21 December 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వాటా ప్రకారం నీరు అందించాలి

Written By news on Saturday, December 27, 2014 | 12/27/2014


వాటా ప్రకారం నీరు అందించాలి: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
ముండ్లమూరు : మోదేపల్లి మేజర్ పరిధిలోని సాగర్ ఆయకట్టు భూములకు వాటా ప్రకారం నీరు అందించి రైతులను ఆదుకోవాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి సంబంధితాధికారులకు ఆదేశించారు. దర్శి మాజీ శాసనసభ్యుడు బూచేపల్లి సుబ్బారెడ్డితో కలిసి శుక్రవారం సాయంత్రం పర్యటించారు. పీబీసీ పరిధిలోని రవ్వారం లాకుల వద్ద జమ్మలమడక మేజర్, మోదేపల్లి మేజర్లకు సంబంధించిన నీటి పంపకాలు ఎలా జరుగుతున్నాయనే వివరాలు
అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మోదేపల్లి మేజర్‌లో ఆయకట్టు గ్రామాలైన ఉమామహేశ్వరపురం, ఈదర, కొమ్మవరం, వేములబండ, అయోధ్యనగర్, రమణారెడ్డిపాలెం, నాయుడుపాలెం, పూరిమెట్ల గ్రామాల్లోని దిగువ భూములకు నీరు సరఫరా కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండల వైసీపీ కన్వీనర్ సుంకర బ్రహ్మారెడ్డి ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. నాట్లు వేయడం పూర్తి కాకముందే అధికారులు వారాబంధి విధానాన్ని అమలు చేస్తున్నారని, మోదేపల్లి మేజర్‌కు వాటా ప్రకారం 365 క్యూసెక్కుల నీరు రావాల్సి ఉండగా 150 క్యూసెక్కులకు మించి రావడంలేదని ఫిర్యాదు చేశారు.

ప్రస్తుతం మోదేపల్లి మేజర్‌లో 2,300 ఎకరాలలో,  జమ్మలమడక మేజర్‌లో 1600 ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేశారని, సాగు ఎక్కువగా ఉన్న మోదేపల్లి మేజర్‌కు అదనంగా నీరు సరఫరా చేసి రైతులను ఆదుకునేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన ఎంపీ సాగర్ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను వివరించారు. నీటి సరఫరా విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దన్నారు. వాటా ప్రకారం నీరు రప్పించి రైతులకు సరఫరా చేయాలని సూచించారు.

ఇప్పటికే అన్నదాతలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, ఇలాంటి సమయంలో నీరు సక్రమంగా పంటకు అందకుంటే నష్టాలపాలవుతారనే విషయాన్ని అధికారులు గుర్తించుకోవాలన్నారు. ఎన్‌ఎస్పీ సిబ్బంది నిత్యం కాలువపై పర్యటించి నీటి సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎన్‌ఎస్పీ డీఈ ఎ.అనుమాయమ్మ, ముండ్లమూరు, తాళ్ళూరు వైసీపీ కన్వీనర్లు బ్రాహ్మారెడ్డితోపాటు వెంకటరెడ్డి, రైతులు అన్నపురెడ్డి భిక్షాలురెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి, గాదె నాసరరెడ్డి, సుంకిరెడ్డి, చింతల అంజిరెడ్డి, గూడాల సుబ్బారెడ్డి, బిజ్జం సుబ్బారెడ్డి, సురా గురుస్వామిరెడ్డి, మన్నంగి అంజిరెడ్డి, ఇరుగుల కొండారెడ్డి, అబ్బని అంజిరెడ్డి, మైలా శ్రీరాములు, జే ఈలు క్రాంతికుమార్, శివరామకృష్ణ, ప్రసాదులు ఉన్నారు.

నేనున్నానని..

Written By news on Friday, December 26, 2014 | 12/26/2014


నేనున్నానని..
సాక్షి, కడప/పులివెందుల : టీడీపీ ప్రభుత్వ ఆరంభం నుంచి ఆత్మహత్య చేసుకున్న తు కుటుంబాలను పరామర్శిస్తానని అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నాలుగు రోజుల్లోనే పులివెందుల నుంచి పరామర్శ యాత్ర ప్రారంభించారు. అప్పులు ఎక్కువై.. తీర్చే దారిలేక.. విషపు గుళికలు మింగి తనువు చాలించిన చిన్నరంగాపురానికి చెందిన గంగిరెడ్డి యాదవ్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. గురువారం సాయంత్రం గ్రామంలో యాదవ్ కుటుంబాన్ని పరామర్శించి భార్య, పిల్లలను ఓదార్చారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు.
 
 వైఎస్ జగన్‌కు ప్రశంసల జల్లు :
 క్రిస్మస్‌పండుగ నాడు ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలతోనే గడిపారు. చర్చిలో ప్రార్థనల అనంతరం నేరుగా క్యాంపు కార్యాలయానికి చేరుకుని ప్రజలతో మమేకమయ్యా రు. వారు చెబుతున్న సమస్యలు వింటూ పరి ష్కారానికి చొరవ చూపారు. అసెంబ్లీలో ప్రభుత్వంపై చేసిన ఎదురుదాడి, రైతుల పక్షాన చూ పిన తెగువ, రాజధానికి సంబంధించిన బిల్లు విషయంలో రైతుల తరఫున పోరాటంపై పలువురు వైఎస్ జగన్‌ను ప్రశంసలతో ముంచెత్తా రు. కొందరుపూలబొకేలతో అభినందించగా మరికొందరు శాలువాలు కప్పి సన్మానించారు. ప్రజల తరఫున పోరాడటానికి జగన్ ఉన్నారన్న ధైర్యం జనంలో నింపావని కొనియాడారు.
 
 రుణమాఫీ అమలు కాలేదని.. :
 పులివెందుల మున్సిపాలిటీలోని చిన్నరంగాపురం గ్రామంలో కౌన్సిలర్ వీరశేఖరమ్మ ఇంటి కి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇంటి వద్దకు వైఎస్ జగన్ రాగానే గ్రామానికి చెందిన వికలాంగ రైతు హరినారాయణరెడ్డి కలిశారు. నాలుగేళ్లయింది.. బంగారు రుణం ’80వేలు.. క్రాప్ లోను ’90వేలు తీసుకున్నానని.. రుణమాఫీ పెసా కాలేదని.. గ్రామానికంతా కలిపి నలుగురు రైతులకే వచ్చిందని వైఎస్ జగన్‌కు వివరించారు. దీనికి స్పందించిన వైఎస్ జగన్ ఇదంతా మోసపూరిత ప్రభుత్వమన్నా..  రైతులను నిలువునా బాబు ముంచాడు.. మీ తరఫున పోరాటానికి సిద్ధమని ఊరడించారు.
 
 పీబీసీకి అదనంగా ఒక టీఎంసీ నీరు అందించండి :
 కరువు రైతులను ఆదుకొనేందుకు పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు (పీబీసీ)కి అదనంగా మరో టీఎంసీ నీటిని అందించాలని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మంత్రిని డిమాండు చేశారు. గురువారం పులివెందులలోని ఇంట్లో వైఎస్ జగన్‌రెడ్డి సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, అనంతపురం, వైఎస్‌ఆర్‌జిల్లాల కలెక్టర్లతో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయానికి సంబంధించి వివరాలను కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మీడియా సమావేశంలో వివరించారు. ప్రతి ఏటా పీబీసీకి అన్యాయం జరుగుతోందని.. వచ్చిన నీరు కాస్తా అనంతపురం జిల్లాలోని కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పులివెందుల నియోజకవర్గాలలోని ప్రజలకు తాగునీరు అందించాల్సి ఉందన్నారు.
 
  ఆయకట్టుకు 1.2టీఎంసీలు.. తాగునీటి అవసరాలకు 2టీఎంసీల చొప్పున కేటాయించారని.. అవి కూడా సక్రమంగా రావడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సింహాద్రిపురం, లింగాల మండలాల్లో చీనీ, అరటి రైతులు వేలాది ఎకరాల్లో చెట్లను నరికివేశారని.. ఈ సారి కూడా ఆయకట్టుకు రాకపోతే చెట్లను మరిన్ని వందల ఎకరాల్లో కొట్టేసుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. పీబీసీకి అదనంగా ఒక టీఎంసీ నీరు ఇవ్వడంతోపాటు పోతిరెడ్డిపాడు, గండికోట వరద కాలువకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులన్నింటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.
 
 ఈ ఏడాది వరద నీరు సక్రమంగా నిలబెట్టుకోలేక వందల టీఎంసీల నీరు సముద్రం పాలయ్యాయని.. పోతిరెడ్డిపాడు - గండికోట మధ్య కాలువ పనులు పూర్తి చేయడం ద్వారా కనీసం 25టీఎంసీలనుంచి 30టీంఎసీల నీటిని నిలబెట్టుకోవచ్చునన్నారు. తద్వారా నీరు గండికోటకు తీసుకరావచ్చునని.. దీంతో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాలకు నీరు అందుతుందని తెలియజేశారు. అలాగే ముంపు గ్రామాలకు సంబంధించి పరిహార సమస్యలు తీర్చాల్సి ఉందని.. వెంటనే ఆ దిశగా కూడా చర్యలు చేపట్టాలని కోరినట్లు వైఎస్ అవినాష్ స్పష్టం చేశారు. మంత్రితోపాటు అనంత, వైఎస్‌ఆర్‌జిల్లాల కలెక్టర్లు కూడా న్యాయం చేస్తామని చెప్పడమేకాక సానుకూలంగా స్పందించినట్లు ఆయన వివరించారు.
 
 మెడికల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై పోరాడుతా :
 బాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసేయడమే పనిగా పెట్టుకున్నారని.. దీనిపై ఇప్పటికే అసెంబ్లీలో పోరాటం చేశానని ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పులివెందుల రింగ్ రోడ్డు సమీపంలో వైఎస్ జగన్‌ను పలువురు మెడికల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిశారు. ఈ సందర్భంగా వారు చంద్రబాబు అడ్డగోలుగా తొలగిస్తున్నారని  మొరపెట్టుకున్నారు. వారి కోసం పోరాటం చేస్తామని హామి ఇచ్చారు.
 
 క్రిస్మస్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో...  
 పులివెందులలో గురువారం క్రిస్మస్ వేడుకల్లో ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయనతోపాటు కుటుంబ సభ్యులంతా స్థానిక సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనలలో పాల్గొన్నారు. వైఎస్ జగన్‌రెడ్డితోపాటు మామ ఈసీ గంగిరెడ్డి, ఆయన సతీమణి ఈసీ సుగుణమ్మ, పెదనాన్న వైఎస్ ప్రకాష్‌రెడ్డి, చిన్నాన్నలు వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ సుధీకర్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి తదితరులు కూడా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలలో పాలు పంచుకున్నారు.
 
