయం ప్రకటించారు. కోస్తా ఆంధ్రా జిల్లాలపై వరుసగా విరుచుకుపడిన నాలుగో తుపాను ఇది. గత రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రస్తుత ప్రభుత్వం సైతం తుపాన్లను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమైంది. రైతులు, మత్స్యకారులు, గ్రామీణులంతా మీ సహాయం కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే యూపీఏ ప్రభుత్వం బలవంతంగా చేసిన రాష్ట్ర విభజనతో నష్టపోయి ఉన్నారు.మీరు సహాయం అందించకపోతే వారి జీవితాలు మరింత దయనీయంగా మారతాయి.

తప్పుడు హామీలను ఇచ్చి టీడీపీ అధికారంలోకి వచ్చింది. అమలు సాధ్యం కాదని తెలిసి కూడా, అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం రూ. 80 వేల కోట్ల వ్యవసాయ రుణాలు, రూ. 14 వేల కోట్ల స్వయం సహాయక సంఘాల రుణాలను మాఫీ చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచార సమయంలోనూ ఆ పార్టీ నాయకులు.. రుణాలు, వడ్డీలు కట్టొద్దని, అధికారంలోకి వచ్చిన తర్వాత తామే బ్యాంకులకు చెల్లిస్తామని ప్రతి రైతుకు, ప్రతి స్వయం సహాయక గ్రూపు సభ్యురాలికి చెప్తూ వచ్చారు. ఈ హామీలను చెప్పి టీడీపీ అధికారంలోకి వచ్చింది. వాళ్ల మాటలు నమ్మిన రైతులు ఇప్పుడు కొత్త రుణాలకు అనర్హులయ్యారు. వీటి పర్యవసానంగా, పంట బీమా సైతం రెన్యువల్ కాలేదు. ఇప్పుడు రైతులకు రుణాలు మాఫీ కాలేదు, పంటల బీమా అందే పరిస్థితి లేదు. ఈ తుపానుతో పంటనష్టపోయిన రైతులకు ఇప్పు డు పంటల బీమా సైతం అందని దయనీయమై న పరిస్థితి ఏర్పడింది. మీరు వీలైనంత త్వరగా రాష్ట్రానికి ఉదారంగా ఆర్థిక సాయం అందిస్తే, బాధితులకు కొంత ఊరట లభిస్తుంది.
 
 
 సాయంపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థనలు..

► పంటలు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న రైతులకు పంట రుణాలను, వడ్డీలను పూర్తిగా రద్దు చేయాలి. నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు వచ్చే సీజన్‌కి  అవసరమైన రుణాలు కొత్తగా మంజూరు చేయాలి.


►తుపాను బాధిత ప్రాంతాల్లోని స్వయం సహాయక గ్రూపులకు ఎలాంటి వడ్డీలు లేకుండా రుణాలు రీషెడ్యూల్ చేయాలి.

►వచ్చే రబీకి అవసరమైన విత్తనాలు ప్రభుత్వమే ఉచితంగా అందించాలి.

►రైతులందరికీ పంట బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలి.

►పాక్షికంగా దెబ్బతిన్న వరి, చెరకు, ఉద్యానవన ఉత్పత్తులు ప్రభుత్వమే సేకరించేం దుకు హామీ ఇవ్వాలి.

►హుద్‌హుద్ తుపాను సందర్భంగా 2014 అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 9, 10, 11, 12, 13, 15 జీవోల్లో ఇచ్చిన
►మీలన్నీ నెరవేర్చేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలి.

►భూపీందర్‌సింగ్ హూడా కమిటీ ప్రతిపాదనల మేరకు ప్రకృతి వైపరీత్యాల సమయంలో కౌలు రైతులను కలుపుకొని ప్రతి రైతుకు ఎకరాకు రూ. 10 వేలకు తగ్గకుండా ప్రకృతి విపత్తు సహాయ నిధి నుంచి సాయం అందించాలి.

►చనిపోయిన వారి కుటుంబసభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం రూ. 5 లక్షల పరిహారం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలి.