 చర్చి వద్దనే ఆరుబయట మున్సిపల్ చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, మున్సిపల్ మాజీ వైస్ చెర్మైన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, విమలమ్మ కుమారుడు యువరాజారెడ్డి, వైఎస్ వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ కుమార్తెలు హర్ష, వర్ష తదితరులు ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. అలాగే జీసెస్ చారిటీస్‌లోని చర్చిలో కూడా వైఎస్‌ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ,  వైఎస్ జగన్ సోదరి షర్మిలమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, వైఎస్ మేనేత్తలు కమలమ్మ, రాజమ్మలు ప్రత్యేక ప్రార్థనలలో పాలుపంచుకున్నారు.
 
 వైఎస్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు, మేయర్
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలను పలువురు నేతలు కలుసుకున్నారు. ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్‌బాబు, డీసీసీబీ చెర్మైన్  ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, డీసీఎంఎస్ చెర్మైన్ విష్ణువర్థన్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఇతర పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కలిసి చర్చించారు. ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం అనేక అంశాలపై చర్చించారు.

ఎంపీ ల్యాడ్స్ నిధుల ప్రతిపాదనలో ఖమ్మం ఎంపీ ముందంజ


పొంగులేటి టాప్
ఎంపీ ల్యాడ్స్ నిధుల ప్రతిపాదనలో
ఖమ్మం ఎంపీ ముందంజ


ఖమ్మం జెడ్పీసెంటర్: ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడుగులు వేస్తున్నారు. తన నియోజకవర్గానికి ఎంపీ నిధులతో పాటు ఇతర నిధులు తెప్పించి అభివృద్ధి చేసేందుకు వేగంగా ముందుకు సాగుతున్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల ప్రతిపాదనలో ఆయనే ముందున్నారు. జిల్లాలో అభివృద్ధి పనుల్లో తనదైన మార్క్ కోసం పార్లమెంట్ నియోజకవర్గం మొత్తానికి నిధులు కేటాయింపు కోసం రూపకల్పన చేశారు.

ప్రభుత్వం ప్రతి ఏటా విడుదల చేసే నిధులను  ఖర్చు చేయడానికి ఎంపీలకు తీరిక లేక కోట్లాది రూపాయలు వెనక్కి వెళ్ళిన సంఘటనలు గతంలో అనేకం ఉన్నాయి. అయితే ఖమ్మం పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన పొంగులేటి ఆరు నెలల్లోనే తన పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో అత్యంత ప్రాధాన్యాలను గుర్తించి వాటిని పూర్తి చేసేందుకు ఏక కాలంలో ప్రతిపాదనలు పంపారు. ఎంపీ కోటాలో నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ.5 కోట్లు విడుదల చేస్తుంది.

ఖమ్మం ఎంపీ పొంగులేటి పరిధిలో  2014-15కు గానూ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఐదు కోట్లు ఖర్చు చేసేలా ప్రతిపాదనలు చేసి మంజూరుకు ఫైల్ పంపారు. ఈ ఐదు కోట్లు నిధులతో సీసీ రోడ్లు, తాగునీటి పథకాలు, సైడ్ డ్రైయిన్లు, పైపు కల్వర్టులు, సైడ్ వాల్స్ తదితర అవసరాలకు కేటాయించారు.

వాటిలో ఖమ్మం డివిజన్‌లో 118 పనులకు రూ.374 లక్షలు, కొత్తగూడెం డివిజన్‌లో 20 వర్కులకు రూ.60 లక్షలు, ఆర్‌డబ్ల్యూఎస్ కొత్తగూడెంలో ఒక పనికోసం రూ.3 లక్షలు, ఖమ్మం కార్పొరేషన్‌లో 4 పనులకు రూ.13 లక్షలు, కొత్తగూడెం మున్సిపాలిటిలో 4 పనులకు రూ.11 లక్షలు, నీటి ఎద్దడి నివారణ కోసం, మంచినీటి సరఫరా కోసం ప్రతిపాదనలు చేశారు.  ఖమ్మం, కొత్తగూడెం డివిజన్ల నుంచి సంబంధిత పీఆర్‌ఐ కార్యనిర్వాహక ఇంజినీర్లు అంచనాలు తయారు చేసి ముఖ్య ప్రణాళిక అధికారికి పంపారు. కలెక్టర్ ఇలంబరితి పరిపాలన పరమైన మంజూరు చేయాల్సి ఉంది. ఇంజనీర్లు అంచనాలు తయారు చేసి ముఖ్య ప్రణాళికాధికారికి పంపారు. కలెక్టర్ ఇలంబరితి పరిపాలన మంజురి చేయాల్సింది.

అభివృద్ధే లక్ష్యంగా..
అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది అందించే ఎంపీ నిధులతో పాటు అదనపు నిధుల కోసం పొంగులేటి ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఏడాదిలో చెపట్టాల్సిన పనులను ఆరునెలల కాలంలోనే గుర్తించి ప్రతిపాదనలు పంపారు. రానున్న వేసవి దృష్ట్యా మం చినీటి ఎద్దడికి ప్రణాళికలు చేస్తున్నారు. నియోజకవర్గంలో నీటి కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించారు. వాటికి నిధుల విడుదల కోసం ప్రయత్నిస్తున్నారు.

ప్రత్యేక స్థానం..
ఒకప్పుడు ఎంపీ అయిన వెంటనే నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడని పరిస్థితి జిల్లాలో ఉండేది. ప్రస్తుత ఎంపీ పొంగులేటి మాత్రం తనదైన శైలిలో ప్రతి వారం జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నారు. వాటికి సంబంధించిన నిధుల కోసం ప్రయత్నిస్తున్నారు.

అండగా ఉంటా ధైర్యంగా ఉండండి


అండగా ఉంటా ధైర్యంగా ఉండండి
  • ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
  • అసెంబ్లీలో ప్రకటన అనంతరం.. సొంత నియోజకవర్గం నుంచే శ్రీకారం చుట్టిన ఏపీ విపక్షనేత
సాక్షి, కడప: పంటలు పండక..పెట్టిన పెట్టుబడులుకూడా రాక.. తెచ్చిన అప్పులు తీరే దారిలేక.. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు గంగిరెడ్డి యాదవ్ కుటుంబాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. గురువారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో వైఎస్సార్ జిల్లా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చిన్నరంగాపురానికి వెళ్లి గంగిరెడ్డి కుటుంబంతో మాట్లాడి ధైర్యం నింపారు.

టీడీసీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఓదార్చుతానని ప్రతిపక్షనేతగా ఇటీవల అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు మొదట తన నియోజకవర్గం నుంచే దానికి ఆయన శ్రీకారం చుట్టారు. ముందుగా గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తుండగానే.. గంగిరెడ్డి భార్య రమాదేవి, కుమారుడు రాజ్‌కుమార్, కుమార్తె కుమారి కన్నీళ్ల పర్యంతమయ్యూరు. జగన్ వారిని ఓదార్చుతూ అధైర్యపడొద్దని.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ఎలాంటి అవసరం వచ్చినా.. స్థానికంగా నా తమ్ముడు అవినాష్ (కడప ఎంపీ) ఉన్నాడు.. భయపడొద్దని వారికి ధైర్యం చెప్పారు. ఎంత భూమి సాగు చేసేవారు.. ఎంత అప్పు చేశారు.. పెట్టుబడుల పరిస్థితి ఏమిటని రమాదేవిని అడిగారు. 5 ఎకరాల భూమి ఉండేదని.. అందులో మూడు బోర్లు వేసినట్లు ఆమె వెల్లడించారు.  నీరు పూర్తిస్థాయిలో పడకపోగా.. ఉన్న చీనీచెట్లు ఎండిపోయాయని ఆమె వివరించారు.

దీంతో పెట్టుబడులకు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండటంతో భయపడిపోయామని.. తర్వాత ధైర్యంగా మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని అందులో పొద్దుతిరుగుడు, శనగ తదితర పంటలు సాగు చేసినా పెట్టుబడులు కూడా రాకపోవడంతో తన భర్త గంగిరెడ్డి ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నారని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.

బ్యాంకులో రుణం ఏమైనా తీసుకున్నారా.. రుణమాఫీ జరిగిందా అని జగన్ ఆమెను అడిగారు. అప్పులు ఎక్కడ దొరకకపోవడంతో బ్యాంకులో మరిదికి సంబంధించిన బ్యాంకు పాసు పుస్తకం, బంగారు నగలు తాకట్టు పెట్టి రూ. 40 వేలు తెచ్చుకున్నామని ఆమె వివరించారు. రూ. 28 వేలు మాత్రమే మాఫీ అయ్యిందంటున్నారు కానీ.. ఇంతవరకూ  ఆ సమాచారం లేదని చెప్పారు. గంగిరెడ్డి పిల్లలు రాజ్‌కుమార్, కుమారిలను ఓదార్చారు.

మంత్రితో మాట్లాడిన జగన్


పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి గండికోట ప్రాజెక్టు వరకు పెండింగ్‌లో ఉన్న వరద కాలువ పనులను వెంటనే పూర్తి చేయాలని తద్వారా కొన్ని వందల టీఎంసీల నీరు సముద్రం పాలు కాకుండా కొంతమేరైనా నిల్వ చేసుకోవడానికి వీలుంటుందని  జగన్‌మోహన్‌రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును కోరారు. గురువారం మధ్యాహ్నం పులివెందులలోని తన నివాసంనుంచి  ఉమామహేశ్వరరావుతో ఫోన్‌లో మాట్లాడారు.

ఈ ఏడాది  వచ్చిన వరద నీరు సక్రమంగా వినియోగించుకోలేక సముద్రం పాలవుతోందని  గుర్తు చేశారు. అలాగే మిడ్‌పెన్నార్ రిజర్వాయర్ నుంచి పీబీసీకి 3.2 టీఎంసీలు కేటాయించినా.. సీబీఆర్‌కు మాత్రం 1.5 టీంఎంసీల నీరు మాత్రమే వచ్చే పరిస్థితి ఉందని.. కాలువల్లో నీరు రావడంతో వృథా కావడం.. తుంపెర్ డీప్‌కట్ వద్ద రీడింగ్ తీసే గేజ్ లోపంవల్ల ఏటా పీబీసీ ఆయకట్టుకు నీరు రావడం లేదన్నారు.  పీబీసీకి అదనంగా ఒక టీఎంసీ కేటాయించాలని మంత్రిని కోరారు. సానుకూలంగా స్పందించిన  దేవినేని త్వరలోనే గండికోట, చిత్రావతి ప్రాజెక్టులను సందర్శించి న్యాయం చేస్తానని వైఎస్ జగన్‌కు హామీ ఇచ్చారు.