►ఇల్లు దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి రూ. 50 వేల ఆర్థిక సహాయం అందించాలి.  పూర్తిగా దెబ్బతిన్న వారికి  పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి.

►ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం పశువులు చనిపోయినవారికి, కోళ్లు చనిపోయిన కోళ్ల ఫారాల వారికి నష్టపరిహారం అందజేయాలి.

►తుపాను బాధిత ప్రాంతాల్లోని వారికి రేషన్ ద్వారా అతి తక్కువ సహాయం చేసినందున ప్రతి ఇంటికీ రూ. 5,000 ఆర్థిక సాయం ఇవ్వాలి.

►బోట్లు, వలలు నష్టపోయిన మత్స్యకారులకు పూర్తి పరిహారాన్ని చెల్లించాలి.

►వరద బాధిత ప్రాంతాల్లో భూమికోతను అరికట్టేందుకు, పూడిక తీతకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి.

YS Jagan meets Rajnath Singh, seeks immediate aid

Written By news on Sunday, November 9, 2014 | 11/09/2014

YSRCP president Sri YS Jagan Mohan Reddy along with party MPs meeting Union Home Minister Rajnath Singh at his residence in New Delhion Sunday. He briefed Rajnath Singh over the losses and destruction caused by cyclone Hudhud in AP and sought immediate central assistance towards relief and rehabilitation of cyclone affected people.














'తుపాను సాయంలో ఏపీ ప్రభుత్వం విఫలం


'తుపాను సాయంలో ఏపీ ప్రభుత్వం విఫలం'
ఢిల్లీ: ఉత్తరాంధ్ర తుపాను బాధితులను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన జగన్.. హుదూద్ తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్... కేంద్ర నుంచి తుపాను సాయాన్ని మరింత పెంచాలని కోరామని తెలిపారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో చాలా గ్రామాల్లో విద్యుత్ ను పునరుద్ధరించలేదన్నారు. పది రోజుల పాటు ఉత్తరాంధ్ర పర్యటిస్తే.. ప్రతీ గ్రామంలోనూ ఎలాంటి సాయం అందలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారన్నారు.
 
తుపాను సాయం గురించి ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు, ఆయన కేబినెట్ పనిచేయకపోగా, పని చేసే వారిపై బురద జల్లుతారని జగన్ మండిపడ్డారు. సుజనా చౌదరికి కేబినెట్ లో చోటు కల్పించడంలో చూపిన శ్రద్ధ, తుపాను బాధితుల సాయం కోరడంలో చూపలేకపోవడం దారుణమని జగన్ అన్నారు. హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన బృందంలో వైఎస్ జగన్ తో పాటు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి తదితర నాయకులు ఉన్నారు

మీకు ఓటేసినందుకు...చెప్పుతో కొట్టుకోవాలి


మీకు ఓటేసినందుకు...చెప్పుతో కొట్టుకోవాలి
  • టీడీపీకి ఓటేసినందుకు జన్మభూమి సభలో చెప్పుతో కొట్టుకున్న వృద్ధుడు
  •  అన్యాయంగా పింఛను తొలగించారని ఆవేదన
  •  పింఛను రాలేదన్న మనస్తాపంతో కృష్ణా జిల్లాలో వృద్ధుడి మృతి
చీరాల/గుడివాడ: ‘మీ కుటుంబానికి పెద్ద కొడుకునవుతా.. రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ.వెయ్యి చేసి మీ బతుక్కు భరోసా ఇస్తానన్న ఏపీ సీఎం చంద్రబాబు .. భరోసా సంగతి ఏమోగానీ మా నోటి దగ్గర బువ్వ లాగేశారంటూ’ పలువురు వృద్ధులు ఆవేదన చెందుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా చీరాల 33వ వార్డుకు చెందిన యాకోబు(70) కూలి పనులు చేసేవాడు. ఐదేళ్లుగా వృద్ధాప్య పింఛను తీసుకుంటున్న ఆయ న శరీరం సహకరించక కొంతకాలంగా పనికి వెళ్లలేక ఇంటివద్దే ఉంటున్నాడు.

అయితే ఇటీవల జరిగిన పింఛన్ల పునఃపరిశీలనలో ఆయనకు పింఛను తీసుకునేందుకు నిర్ధారిత వయసు సరిపోలేదంటూ తొలగించారు. దీంతో మనోవేదనకు గురైన యాకోబు తమ వార్డులో శనివారం నిర్వహించిన జన్మభూమి గ్రామసభలో అధికారులను ప్రశ్నించేందుకు వచ్చాడు. మున్సిపల్ కమిషనర్, జన్మభూమి కమిటీ సభ్యుల ఎదుట గోడు వెళ్లబోసుకున్న అనంతరం ఆవేదనతో... ‘చంద్రబాబుకు ఓటేసినందుకు మా చెప్పుతో మేం కొట్టుకోవాలి’ అంటూ తనను తాను చెప్పుతో కొట్టుకున్నాడు. దీంతో పోలీసులు అతడ్ని సభా ప్రాంగణం నుంచి బయటకు పంపారు.
 
కృష్ణా జిల్లాలో వృద్ధుడి మృతి

కృష్ణాజిల్లా గుడివాడలోని బేతవోలుకు చెందిన జొన్నలగడ్డ సూర్యనారాయణ(70)కు ఎనిమిది నెలల క్రితం పింఛను తొల గించారు. అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. జన్మభూమి కార్యక్రమంలోనైనా పింఛను ఇస్తారేమోనని ఆశపడ్డాడు. రెండు రోజుల క్రితం బేతవోలులో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి వెళ్లి పింఛను గురించి అధికారులను అడగ్గా.. రాలేదని సమాధానం ఇచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన సూర్యనారాయణ... గుండెపోటుతో మరణించినట్లు బంధువులు తెలిపారు.

వైఎస్ చలువతోనే

వైఎస్ చలువతోనే
 ప్రజలకు తాగునీరు
 వెలుగోడు:
 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చలువతోనే వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా ఆత్మకూరు, పరిసర గ్రామాల ప్రజలకు త్వరలోనే తాగునీరు అందించనున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా అద్యక్షుడు, శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన వెలుగోడు తాగునీటి పథకాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా బుడ్డా మాట్లాడుతూ 2006లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆత్మకూరు, పరిసర గ్రామాల 13గ్రామ పంచాయతీల ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ పథకానికి శ్రీకారం చుట్టారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆత్మకూరు ప్రజల చిరకాల కోరిక అయిన నీటి పథకం పూర్తయిందని ఈనెల 10వ తేదీన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఆత్మకూరు పట్టణంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఏర్పాటు చేస్తామన్న హామీని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. మొత్తం 12.5కోట్ల వ్యయంతో చేపట్టి ఈ పథకంలో తాగునీటి కష్టాలు దూరమవుతాయన్నారు. ఈ పథకానికి సంబంధించిన పంప్‌హౌస్, పైప్‌లైన్, మోటార్లు, జనరేటర్ల ఏర్పాటు తదితర విషయాలను ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ వేడుకొండలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రవిబాబు, సర్పంచ్ ఎంఏ కలాం, మాజీ సింగిల్‌విండో చైర్మన్ అన్నరపు శేషిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు మద్దెల శంకర్‌రెడ్డి, జీవన్‌కుమార్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.

అరుణ్‌జైట్లీకి ఇచ్చిన వినతి పత్రంలోని ముఖ్యాంశాలు...

తుపాను బాధితులను ఆదుకోండివీడియోకి క్లిక్ చేయండి
న్యూఢిల్లీ : కేంద్ర సాయం త్వరగా అందేలా చూడండి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి వినతిపత్రం ఇచ్చిన జగన్
 