మహానేతకి ఘనంగా నివాళులు

Written By news on Wednesday, December 24, 2014 | 12/24/2014

ఇడుపులపాయ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం ఇడుపులపాయ చేరుకున్న ఆయన .. వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ఆర్ సమాధి వద్ద కొద్దిసేపు మౌనంగా ప్రార్థించారు. వైఎస్ జగన్ వెంట ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు.

కాగా వైఎస్ జగన్  కుటుంబ సభ్యులతో కలిసి నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరి ఈరోజు ఉదయం ఎర్రగుంట్లకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఇడుపులపాయకు వెళ్లారు. మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో గడపనున్నారు.

అనంతరం ఇటీవల చక్రాయపేట మండలం దేవరగట్టుపల్లెలో గుండె పోటుతో మృతి చెందిన వైఎస్‌ఆర్ సీపీ మండల యూత్ కన్వీనర్ వెంకటసుబ్బయ్య సోదరుడు నాగభూషణం కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్ పులివెందులకు చేరుకుంటారు. 25వ తేదీన (గురువారం) ఉదయం పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం నుంచి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.

ఎన్టీ రామారావును దించివేయడంలో సహకరించినందుకే ..


'ఎన్ టీఆర్ పదవీచ్యుతిలో డీజీపీ పాత్రధారి'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా జాస్తి వెంకట రాముడిని నియమించడాన్ని సవాలు చేస్తూ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా రాముడి నియామకం జరిగిందని, అందువల్ల ఆయన నియామకపు జీవోను నిలిపేసి, రాముడి కన్నా సీనియర్ అధికారికి డీజీపీ బాధ్యతలు అప్పగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని ఆయన తన పిటిషన్ లో న్యాయస్థానాన్ని కోరారు. ఎన్టీ రామారావును సీఎం పదవి నుంచి దించివేయడంలో సహకరించినందుకే రాముడిని ...చంద్రబాబు డీజీపీగా చేశారని కొడాలి నాని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.

గతంలో ఎన్టీ రామారావును గద్దె దించేందుకు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను వైస్రాయ్ హోటల్ లో ఉంచారు. ఆ హోటల్ హైదరాబాద్ నార్త్ జోన్ పరిధిలో ఉందని, దానికి డిప్యూటీ కమిషనర్ గా రాముడు వ్యవహిరించారని, తనకు అప్పుడు సహకరించినందుకే చంద్రబాబు...ఇప్పుడు రాముడిని డీజీపీని చేశారని కొడాలి నాని తన పిటిషన్ లో పేర్కొన్నారు. వీటన్నింటి దృష్ట్యా రాముడు నిష్పాక్షికంగా పోలీసు బలగాలను నడిపిస్తారనే విశ్వాసం ప్రజలకు కలగడం లేదని, అంతేకాకుండా 1993లో రాముడు పుట్టిన తేదిని సవరించడం జరిగిందని, దానివల్లే ఆయనకు మరో రెండేళ్లపాటు డీజీపీగా కొనసాగే అవకాశం వచ్చిందన్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని డీజీపీగా రాముడు నియామకాన్ని రద్దు చేయాలని, కేసు తేలేంతవరకు డీజీపీ బాధ్యతలను మరో సీనియర్ అధికారికి అప్పిగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు.

అంకితభావం ఆయన సొంతం


అంకితభావం  ఆయన సొంతం
వైఎస్సార్ సీపీ యువజన నేతగా ప్రత్యేక గుర్తింపు
ఇటీవలి ఎన్నికల్లో ‘పశ్చిమ’ ఎమ్మెల్యేగా పోటీ

 
వరంగల్ : రోడ్డు ప్రమాదం యువ నాయకుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రాణాలను బలిగొంది. వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన సుధీర్‌రెడ్డి ఆకస్మిక మృతి పార్టీ వర్గాలను కలవరపరిచింది. తొలి నుంచి వైఎస్సార్ సీపీకి అంకితభావం ఉన్న నాయకుడిగా ఆయన పేరొందారు. ధర్మసాగర్ మండలం మలక్‌పల్లిలో మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన భీంరెడ్డి ఎల్లారెడ్డి, అరుణాదేవి దంపతులకు సుధీర్‌రెడ్డి మూడో సంతానం. 1979 ఫిబ్రవరి 9వ తేదీన జన్మించిన ఆయన హన్మకొండలో డిగ్రీ వరకు విద్యనభ్యసించారు.  ప్రస్తుతం హన్మకొండలో తల్లితో కలిసి నివసిస్తున్నారు. సుధీర్‌రెడ్డి తండ్రి ఎల్లారెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమాస్తులపై హైకోర్టును ఆశ్రయించారు. ఈ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. సుధీర్‌రెడ్డి చిన్నతనం నుంచి చురుకైన వాడిగా పేరొందిన ఈయన క్రమంగా వైఎస్.రాజశేఖరరెడ్డి వీరాభిమానిగా, కాంగ్రెస్ పార్టీపై మక్కువ పెంచుకున్నారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటూనే వైఎస్ మరణాంతరం జగన్ యువసేన ఏర్పాటు చేశారు. జగన్ యువసేన జిల్లా కన్వీనర్‌గా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టారు.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్‌ను స్థాపించిన మరుక్షణం ఆ పార్టీలో చేరారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జగన్  అందించిన మార్గమే తన మార్గమంటూ తరచూ చెప్పే వారు. రాష్ట్ర విభజన సమయంలో సైతం మొండితనంతో వైఎస్సార్ సీపీకి అండగా నిలిచారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఆయన ప్రాచుర్యం పొందారు.  వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌పై కేసులు పెట్టి జైలుకు పంపిన సందర్భంలో ఆయన విడుదలయ్యేవరకు ‘బ్లాక్‌షర్ట్’ ధరించి నిరసన తెలియజేస్తానంటూ అదే పద్ధతిని పాటించి తన అభిమానాన్ని చాటుకున్నారు. సీబీఐ అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందంటూ ప్రచారం నిర్వహించారు. తర్వాత క్రమంలో పలువురు నాయకులు పార్టీని వీడినప్పటికీ వెనుకంజ వేయకుండా వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్నారు. కేసులు పెట్టినా, దాడులు జరిగినా... వెరవకుండా పార్టీకి అంకితభావం గల నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ పక్షాన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు.

ప్రచారంలో సైతం తనదైన ప్రత్యేకతను సుధీర్‌రెడ్డి కనబరిచేవారు. ఇటీవల మహబూబ్‌నగర్‌లో జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిర్వహించిన పరామర్శయాత్రలో జిల్లాలోని మరికొందరు యువకులతో కలిసి పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీన జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన స్వయంగా నిర్వహించారు. అంతలోనే ప్రమాదంలో భీంరెడ్డి మృతిచెందడాన్ని పార్టీ శ్రేణులు జీర్నించుకోలేకపోతున్నారుు.

పలువురి సంతాపం

భీంరెడ్డి సుధీర్‌రెడ్డి ఆకస్మిక మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే మృతిచెందడంపట్ల ఆవేదన వ్యక్తం చేశా రు. పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మునిగాల కళ్యాణ్‌రాజ్, యువజన కాంగ్రెస్ నాయకుడు రాజనాల శ్రీహరి, మిత్రుడు కూనూరు శేఖర్‌గౌడ్, వీసం సురేందర్‌రెడ్డి, వేరుుస్తంభాల ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తదితరులు సంతాపం తెలియజేశారు.
 
సుధీర్ రెడ్డి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
నేడు అంత్యక్రియలకు రానున్న పొంగులేటి
 
హన్మకొండ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి ఆకస్మిక మరణంపై వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుధీర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుధీర్ రెడ్డి మరణ వార్త తెలుసుకున్న వైఎస్సార్ సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం అంత్యక్రియలకు వస్తున్నట్లు తెలిపారు. సుధీర్‌రెడ్డి పార్టీలో అంకితభావం గల నాయకుడని, క్రీయాశీల కంగా పనిచేసేవారని శ్రీనివాసరెడ్డి అన్నారు.  ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు కొండా రాఘవరెడ్డి, శివకుమార్ తదితరులు సుధీర్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బుధవారం వరంగల్‌కు వస్తున్నారు.

సుధీర్ రెడ్డి రోడ్డు ప్రమాదంపై అనుమానాలు


సుధీర్ రెడ్డి రోడ్డు ప్రమాదంపై అనుమానాలుసుధీర్ రెడ్డి మృతదేహం
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ యువనేత భీంరెడ్డి సుధీర్ రెడ్డి(30)కి జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని సీఐ డేవిడ్ రాజు చెప్పారు. వరంగల్ జిల్లా కాజీపేట సమీపంలో తరాలపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సుధీర్ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ రోడ్డు ప్రమాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని  ఎస్పీ అంబర్ కిషోర్ ఝా  సీఐని ఆదేశించారు. ప్రమాద స్థలాన్ని టీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన రెడ్డి, డిసిసిబి చైర్మన్ జంగా రాఘవరెడ్డి సందర్శించారు.

సుధీర్ రెడ్డి మృతికి ఉపముఖ్యమంత్రి రాజయ్య, మంద్రి చందూలాల్, ఎమ్మెల్యే లు సురేఖ, వినయ్య భాస్కర్,రమేష్, ఎంపిలు కడియం శ్రీహరి, సీతారామ్ నాయక్, టీఆర్ఎస్ నేతలు మురళీధర్ రావు, రవీంద్ర రావు, కుడా మాజీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి, వైఎస్ఆర్ సీపి నేతలు గట్టు శ్రీకాంత్ రెడ్డి, మహేందర్ రెడ్డి, నాడెం శాంత కుమార్, సింగిరెడ్డి భాస్కర రెడ్డి, డాక్టర్ ప్రపుల్లా రెడ్డి, చల్లా మధుసూధన్, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి బసవరాజు సారయ్య, డీసిసి అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, టీపిసిసి అధికార ప్రతినిధి శ్రీనివాస రావు, టీడీపి జిల్లా ఉపాధ్యక్షుడు ఖాదర్ అలీ, అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎల్ఎం మోహన్ రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.

వైఎస్ఆర్ సీపీ నేత భీంరెడ్డి సుధీర్ రెడ్డి మృతి

Written By news on Tuesday, December 23, 2014 | 12/23/2014

..

వరంగల్:  వైఎస్ఆర్ సీపీ యువనేత భీంరెడ్డి సుధీర్ రెడ్డి(30) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సుధీర్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం కాజీపేట సమీపంలో తరాలపల్లి వద్ద కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

సుధీర్ రెడ్డి మృతికి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సంగిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. సుధీర్ రెడ్డి మొదటి నుంచి వైఎస్ జగన్ కు వీరాభిమానిగా గుర్తింపు పొందారు.

బాలచందర్ మృతిపట్ల వైఎస్ జగన్ సంతాపం


హైదరాబాద్: ప్రఖ్యాత సినీ దర్శకుడు కె. బాలచందర్ మృతి పట్ల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మశ్రీ అవార్డులతో పాటు తొమ్మిది జాతీయ ఫిల్మ్ అవార్డులు సాధించి దేశంలోనే అత్యన్నత స్థాయి దర్శకులలో ఒకరిగా ప్రసిద్ధి చెందిన ఆయన మరణం భారతీయ చలన చిత్రరంగానికి తీరని లోటు అని జగన్ ఓ ప్రకటనలో తెలిపారు.
 
అనేక ఆణిముత్యాల వంటి చిత్రాలను అందించిన ఆయన చలన చిత్ర రంగంలో ఒక కొత్త ఒరవడికి నాంది పలికారని కొనియాడారు. బాలచందర్ కుటుంబ సభ్యలకు ఆయన తన ప్రగాడ సంతాపం, సానుభూతిని తెలియజేశారు.

వైఎస్ జగన్ ను ప్రశంసించిన డిప్యూటీ సీఎం కేఈ

ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపనకు రెండేళ్లు పడుతుందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుని రాజధాని పనులు ప్రారంభిస్తామని  చెప్పారు. రాజధాని ఏర్పాటు కోసం భూములు కోల్పోయిన వారి తరపున వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడి మైలేజ్ పొందారని ఆయన మంగళవారమిక్కడ అన్నారు.
 
ఈ సందర్భంగా వైఎస్ జగన్ అసెంబ్లీలో వ్యవహరించిన తీరును కేఈ కృష్ణమూర్తి ప్రశంసించారు. కొన్ని చర్చల్లో వైఎస్ఆర్ సీపీకి మేలు జరిగే అంశాలున్నాయని కేఈ అన్నారు. విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే బాధ్యత చంద్రబాబుపైనే ఉందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి రాయలసీమ మద్దతు ఉంటుందని, తమకు ప్రధానంగా కావల్సింది సాగునీరు అని అన్నారు.

కొల్లేరు సరస్సును చంద్రబాబు నాయుడు తవ్విస్తే...


బాబు తవ్విస్తే...వైఎస్ఆర్ పూడ్చేసినట్లు..
హైదరాబాద్ : కొల్లేరు సరస్సును చంద్రబాబు నాయుడు తవ్విస్తే...వైఎస్ రాజశేఖరరెడ్డి పూడ్చివేసినట్లు అధికార పార్టీ సభ్యులు చెబుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. కొల్లేరు కాంటూరుపై మంగళవారం సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ చెరువులు తొలగించాలని సుప్రీంకోర్టు 2006లో ఆదేశిస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెరువులు తొలగించటం జరిగిందన్నారు.

అనంతరం ఆయన అసెంబ్లీలో కొల్లేరు కాంటూరుపై ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారన్నారు. అనంతరం ఆరు నెలలకే దురదృష్టవశాత్తూ వైఎస్ఆర్ చనిపోవటంతో ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ సమస్యపై పట్టించుకోలేదని కొడాలి నాని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో సమస్యను పరిష్కరించాలని అన్నారు.

చంద్రబాబుకు అప్పుడు గుర్తు రాలేదా: వైఎస్ జగన్

కొల్లేరు కాంటూరు సమస్య పరిష్కారానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కొల్లేరును మూడో కాంటూరు వరకూ కుదించాలని ప్రభుత్వం మంగళవారం సభలో తీర్మానం పెట్టింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ 2008లోనే కొల్లేరుపై తీర్మానం జరిగిందరి,  కొల్లేరు కాంటూరుపై వైఎస్ రాజశేఖరరెడ్డి ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారని గుర్తు చేశారు.

కొల్లేరు ప్రాంతవాసులు జీవనాన్ని అధ్యయనం చేసేందుకు వైఎస్ఆర్  కమిటీ కూడా వేసినట్లు చెప్పారు. 2008 నాటి తీర్మానాన్నిముందుకు తీసుకు వెళ్లాలని... రాజకీయ అవసరాల కోసం మరోసారి తీర్మానమా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజలపై కాస్తోకూస్తో టీడీపీకి ప్రేమ వచ్చినందుకు సంతోషమన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుకు కొల్లేరు సమస్య గుర్తు లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో కట్టుకథలు చెప్పిస్తున్నారని విమర్శించారు.  సుప్రీంకోర్టు తీర్పుపైనే కొల్లేరులో చెరువులు ధ్వంసం అయినట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు.

సామాజిక కార్యకర్తల ముసుగులో రౌడీషీటర్లకు.


హైదరాబాద్ : ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక విషయంలో చంద్రబాబు సర్కార్ తప్పుడు విధానాలు అవలంభిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ప్రభుత్వ కమిటీలలో అనధికార వ్యక్తులకు, టీడీపీ కార్యకర్తలకు స్థానం కల్పించడం సరికాదని వారు అన్నారు. సామాజిక కార్యకర్తల ముసుగులో రౌడీషీటర్లకు స్థానం కల్పిస్తూ స్థానిక సంస్థల స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు.  

ప్రభుత్వ కమిటీలో స్థానిక సంస్థల ప్రతినిధులకు మాత్రమే అవకాశం ఇవ్వాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ అన్ని పథకాల్లో చంద్రబాబు తమ ఏజెంట్లను నియమించుకుని ఇష్టానుసారంగా పాలన సాగిస్తున్నారని 

పైసా పెట్టుబడి కూడా లేని ల్యాండ్ డెవలపర్స్‌కు ఇచ్చిన హక్కులు, భూములు కోల్పోయిన రైతులకు ఇవ్వకపోవడం దారుణo


రైతులను దొంగలతో పోలుస్తారా?
  • సీఆర్‌డీఏ బిల్లుపై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: పైసా పెట్టుబడి కూడా లేని ల్యాండ్ డెవలపర్స్‌కు ఇచ్చిన హక్కులు, భూములు కోల్పోయిన రైతులకు ఇవ్వకపోవడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ల్యాండ్ పూలింగ్‌పై కోర్టుకెళ్ళే రైతుల ఆలోచనల గురించి ప్రభుత్వం చెప్పే మాటలు రైతులను అవమానించేలా ఉన్నాయని తప్పుపట్టారు. ఎర్ర చందనం దొంగలూ కోర్టుకు వెళుతున్నారనడం ఎంత వరకూ సబబని ప్రశ్నించారు.

శాసనసభలో సోమవారం సీఆర్‌డీఏపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. 60 శాతం ప్రజల ఆమోదం ఉంటేనే భూసేకరణ చేపట్టాలన్న నిబంధనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. వ్యవసాయ భూములను సేకరించకూడదని శివరామకృష్ణన్ కమిటీ పేర్కొందని, ప్రభుత్వం మాత్రం పూలింగ్ పేరుతో 50 వేలు, లక్ష ఎకరాలను రాజధాని కోసం సేకరిస్తోందని విమర్శించారు.

ఉన్న వ్యవసాయ భూములను ఇలా సేకరిస్తే ఆహారభద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. పేద రైతులు భూమలు ఇవ్వబోమని చెబుతుంటే, ఏ చట్టాన్నైనా తీసుకొచ్చి లాక్కుంటామని ఓ మంత్రి, మీరు కాదంటే దొనకొండలోనో మరో చోటనో రాజధాని పెడతామని మరో మంత్రి గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని ఏర్పాటు విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అయితే ఇన్ని వేల ఎకరాల భూములు ఎందుకు సేకరిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. సీఆర్‌డీఏ బిల్లులో రైతులు, రైతుకూలీలకు ఏమాత్రం భద్రత లేదన్నారు.

ఎక్కడైనా భూమి ఇచ్చిన వారికి 70 శాతం, డెవలపర్‌కు 30 శాతం ఇవ్వడం సహజమని, కానీ రాజధాని విషయంలో ఇందుకు భిన్నంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డెవలపర్ ఎంపిక విషయంలోనూ అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఎలాంటి పెట్టుబడి లేని డెవలపర్ చిరవకు భూ యజమానిగా బిల్లులో పేర్కొనడం దారుణమన్నారు.

ఉపగ్రహాల తయారీలోనే ప్రపంచంలోనే భారత్ తన ప్రతిభను చాటుతుంటే, నిపుణులైన యువత మన దగ్గరుంటే, సింగపూర్‌ను ఆశ్రయించాల్సిన అవసరం ఏమిటన్నారు. చంద్రబాబుకు గొప్ప విజన్ ఉందని, అందుకే 30 ఏళ్ళ క్రితమే కృష్ణా జిల్లా వ్యక్తినే పెళ్లి చేసుకున్నారని రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు. ఇదే విజన్‌ను రాజధాని నిర్మాణం విషయంలో అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
 

కొల్లేరుపై కొంగ జపం


కొల్లేరుపై కొంగ జపం
 ఏలూరు :కొల్లేరుపై ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు మళ్లీ కొంగ జపం చేస్తున్నారు. వివాదాస్పద 120 జీవో తీసుకువచ్చి 3.50 లక్షలమంది కొల్లేరు ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన చంద్రబాబు ఇప్పుడు సరస్సు పరిధిని ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరుకు కుదించేందుకు శాసనసభలో తీర్మానం చేస్తామని నమ్మబలుకుతున్నారు. వాస్తవానికి 2008లోనే కొల్లేటి రైతుల దీనస్థితిపై స్పందించిన అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అభయారణ్యం పరిధిని ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరుకు కుదిస్తూ తీర్మానం ఆమోదింపజేశారు. ఇప్పుడు మళ్లీ ఆ తీర్మానాన్నే శాసనసభలో ప్రవేశపెడతానంటూ చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారు.