న్యూఢిల్లీ: హుద్‌హుద్ తుపాన్‌తో తీవ్రంగా నష్టపోయిన మూడు ఉత్తరాంధ్ర జిల్లాలు, ప్రత్యేకించి విశాఖపట్టణం ప్రజలను ఆదుకోవాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ అసెంబ్లీ ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వీలైనంత త్వరగా మంజూరు చేసి, బాధితులకు సాయం అందించాలని కోరారు. జైట్లీ అన్ని అంశాలను సావధానంగా విన్నారని, సాయం అందిస్తానని హామీ ఇచ్చారని జగన్ తెలిపారు. జగన్ శనివారం ఉదయం 11 గంటలకు పార్టీ ఎంపీలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, మిధున్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వరప్రసాద్, బుట్టారేణుకతో కలిసి సాయంత్రం 4-30 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని ఢిల్లీ కృష్ణమీనన్‌మార్గ్-2లోని ఆయన నివాసంలో కలిశారు. హుద్‌హుద్ తుఫాన్ బాధితులను ఆదుకోవాలని, తుపాన్లతో ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన నష్టాన్ని వివరిస్తూ ఓ వినతిపత్రాన్ని అందజేశారు. దాదాపు అరగంటకుపైగా అన్ని అంశాలను జైట్లీ కి వివరించారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏం చెప్పారంటే...

 హుద్‌హుద్ తుపానుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి నివేదికలు పంపామని చెబుతున్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతగా మేము నిర్వర్తిస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా బాధితులకు న్యాయం జరగాలన్నదే మా కోరిక.
 బాధితులకు సాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైన విషయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి దృష్టికి తీసుకువచ్చాం. తుపానుతో జరిగిన నష్టం, రాష్ట్రం ఎదురు చూస్తున్న సహాయం సత్వరమే అందించాల్సిందిగా అభ్యర్థించాం. ఆయన సావధానంగా విన్నారు. తప్పకుండా మంచి చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు కేవలం రూ. 450 కోట్లు మాత్రమే సాయం అందిందన్న అంశమూ మా చర్చలో వచ్చింది. ‘దీనికి సంబంధించి నివేదికలు ఇంకా పూర్తిగా తయారు కాలేదు. మా దగ్గరికి ఇంకా రాలేదు. వచ్చాక సాయం చేస్తాం’అని జైట్లీ చెప్పారు.

 రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పది రోజులపాటు ఊరూరు తిరిగి, ప్రభుత్వం ఆ గ్రామాల్లో ఏం చేయలేదో అందరికీ చూపిస్తూ, చెప్పుకుంటూ వచ్చాం. హుద్‌హుద్ తుపాను సహాయక చర్యల్లో సర్కారు విఫలమైందని నాతోపాటు తిరిగిన మీడియా వారి క్లిప్పింగులు చూస్తే తెలుస్తుంది. ఎలాంటి సహాయం అందడంలేదని ప్రజలే చెప్పారు. చంద్రబాబుగారేమో తుపాను సహాయంగా 25 కేజీలు బియ్యం ఉచితంగా ఇచ్చేస్తున్నానని చెబుతున్నారు. ఆ 25 కిలోల బియ్యం రేషన్ దుకాణాల్లో రూ.25కి ఇస్తారు. అంటే రూ.25 సాయం చేస్తున్నారు. అదికూడా అన్ని గ్రామాల్లో అందరికీ ఇవ్వలేదు. అధికారులెవరూ రాని పరిస్థితి.

చంద్రబాబు మాటలు నమ్మి రైతులు రుణాలు చెల్లించలేదు. దీంతో పంట బీమా రాక వారు నష్టపోయారు. ఈ విషయాలన్నీ ఆర్థిక మంత్రి దృష్టికి తెచ్చాం. ఈ రోజు కేవలం హుద్‌హుద్ బాధితుల సాయం అంశాన్ని మాత్రమే  మంత్రి దృష్టికి తెచ్చాం. ప్రత్యేక హోదాకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదు.
 
అరుణ్‌జైట్లీకి ఇచ్చిన వినతి పత్రంలోని ముఖ్యాంశాలు...
 
హుద్‌హుద్ తుపాను వచ్చిన మూడో రోజే ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఉదారంగా రూ. వెయ్యికోట్ల సాయం ప్రకటించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధితులకు ఒక్క రూపాయి సాయం కూడా అందలేదు. నష్టపోయిన వారిలో 10 శాతం మంది రైతులకు సైతం నేటికీ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అంద లేదు. నిర్వాసితులైన వారికి తిరిగి వసతులు కల్పించలేదు. బాధిత కుటుంబాలకు సాయం కింద అందించే బియ్యం పంపిణీలోనూ స్థానిక రాజకీయాలు పనిచేస్తున్నాయని మీడియాలో కథనాలు వచ్చాయి.

ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 65 మంది ప్రాణాలు కోల్పోయారు. 35 మంది గాయపడ్డారు. భారీగా ఆస్తి, పంట నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రైల్వే, టెలికాం, ఎయిర్‌పోర్టు, ఓడరేవు, షిప్‌యార్డ్, స్టీల్‌ప్లాంట్, బీహెచ్‌పీవీ లకు జరిగిన నష్టాన్ని కలిపితే ఇది మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రూ. 21,640.63 కోట్ల సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి నివేదిక అందినట్టు తెలుస్తోంది.

చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి రైతులు రుణాలు చెల్లించలేదు. దీంతో వారికి పంట బీమా అందే పరిస్థితి లేదు. మీరు వీలైనంత త్వరగా రాష్ట్రానికి ఉదారంగా ఆర్థిక సాయం అందిస్తే బాధితులకు కొంత ఊరట లభిస్తుంది. లేదంటే వారి జీవితాలు మరింత దయనీయంగా మారతాయి.

పంటలు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న రైతులకు పంట రుణాలను, వడ్డీలను పూర్తిగా రద్దు చేయాలి. నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు వచ్చే సీజన్‌కి సంబంధించి అవసరమైన రుణాలు కొత్తగా మంజూరు చేయాలి. తుపాన్ బాధిత ప్రాంతాల్లోని స్వయంసహాయ గ్రూపులకు ఎలాంటి వడ్డీలు లేకుండా రుణాలు రీషెడ్యూల్ చేయాలి. వచ్చే రబీకి అవసరమైన విత్తనాలు ప్రభుత్వమే ఉచితంగా అందించాలి. రైతులందరికీ పంటబీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలి. పాక్షికంగా దెబ్బతిన్న వరి, చెరుకు, ఉద్యానవన ఉత్పత్తులు సేకరించేందుకు హామీ ఇవ్వాలి.

హుద్‌హుద్ తుపాను సందర్భంగా అక్టోబర్ 2014న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 9, 10, 11, 12, 13, 15లలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలివ్వాలి. బూపిందర్‌సింగ్ హుడా కమిటీ ప్రతిపాదనల మేరకు ప్రకృతి వైపరీత్యాల సమయంలో కౌలు రైతులను కలుపుకుని ప్రతి రైతుకు ఎకరాకు రూ. 10 వేలకు తగ్గకుండా ప్రకృతి విపత్తు సహాయ నిధి నుంచి సాయం అందించాలి.

చనిపోయిన వారి కుటుంబసభ్యులకు రాష్ట్ర ప్రభుత్వ హామీ ఇచ్చిన ప్రకారం రూ. 5 లక్షల  పరిహారం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలి. ఇల్లు దెబ్బతిన్న ప్రతీ కుటుంబానికి రూ. 50 వేల ఆర్థిక సాయం చేయాలి. ఇల్లు పూర్తిగా దెబ్బతిన్న వారికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలి.

ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం పశువులు చనిపోయినవారికి, కోళ్లు చనిపోయిన కోళ్ల ఫారాల వారికి నష్టపరిహారం అందజేయాలి. తుపాను ప్రాంతాల్లోని వారికి రేషన్‌ద్వారా అతి తక్కువ సహాయం చేసినందున ప్రతి ఇంటికీ రూ. 5 వేల ఆర్థిక సాయం ఇవ్వాలి. బోట్లు, వలలు నష్టపోయిన మత్స్యకారులకు పూర్తి నష్టపరిహారాన్ని చెల్లించాలి. వరద బాధిత ప్రాంతాల్లో భూమికోతను అరికట్టేందుకు, పూడిక తీతకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి.

Popular Posts

Topics :