 వారికి కొల్లేరే ఆధారం
 కొల్లేరు ప్రపంచంలోని అతి పెద్ద మంచినీటి సరస్సులలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలోని 9 మండలాల్లో 77వేల ఎకరాల్లో ఈ సరస్సు విస్తరించి ఉంది. కైకలూరు, ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు నియోజకవర్గాల పరిధిలో కొల్లేరును ఆనుకుని ఉన్న 125 గ్రామాల్లో మూడు లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు. మున్నేరు, బుడమేరు, తమ్మిలేరు, ఎర్రకాలువ వాగుల నుంచి వచ్చేనీరు, 18డ్రెయిన్ల ద్వారా వర్షాకాలంలో వచ్చే ముంపు నీరు కొల్లేరులోనే కలుస్తాయి.  ఇక్కడి ప్రజలంతా శతాబ్దాల తరబడి కొల్లేరులో చేపల వేటను ఆధారంగా చేసుకుని బతుకుసాగిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది వెనుకబడిన తరగతులకు చెందిన వడ్డీలు కాగా, దళితులూ గణనీయంగా ఉన్నారు. 1974లో అప్పటి ప్రభుత్వం 118 జీవో జారీచేసి కొల్లేరులో చెరువుల తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. దీంతో కొల్లేరును ఆనుకుని ఉన్న గ్రామాల్లోని జిరాయితీ భూములను రైతులు చేపల చెరువులుగా మార్చుకున్నారు. గ్రామకంఠం, డీ ఫారం భూములను గ్రామస్తులు సొసైటీలుగా ఏర్పడి ఉమ్మడి చెరువులు తవ్వుకున్నారు. సొసైటీల పరిధిలో ఏర్పడిన చెరువుల ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామంలోని అన్ని కుటుంబాల వారికి పంచేవారు.

 బాబు శాపం ఫలితం
 చేపల వేటతో జీవనం ప్రశాంతంగా సాగిపోతున్న సమయంలో 1999లో రామ్‌సార్(ఇరాన్) అంతర్జాతీయ ఒప్పందం, కొల్లేరు ప్రక్షాళన పేరుతో చంద్రబాబునాయుడు సర్కా రు జారీ చేసిన వివాదాస్పద జీవో 120 కొల్లేరు వాసుల జీవనాన్ని పాతాళంలోకి నెట్టేసింది.  308.5 చదరపు కిలోమీటర్ల కొల్లేరు ప్రాంతాన్ని అభయారణ్యంగా పరిగణిస్తూ ఈ ప్రాంతంలో చేపల సాగును నిషేధించారు. సరస్సు సముద్ర మట్టానికి ఎత్తును బట్టి కాంటూర్లను నిర్ణయిం చారు. కళ్లెదుటే కొల్లేరు ఉన్నా చేపలు పెంచుకునే అవకాశం లేదు. అభివృద్ధి పనులు చేపట్టడం నిషేధం. కొత్త వంతెనలు, రోడ్లు, భవనాలు నిర్మించరాదు. ఇలా ఆ జీవోలో పేర్కొన్న కఠిన నిబంధనలు కొల్లేరు ప్రజల జీవితానికి సంకెళ్లు వేశాయి. కూలి పనులు లేక వేలాది మహిళలు, పురుషులు వలసబాట పట్టారు. ఆర్థికంగా చితికిపోయిన వందలాది కుటుంబాలు ఆడపిల్లలకు పెళ్లిళ్లు సైతం చేయలేని దుస్థితికి చేరుకున్నాయి. వేలాదిమంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యారు.

 తీర్మానంతో సరిపెట్టకుండా..
 నాడు వైఎస్ చేసిన తీర్మానాన్నే కొత్తగా కొలువుదీరిన ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టి చర్చ పెడతానని సీఎం చంద్రబాబు ప్రకటిస్తూ వస్తున్నారు. నాడు అభయారణ్యం పరిధి తగ్గించాలని కొల్లేరు ప్రజలు గగ్గోలు పెట్టినా పట్టించుకోని చంద్రబాబు నేడు కాంటూరు కుదింపుపై అసెంబ్లీలో తీర్మానం చేస్తామనడంపై ఇప్పటికీ కొల్లేటి వాసుల్లో సందేహాలున్నాయి. ఇప్పటికైనా సీఎం కొల్లేరు వాసుల కష్టాలపై నిజాయితీగా స్పందించి తీర్మానంతో సరిపెట్టకుండా కార్యచరణపై దృష్టి పెట్టాలని కొల్లేటి వాసులు కోరుతున్నారు. నిపుణులైన న్యాయవాదులను నియమించి సుప్రీం కోర్టులో కాంటూరు కుదిం పుపై గట్టిగా వాదనలు వినిపించేలా కృషి చేయాలనేది అక్కడి ప్రజల డిమాండ్. కొల్లేరు ప్రజల స్థితిగతులు, కాంటూరు కుదింపు వల్ల కలిగే లాభాలను సుప్రీం కోర్టుకు తెలియచేసేలా ఒత్తిడి తీసుకురావాలన్నదే కొల్లేటి వాసుల ఆకాంక్ష. రాష్ట్ర సర్కారు ఆ దిశగా అడుగులు వేస్తే కొల్లేరులోని లక్షలాది మందికి మేలు కలుగుతుంది.

 మహానేత పోరాటం మరపురానిది
 సుప్రీంకోర్టు సాధికార కమిటీ ఆదేశాల మేరకు 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కొల్లేరు ఆపరేషన్ చేపట్టారు. నష్టపోయిన రైతులు, సొసైటీ సభ్యులకు ఊహించని రీతిలో నష్టపరిహారం అందించారు. 600 సొసైటీల్లో ఉన్న వేలాది మందికి స్వయం ఉపాధి కోసం ఒక్కొక్కరికీ రూ.30 వేల రుణం అందించారు. ఆ మొత్తాలను తిరిగి చెల్లించలేకపోతున్నారని తెలిసి ఆ రుణాలన్నింటినీ రద్దు చేశారు. కొల్లేరు అభయారణ్యం పరిధిని ఐదో  కాంటూరు నుంచి మూడో కాంటూరుకు కుదిస్తూ 2008లో శాసనసభలో తీర్మానం ఆమోదించారు. ఈ తీర్మానాన్ని  కేంద్రానికి పంపగా, కేంద్ర ప్రభుత్వం సాధ్యాసాధ్యాలపై జైరాం రమేష్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. ఆ తర్వాత మహానేత మరణంతో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, రాష్ర్ట ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయకకపోవడంతో తీర్మానం ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు.

తాగునీటి సమస్యలపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం


హైదరాబాద్ : రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు, తాగునీటి సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది. కాగా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సోమవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల నిరసన మధ్య.. సీఆర్‌డీఏ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్టు సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రకటించారు.

రైలు ప్రయాణికులకు బీమా అవకాశం ఉందా?


రైలు ప్రయాణికులకు బీమా అవకాశం ఉందా?
ప్రశ్నోత్తరాల సమయంలో పొంగులేటి ప్రస్తావన
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే శాఖపై భారం తగ్గేలా ఏవైనా బీమా కంపెనీల భాగస్వామ్యంతో రైలు ప్రయాణికులకు ప్రమాద బీమా కల్పించే యోచన ఏదైనా ఉందా? అంటూ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కేంద్రాన్ని సోమవారం ప్రశ్నించారు.

అలాంటి సౌకర్యం లేనిపక్షంలో ప్రమాదాల్లో ప్రాణాలు, సామాన్లు కోల్పోయిన ప్రయాణికులకు పరిహారం చెల్లించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలంటూ ఆయన లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు సమాధానమిస్తూ అలాంటి యోచనేదీ ప్రభుత్వానికి లేదని వివరించారు. బీమా అంశంతో సంబంధం లేకుండా ప్రస్తుతం పరిహారం అందజేస్తున్నట్టు తెలిపారు.

షరతులు, నిబంధనలు, పరిమితులు, కోతలు పెడతామని అప్పుడు చెప్పలేదేం?


రుణ మాఫీ పేరుతో ముంచేశారు..
* చంద్రబాబు సర్కారుపై ప్రతిపక్ష నేత జగన్ నిప్పులు
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటి?
షరతులు, నిబంధనలు, పరిమితులు, కోతలు పెడతామని అప్పుడు చెప్పలేదేం?
యాభై వేల రూపాయల రుణం ఉంటే.. రూ. 15 కే మాఫీ అర్హత ఉందన్నారు
అందులోనూ తొలి విడత కింద మూడంటే మూడు రూపాయలే జమ చేశారు
తొలి విడత రుణ మాఫీ అంటూ ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము వడ్డీలకూ సరిపోలేదు
ప్రభుత్వ నిర్వాకంతో రైతులు వడ్డీ రాయితీ, వడ్డీ లేని రుణాలు కోల్పోయారు
రుణ బకాయిలు తీరనందున ఈ ఏడాది పంటల బీమాకూ నోచుకోలేదు
580 మండలాల్లో కరవు తాండవిస్తోంటే 226 మండలాల్లోనే అని ప్రకటిచారు
ఏడు నెలల్లో 86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా సర్కారు గుర్తించలేదు
ఎన్నికల హామీలను ఎలాంటి షరతులు, పరిమితులు లేకుండా అమలుచేయాలి


సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి.. రకరకా ల నిబంధనలు, పరిమితులతో రైతులను మో సం చేశారని, రుణమాఫీ పేరుతో రైతులను రుణగ్రస్తులను.. మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారని ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రుణమాఫీ చేస్తున్నామంటున్న ప్రభుత్వం.. వాస్తవంగా అనేక నిబంధనలతో రైతులను ఎంత దగా చేస్తోందో నిండు సభలో కేస్ స్టడీస్‌లతో సహా ఎండగట్టారు. తొలి విడత కిం ద జమ చేసిన మొత్తం.. వడ్డీ కిందకు కూడా సరిపోలేదన్నారు. ఐదేళ్లలో ఐదు వాయిదాల్లో చెల్లించే మొత్తాలు వడ్డీలకూ చాలకపోతే.. ఇక అసలు రుణం ఎప్పుడు తీరుతుందని నిలదీశారు.

 సర్కారు వైఖరి కారణంగా రైతులకు రుణ బకాయిలు తీరకపోగా.. వడ్డీ లేని రుణాలను కోల్పోయారని, పైగా అపరాధ వడ్డీ భారం పెరిగిపోతోందని, పంట బీమాకూ నోచుకోలేకపోయారని, ఈ ఏడాది కొత్త రుణాలూ లభించలేదని.. బ్యాంకర్ల కమిటీల లెక్కలను సభ ముందు పెట్టారు. ఇటు బ్యాంకుల్లో రుణ భారం పెరుగుతుండగా.. వ్యవసాయం కోసం ప్రైవేటు అప్పులు చేసిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని.. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో 86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఎలాంటి షరతులు, నిబంధనలు లేకుండా రైతుల, డ్వాక్రా మహిళల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం 344 నిబంధన కింద రాష్ట్ర శాసనసభలో రుణ మాఫీపై చర్చ జరిగింది. ఈ చర్చను ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

రైతులపై భారమని బ్యాంకర్లే చెప్పారు
‘‘వ్యవసాయ, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి.. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం చేస్తున్నదేమిటి? మార్చి 31 నాటికి రూ. 87,612 కోట్ల వ్యవసాయ రుణాలు, రూ. 14,204 కోట్ల డ్వాక్రా రుణాలు ఉన్నాయని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సంఘం (ఎస్‌ఎల్‌బీసీ) 184వ సమావేశంలో సీఎం చంద్రబాబు సమక్షంలోనే చెప్పింది. రుణాలు రీషెడ్యూల్ చేసుకోకపోవడం వల్ల పంటల బీమా రక్షణ రైతులకు లేకుండా పోతోందని.. బ్యాంకర్లు స్పష్టంగా చెప్పారు.  

కొత్త రుణాలూ దక్కలేదు...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ మాఫీ పేరుతో రైతులను ప్రభుత్వం మోసం చేయడం వల్ల.. ఈ ఏడాది వారికి కొత్త రుణాలూ అందలేదు. రైతులకు రూ. 56,019 కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకుంటే.. ఇచ్చింది రూ. 7,263 కోట్లే. రబీకి ఇచ్చిన రుణాలు కలిపినా రూ. 10 వేల కోట్లు దాటలేదని తాజా లెక్కలు చెప్తున్నాయి. మిగతా రూ. 46 వేల కోట్ల రుణాలను రైతులు రూ. 2-3 వడ్డీకి ప్రయివేటు వ్యక్తుల నుంచి తెచ్చుకున్నారు. డ్వాక్రా రుణాల పరిస్థితీ అంతే. ఈ ఏడాది (2014-15)లో రూ. 12,274 కోట్లు రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం కాగా.. నవంబర్ ఆఖరు వరకు ఇచ్చింది కేవలం రూ. 2,179 కోట్లే. డ్వాక్రా మహిళలు రూ. 10 వేల కోట్ల రుణాలు తీసుకొనే అవకాశాన్ని కోల్పోయారు.

ఎంత మాఫీ చేస్తున్నారో చెప్పరేం?
అధికారంలోకి వచ్చాక రకరకాల పరిమితులు, నిబంధనలు, షరతులు విధిస్తామని అన్నారా? బ్యాంకులు రుణాలు మంజూరు చేయడానికి ఉపయోగించుకొనే ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ను మాఫీలో కోతలు వేయడానికి వాడుకుంటామని ఒక్కసారైనా ఎన్నికల ముందు చెప్పారా? స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, ఆధార్, రేషన్ కార్డులకు ముడిపెడతామని, అందరికీ కాకుండా కొందరికే కొంతమేరే రుణ మాఫీ చేస్తామని, అది కూడా వాయిదా పద్ధతుల్లో చెల్లిస్తామని, అది వడ్డీకీ సరి పోదని.. ఒక్కసభలో అయినా రైతులకు టీడీపీ చెప్పిందా? ప్రభుత్వం రుణ మాఫీకి ఇచ్చింది రూ. 4,644 కోట్లే.  ఇప్పటికైనా చంద్రబాబు.. రుణాల మాఫీకి ఎంత ఇస్తున్నా రు? వడ్డీకి ఎంత? అసలుకు ఎంత? చెప్పడం లేదు.

వడ్డీలేని రుణాలకు మంగళం ...
ప్రభుత్వం చెల్లించిన మాఫీ సొమ్ము పోనూ, మిగతా రుణాలను చెల్లించి రీషెడ్యూలు చేసి, 4% వడ్డీ ప్రయోజనం పొందాలని కొండపి సభలో చంద్రబాబు రైతులకు సూచించినట్లు ‘ఈనాడు’లో వచ్చింది. వడ్డీకి సరిపోయేంత కూడా మాఫీ సొమ్ము కింద ప్రభుత్వం జమచేయక రైతులు దారుణమైన పరిస్థితుల్లో ఉంటే.. రుణాలు చెల్లించి, రీషెడ్యూలు చేసుకోవాలని చంద్రబాబు సూచించడం ఏమిటి? ఎన్నికల ముందు రుణాలు చెల్లించవద్దని చెప్పి.. ఇప్పుడేమో చెల్లించమని చెప్పడం ఏమి న్యాయం? ‘ఏరు దాటాక...’ అన్నట్టు ఇప్పుడు బాబు ఇలా చెబుతున్నారు. 4% వడ్డీ ప్రయోజనం గురించి మాట్లాడుతున్నారంటే.. వడ్డీలేని రుణాలకు మంగళం పాడినట్లే కదా! కొంతమందికైనా వడ్డీ సొమ్ము మాఫీ కింద రాలేదు. కేస్ స్టడీస్ కొన్ని సభ దృష్టికి తెస్తా. ఇవన్నీ బ్యాంకు పత్రాలే.

రుణాల మంజూరు లక్ష్యానికి ఎంతో దూరంగా..
ఏటా రుణాల మంజూరు లక్ష్యం, బ్యాంకులు రైతులకు ఇచ్చిన రుణాల వివరాలను చూస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ మాఫీ పేరుతో రైతులను ప్రభుత్వం మోసం చేయడం వల్ల లక్ష్యానికి ఎంత దూరంలో ఉన్నదీ తెలిసిపోతుంది.
సంవత్సరం     లక్ష్యం               మంజూరైన మొత్తం
2011-12    రూ. 31,877 కోట్లు    రూ. 35,615 కోట్లు
2012-13    రూ. 35,654 కోట్లు    రూ. 50,060 కోట్లు
2013-14    రూ. 47,017 కోట్లు    రూ. 49,774 కోట్లు
2014-15    రూ. 56,019 కోట్లు    రూ. 7,263 కోట్లు
                                 (ఖరీఫ్ ముగిసే నాటికి)

తొలి వాయిదా మాఫీ ‘మూడు రూపాయలు’...
-    రూ. 50 వేల రుణం తీసుకుంటే రుణ మాఫీ అర్హత మొత్తం రూ.15 అని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదు వాయిదాల్లో మాఫీ చేసిన రూ. 15 చెల్లిస్తామని, తొలిసారి రూ. 3ను బ్యాంకు ఖాతాకు  జమ చేసింది.
-    కృష్ణా జిల్లా నందివాడ జనార్థనపురానికి చెందిన మలినేటి రమ్య కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా 2013 ఏప్రిల్ 19న మూడు ఎకరాల్లో వరి సాగుకు రూ. 70,350 రుణం తీసుకున్నారు. ఆమె రుణం తీసుకున్న సమయంలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వరికి రూ. 24 వేలుగా నిర్ధారించారు. ప్రభుత్వం రుణ మాఫీ కోసం ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను రూ. 19 వేలుకు తగ్గించింది. దీని ప్రకారం ఆమె తీసుకున్న రుణంలో రూ. 57,190 మాఫీకి అర్హతగా ప్రభుత్వం నిర్ధారించింది. 2013 డిసెంబర్ వరకు వడ్డీతో కలిపి రూ. 59,800 మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం చెప్పింది.

 వాస్తవంగా ఇప్పటి వరకు అయిన వడ్డీ రూ. 10,491. తొలి వాయిదా కింద ప్రభుత్వం జమ చేసిన మొత్తం రూ. 11,960. ఈ ఏ డాది వడ్డీని తీసేస్తే.. అసలుకు జమ అయ్యే మొత్తం రూ. 1469. అసలు నుంచి ఈ రూ. 1469ని తీసేస్తే.. ఇంకా రూ. 68,881 అప్పు బ్యాంకులో ఉంటుంది. 14 శాతం వడ్డీ రేటు ప్రకారం వచ్చే ఏడాది రూ. 9,643 వడ్డీ భారం పడుతుంది. ప్రభుత్వం వచ్చే ఏడాది రెండో వాయిదా కింద రూ. 11,960 జమ చేస్తుంది. వడ్డీపోనూ అసలులోకి జమ అయ్యే మొత్తం రూ. 1917. ఇలా ఐదేళ్లపాటు  వడ్డీకే సరిపోతుంది. ఐదు సంవత్సరాల తర్వాత బ్యాంకులో మిగిలే సొమ్మును ఎవరు తీర్చాలి?

-    తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వీర వెంకటసత్యనారాయణ 0.55 ఎకరాల భూమిలో వరి సాగు కోసం 2013 జూలై 15న రూ. 34 వేల రుణం తీసుకున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రూ. 13,200 మాఫీకి అర్హతగా ప్రభుత్వం నిర్ణయించింది. తొలి వాయిదా కింద రూ. 2,762ను ప్రభుత్వం జమ చేసింది. 14 శాతం వడ్డీ ప్రకారం.. ఆయన ఖాతాలో రూ. 4,760 వడ్డీని బ్యాంకు అసలుకు కలిపేసింది. ప్రభుత్వం చేసిన విచిత్రమైన రుణమాఫీ ఫలితంగా ఇంకా రూ. 2 వేల వడ్డీ రైతు మీద పడింది.
-    విజయనగరం జిల్లా చంద్రంపేటకు చెందిన బి.రామూనాయుడు 0.55 ఎకరాల మీద తీసుకున్న రుణంలో మాఫీ చేసిన మొత్తం రూ. 15. తొలి వాయిదా కింద ప్రభుత్వం చెల్లించిన మొత్తం రూ. 3. మూడంటే మూడు రూపాయలే.  

86 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు...
ఏపీలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా కరవుతో రైతులు అల్లాడుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని రుణ ఊబిలో కూరుకుపోయాయి. ఫలితంగా టీడీపీ ప్రభుత్వం వచ్చాక 86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సాధారణ వర్షపాతం కంటే 35 శాతం తక్కువగా వర్షపాతం నమోదయింది. 580 మండలాల్లో కరవు తాండవిస్తోందని స్వయంగా సంబంధిత మంత్రే చెప్తుంటే.. ప్రభుత్వం 226 మండలాలనే కరవు మండలాలుగా ప్రకటించింది. అది కూడా శాసనసభ సమావేశాలకు ఒక రోజు ముం దు.. ఈ నెల 17న రాత్రి పది గంటలకు జీవో ఇచ్చింది. నవంబర్ ప్రారంభానికే కరవు మండలాల ప్రకటన వస్తే, రబీకి ఎలాంటి ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలో నిర్ణయించడానికి, రైతులకు సకాలంలో అందించడానికి వీలవుతుంది.

86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. వాటిని ప్రభుత్వం గుర్తిం చనూ లేదు. వారి పరిహారం చెల్లించాల్సి ఉం టుందనే కారణంతోనే ప్రభుత్వం గుర్తించడం లేదు. ఈ కుటుంబాలను కూడా ఇంటింటీకి వెళ్లి ఓదార్చుతాను. అప్పుడైనా మీకు బుద్ధొస్తుంది. షరతులు, నిబంధనలు, పరిమితులు లేకుండా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చంద్రబాబుకు సూటిగా చెప్తున్నా.’’

మేం రాజధానికి వ్యతిరేకం కాదు:వైఎస్ఆర్ సీపీ


మేం రాజధానికి వ్యతిరేకం కాదు:వైఎస్ఆర్ సీపీశ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్: తాము రాజధానికి వ్యతిరేకం కాదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు వ్యతిరేక విధానాలకే తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంత రైతుల గొంతునొక్కే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు.

రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. రైతుల హక్కుల కోసం పోరాడతామని చెప్పారు. మార్కెట్ యార్డ్ బిల్లును దొంగచాటుగా సభలో ప్రవేశపెట్టారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.

సలహాలు అడుగుతారు.. చెబితే ఎదురుదాడి చేస్తారు

Written By news on Monday, December 22, 2014 | 12/22/2014


హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టిన సీఆర్డీఏ బిల్లు సందర్భంగా టీడీపీ అనుసరిస్తున్న వైఖరిని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తప్పుబట్టారు. బిల్లులు ఒకటి చెబితే మరొకటి మాట్లాడుతున్నారన్నారు. ఏదో చేస్తున్నామని చెబుతున్నారే గానీ.. ఏం చేస్తున్నారో తెలియడం లేదన్నారు. ప్రతిపక్ష పార్టీని సలహాలు ఇవ్వమని అడుగుతారు.. చెబితే ఎదురు దాడి చేస్తారంటూ నాని ఎద్దేవా చేశారు.
 
మూడు పంటలు పండే భూములను లాక్కోవద్దని ఈ సందర్భంగా నాని స్పష్టం చేశారు. అవసరమైతే అటవీ భూములను ఉపయోగించుకోవాలని సూచించారు. రైతులు భూములు ఇస్తే తీసుకోవాలని,, బలవంతంగా తీసుకోవాలని చూస్తే వైఎస్సార్ సీపీ పోరాటం సాగిస్తుందన్నారు.

లక్ష ఎకరాల భూసేకరణ.. దోపిడీలో భాగమే


హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన లక్ష ఎకరాల భూసేకరణ కార్యక్రమం దోపిడీలో ఒక భాగమేనని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్లగడ్డ రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. సోమవారం అసెంబ్లీలో సీఆర్డీఏ బిల్లు చర్చ సందర్భంగా మాట్లాడిన ఆళ్లగడ్డ.. రాజధాని కమిటీలో పచ్చచొక్కాలే కనబడుతున్నాయని మండిపడ్డారు. లోప భూయిష్టమైన బిల్లును సరిచేయాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సింగపూర్ కు దోచి పెట్టడానికే చంద్రబాబు పన్నిన కుట్ర అని ఆళ్లగడ్డ అభిప్రాయపడ్డారు.
 
అసలు శివరామకృష్ణన్ కమిటీని పట్టించుకోకుండా రాజధాని నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. భూములు ఇవ్వకపోతే బలవంతంగా లాక్కుంటున్నారన్నారు. మూడు పంటల పండే ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేయవద్దని ఆర్కే తెలిపారు. రైతుల అసంతృప్తి బయటపడుతుందని చంద్రబాబు తిరగలేదన్నారు.

క్షమాపణ కూడా అడగకపోతే ఎలా?

తమ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పుబట్టారు. తోటి మహిళా శాసనసభ్యురాలిని అవహేళన మాట్లాడితే అసెంబ్లీలో ఉండడానికి మనం అర్హులమా, కాదా అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలని జగన్ అన్నారు.

అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేను స్పీకర్ కనీసం క్షమాపణ కూడా అడగకపోతే ఈ సభలో తమకు ఏ రకంగా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. గోరంట్లతో క్షమాపణ చెప్పించాలని తాము డిమాండ్ చేస్తే... సభ ముగిసిన తర్వాత ఏం మాట్లాడుకున్నారో చూస్తామనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రోడ్డు పొడుగునా ఏం జరుగుతుందో అది కూడా చూసుకుంటూ పోదామా అని ప్రశ్నించారు.

ఆడకూతురితో సభలో కన్నీళ్లు పెట్టించిన గోరంట్ల క్షమాపణ చెప్పిన తర్వాతే ఇతర విషయాలు చర్చిద్దామన్నారు. అయితే సీఆర్డీఏ బిల్లుకు తాము అడ్డుపడుతున్నామని ప్రభుత్వం బురద చల్లుతుందన్న కారణంతో సీఆర్డీఏ బిల్లుపై చర్చకు .జగన్ అంగీకరించారు. దీంతో గోరంట్ల వ్యాఖ్యలపై దుమారానికి తెరపడింది.

మార్స్ పైకి వెళ్లిన మనకు సింగపూర్ టెక్నాలజీ కావాలా?

ఎక్కడైనా రాజధాని లాంటి భారీ ప్రాజెక్టులు చేపట్టాలంటే అరవై శాతం ప్రజల మద్దతు ఉండాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సీఆర్డీఏ బిల్లు చర్చ సందర్భంగా మాట్లాడిన బుగ్గన.. చట్టాలు జనరల్ గా చేసిన తరువాతే రూల్స్ ఫ్రేమ్ చేస్తారన్ని విషయాన్ని మరోసారి తెలుపుతూనే కీలక అంశాలను లేవనెత్తారు. ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా 17 శాతం కాగా, భూములు శాతం మాత్రం 2.3గా ఉందన్నారు. మనం మార్స్ ఆర్బిట్ లోకి ప్రవేశించామని.. ఈ పరిస్థితుల్లో సింగపూర్ టెక్నాలజీ కావాలా? అని ప్రశ్నించారు.
 
భూమిని డెవలప్ మెంట్ కు ఇస్తే 70 శాతం భూమి ఓనర్ కు వస్తుందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించుకోవాలన్నారు. ఇక్కడేమో 30 శాతం భూమిని ఎంతో దయతో ఇస్తున్నట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. భూములు ఇవ్వకుంటే ల్యాండ్ ఫూలింగ్ తో బలవంతంగా లాక్కుంటున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చే ధరతో సాధారణ ప్రజలు ఎక్కడికి పోవాలన్నారు. ప్రాక్టికల్ గా వర్కవుట్ అయ్యే చోట రాజధాని పెట్టమంటున్నామని బుగ్గన అన్నారు .రాజధానిని ఒకరేమో దొనకొండకు మారస్తామంటారు.. మరి కొందరు జగ్గయ్య పేటకు మారుస్తామంటున్నారని బుగ్గన ఎద్దేవా చేశారు. రాజధానిని ఎక్కడ పెట్టినా తమకు అభ్యంతరం లేదని.. కాకపోతే ఎంత భూమి కావాల అనే అంశంపై స్పష్టత కావాలన్నారు. ప్రస్తుతం రాజధాని ప్రాజెక్టకు సమీకరిస్తున్న అభ్యంతరాలున్నాయన్నారు. అంత పెద్ద ఎత్తున భూమిని సమీకరించడం భావ్యం కాదని బుగ్గన తెలిపారు.

బాబు ఆదేశాలతోనే అనుచిత వ్యాఖ్యలు: రోజా


బాబు ఆదేశాలతోనే అనుచిత  వ్యాఖ్యలు: రోజా
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నగరి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేక అధికారపక్షం వ్యక్తిగత దూషణలకు దిగుతోందని ఆమె మండిపడ్డారు. అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశాన్ని స్పీకర్ కూడా ఇవ్వలేదన్నారు. చంద్రబాబు భస్మాసురుడిలా వ్యవహరిస్తున్నారని రోజా ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల తలపై చేయిపెట్టి మోసం చేయాలని చూస్తున్నారన్నారు. ప్రజలు తిరగబడి చంద్రబాబు నెత్తిన ఆయన చేయినే పెట్టించి భస్మం చేస్తారని రోజా స్పష్టం చేశారు.
 
ఓడిపోయిన నేతలను, దొంగలకు ప్రభుత్వ కమిటీల్లో అవకాశం కల్పిస్తున్నారన్నారు. తనపై ఉన్న కేసులపై కోర్టు నుంచి స్టే తెచ్చుకోకపోతే చంద్రబాబు జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వచ్చేదన్నారు. చంద్రబాబు చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని కాంగ్రెస్ తో చేతులు కలిపి తనపై కేసులు రాకుండా చూసుకున్నారని రోజా అన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారన్నారు. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్, యానిమేటర్ల సమస్యలపై ప్రభుత్వం వద్ద సమాధానం లేదన్నారు. అందుకే డాక్టర్ వైఎస్ఆర్ ను, వైఎస్ జగన్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని రోజా దుయ్యబట్టారు.
 
బుచ్చయ్య చౌదరి తన సీనియారిటీని ప్రక్కన పెట్టి తోటి ఎమ్మెల్యే అయిన తనపై వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబు కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందన్నారు. చంద్రబాబుతో బుచ్చయ్య చౌదరి మాట్లాడిన తరువాతే ఆయన అలాంటి మాటలు వాడారని.. ఒకసారి అసెంబ్లీ రికార్డులను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుందని రోజా తెలిపారు.అసెంబ్లీ సాక్షి చంద్రబాబు అసత్యాలు చెప్తున్నారని.. ఆయన దేవుడే అయితే ఐకేపీ యానిమేటర్లను ఎందుకు అరెస్టు చేస్తున్నారని నిలదీశారు.

ఐకేపీ యానిమేటర్లకు వైఎస్ జగన్ మద్దతు


ఐకేపీ యానిమేటర్లకు వైఎస్ జగన్ మద్దతు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన జీతం బకాయిల కోసం ఆందోళన చేస్తున్న ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ) ఉద్యోగులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్దతు ప్రకటించారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఐకేపీ నాయకురాలు ధనలక్ష్మితో సోమవారం ఆయన ఫోన్ లో మాట్లాడారు. ఐకేపీ ఉద్యోగుల పోరాటానికి మద్దతు తెలిపారు. ప్రసుత్తం ఆమె బొల్లారం పోలీసు స్టేషన్ లో ఉన్నారు.

 కాగా, ఐకేపీ యానిమేటర్ల అరెస్ట్ ను నిరసిస్తూ శాసనసభ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. ఐకేపీ యానిమేటర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసింది. ఛలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టిన ఐకేపీ యానిమేటర్లను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పలువురు నాయకులను అరెస్ట్ చేశారు.

చేసిన వాగ్దానం ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి?


రుణమాఫీపై చంద్రబాబు మాట తప్పారు: వైఎస్ జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణమాఫీ ప్రకటనపై మాటతప్పారని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. శాసనసభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ..  రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నంటినీ మాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తుచేశారు.

రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తానని అప్పట్లో చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక నిబంధనల పేరిట కోత పెట్టారని విమర్శించారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, గరిష్ట రుణమాఫీ పరిమితి పేరిట రైతులను మోసం చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఎన్నికల ముందు నిబంధనల గురించి ఎందుకు చెప్పలేదని సభలో నిలదీశారు. సభలో వైఎస్ జగన్ ఏమి మాట్లాడారంటే:
* రైతుల రుణాలపై ప్రభుత్వం చేసిన వాగ్దానం ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి?
* మార్చి 31వ తేదీ నాటికి రూ.87, 612 కోట్లు రైతు రుణాలున్నాయని, డ్వాక్రా రుణాలు రూ.14,204 కోట్లు ఉన్నాయని స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ ఎల్ బీసీ).. ముఖ్యమంత్రి చంద్రబాబు  సమక్షంలో జరిగిన సమావేశంలో వెల్లడించింది.
* మొత్తంగా రూ.1.02 కోట్లు రుణాలు ఉన్నాయని స్పష్టం చేసింది.
* రైతులు రుణాలు చెల్లించడం లేదని ఎస్ ఎల్ బీసీ తెలిపింది.
* ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తుందని ఎదురు చూస్తున్నందున రుణాలు రెన్యువల్ కావని స్పష్టం చేసింది.
* వీరికి పంట బీమా కూడా రాదని ఎస్ ఎల్ బీసీ వెల్లడించింది.
* రుణాలు చెల్లించకపోవడంతో అపరాధ వడ్డీ కూడా పడుతుందని వివరించింది.
* ఖరీఫ్ సీజన్ లో వ్యవసాయానికి ఇచ్చే రుణాలు ప్రక్రియ పూర్తిగా ఆగిపోయిందని ఎస్ ఎల్ బీసీ వెల్లడించింది.
*184వ సమావేశంలోనే కాకుండా తదుపరి 185, 186వ ఎస్ ఎల్ బీసీ సమావేశాల్లో కూడా ఇలాంటి విషయాలు చెప్పారు.
*2014-15లో బ్యాంకులు పెట్టుకున్న రుణాలు లక్ష్యం రూ.56,019 కోట్లు
*2011-12లో బ్యాంకులు పెట్టుకున్న రుణాల లక్ష్యం రూ.31,877 కోట్లు, వాస్తవంగా ఇచ్చినవి రూ.35,611 కోట్లు
*2012-2013లో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.35,654 కోట్లు, వాస్తవంగా ఇచ్చింది రూ.50,060 కోట్లు
*2013-14కు సంబంధించి టార్గెట్ రూ.47,017 కోట్లు కాగా వాస్తవంగా ఇచ్చింది రూ.49,774 కోట్లు.

జగన్ మా నేత అని గర్వపడుతున్నాం


హైదరాబాద్: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ నాయకుడని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే  సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. రుణమాఫీపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బేషరతుగా రుణమాఫీ చేస్తామని హామీయిచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందని విమర్శించారు. రేషన్ కార్డుకు ఒక్క రుణమాఫీ మాత్రమే చేస్తామనడం సరికాదన్నారు. రుణమాఫీపై మాట్లాడే అర్హత తమ పార్టీకి లేదని ప్రభుత్వం అనడం చాలా దురదృష్టకరమన్నారు.

ఎన్నికల సమయంలో రుణమాఫీపై టీడీపీ హామీయిచ్చినప్పడు మనం కూడా ప్రకటన చేద్దామని తమ నాయకుడు జగన్ ను అడిగామన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రుణమాఫీ సాధ్యపడదని జగన్ భావించారని చెప్పారు. రుణమాఫీపై హామీయిస్తే ఎన్నికల్లో లబ్ది పొందేవాళ్లమని, కానీ అలా చేయలేదన్నారు. సాధ్యపడదని హామీ ఇవ్వనందుకు జగన్ తమ నాయకుడని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామని సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు.

అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్

 ఐకేపీ యానిమేటర్ల అరెస్ట్ కు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది.  ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు శాసనసభాపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. బాబు వచ్చారు...జాబులు ఊడబీకారు అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిరుద్యోగులు..నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు.  సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేస్తున్న యానిమేటర్లను రాత్రికి రాత్రి అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు.

ఇది లక్ష కోట్ల కబ్జా!

* రాజధాని పేరుతో రైతుల నిలువు దోపిడీకి సర్కారు స్కెచ్
పైసా పెట్టుబడి లేకుండా 10 వేల ఎకరాల భూముల కైవసం
రైతుల నుంచి తీసుకున్న భూముల అభివృద్ధి పేరుతో 50 శాతం లాగేసుకుంటున్న ప్రభుత్వం
ఎక్కడైనా అభివృద్ధికి తీసుకునేది 40 శాతమే.. అదనంగా 10% భూములు తీసుకుంటున్న సర్కారు
ఇలా 50 వేల ఎకరాల భూమిలో పది శాతమంటే ఐదు వేల ఎకరాల భూమి చంద్రబాబు సర్కారు గుప్పిట్లోకి
ఇక అభివృద్ధి చేసిన తర్వాత మిగిలిన భూమిలో యజమానికి 70 శాతం, డెవలపర్‌కు 30 శాతం వాటా దక్కాలి
రాజధాని ప్రాంతంలో యజమానికి 50 శాతం, డెవలపర్‌కు 50 శాతం అంటూ కైవసం చేసుకుంటున్న సర్కారు
ఇలా రైతుల వాటాలోంచి మరో ఐదు వేల ఎకరాల భూమిని తానే సొంతం చేసుకునేలా చట్టంలో నిబంధనలు
అభివృద్ధి చేసిన భూమిలో 10,000 ఎకరాలు సర్కారుకు   
మొత్తం 4.84 కోట్ల గజాల భూమి.. గజం రూ. 25 వేల ధర చొప్పున లెక్కించినా లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల పైనే
ఈ భూముల్లో అభివృద్ధి పనుల కాంట్రాక్టులన్నీ అయిన వారికీ, బినామీలకు కట్టబెట్టేందుకు చట్టంలోనే ఏర్పాట్లు

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మించే పేరుతో లక్ష కోట్ల రూపాయలకు పైగా భూ దోపిడీకి రంగం సిద్ధమైంది. ఈ దోపిడీకి అవసరమైన సాంకేతిక ఏర్పాట్లన్నిటినీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) బిల్లులో చంద్రబాబు సర్కారు పొందుపరిచింది. రైతుల నుంచి ‘సమీకరించిన’ భూమిలో సగం భూమిని అభివృద్ధి పేరుతో లాగేసుకోవటమే కాక.. మిగిలిన సగం భూమి లో భూముల యజమానులైన రైతుల వాటా కింద సగం మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది. అంటే.. రాజధాని కోసం తీసుకుంటున్న 50 వేల ఎకరాల భూముల్లో వాటి యజమానులైన రైతుల వాటా కింద వారికి దక్కేది పావు వంతు.. అంటే కేవలం 12,500 ఎకరాలు మాత్రమే. మరి.. ప్రభుత్వం చేజిక్కించుకునే భూమి.. 22,500 ఎకరాలుగా లెక్క తేలుతోంది.

భూమిని తీసుకుని అభివృద్ధి చేసే ఎంత పెద్ద డెవలపర్లయినా న్యాయంగా తీసుకునే వాటాకన్నా.. 10 వేల ఎకరాలు ఎక్కువ. అంటే.. పూర్తిగా అభివృద్ధి చేసిన పది వేల ఎకరాల భూమి.. మొత్తం 4.84 కోట్ల గజాల భూమి.. ప్రభుత్వం పైసా పెట్టుబడి లేకుండా కబ్జా చేయబోతోంది. ఈ భూమికి కనిష్టంగా గజం రూ. 25,000 చొప్పున ధర చొప్పున లెక్కించినా కూడా లక్ష కోట్ల రూపాయలు దాటిపోతుంది. అంతేకాదు.. రాజధాని ప్రాంతంలో ఏ పని చేపట్టాలన్నా, ఏ కంపెనీ పెట్టాలన్నీ అనుమతి తీసుకోవాల్సింది సీఆర్‌డీఏ నుంచే. సీఆర్‌డీఏ తలచుకుంటే ఏ కంపెనీనైనా రంగంలోకి దించగలదు.

ఈ విధంగా అప్పనంగా పది వేల ఎకరాల భూములు చేజిక్కుంచుకోవటమే కాకుండా.. వాటిపై సర్వాధికారాలూ తన సారథ్యంలోని సీఆర్‌డీఏకే కట్టబెట్టటం ద్వారా.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన అనుయాయులు, తన బినామీలు, తనకు కావలసిన అందరినీ రంగంలోకి దించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. సర్కారు రైతుల నుంచి అన్యాయంగా లాగేసుకుంటున్న భూముల అభివృద్ధి విషయంలో బిల్లులో ఎలాంటి నియమ నిబంధనలు పెట్టకపోవడమే అందుకు నిదర్శనం. మామూలు డెవలపర్ నుంచి పేరుమోసిన డెవలపర్లు సైతం ఎక్కడా ఇలాంటి మోసాలకు పాల్పడిన దాఖలాలు లేవు.

అభివృద్ధి పేరుతో ఐదు వేల ఎకరాలు కబ్జా...
ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన సీఆర్‌డీఏ బిల్లును ఆసాంతం పరిశీలిస్తే రైతులు దారుణంగా దోపిడీకి గురవుతున్నారన్న విషయం స్పష్టమవుతోంది. రాజధాని పేరుతో మరోవైపు పైసా పెట్టుబడి లేకుండా వేలాది ఎకరాల రైతుల భూములను సర్కారు కబ్జా చేయనుంది. మామూలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసుకునే ఒప్పందాలైనా, డెరైక్టరేట్ ఆఫ్ కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ (డీటీసీపీ) నిబంధనల మేరకైనా.. అభివృద్ధి కోసం ఇచ్చిన భూమిలో 40 శాతం డెవలప్‌మెంట్ (రోడ్లు, డ్రైనేజీ, పార్కులు వగైరా) కోసం ప్రభుత్వానికి వదిలేస్తారు. అయితే రాజధాని కోసం దాదాపు 50 వేల ఎకరాలను సమీకరించడానికి సన్నద్ధమవుతున్న చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అభివృద్ధి పేరుతో ఏకంగా 50 శాతం భూములను లాగేసుకుంటుంది. ఈ 50 వేల ఎకరాల్లో అదనంగా పది శాతమంటే 5 వేల ఎకరాలు. ఎకరాకు 4,840 గజాల చొప్పున 2,42,00,000 గజాల భూమిని అన్యాయంగా లాగేసుకుంటోంది.

వాటాలో కోతతో మరో ఐదు వేల ఎకరాలు కైవసం...
అలాగే డెవలప్ చేసిన తర్వాత మిగిలిన భూముల్లో సర్వసాధారణంగా దేశమంతా నడుస్తున్న పద్ధతిలో అయితే భూ యజమానికి 70 శాతం ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన 30 శాతం మాత్రమే డెవలపర్ ఆ భూములను డెవలప్ చేసినందుకు గాను తీసుకుంటారు. కానీ రాజధాని పేరుతో ప్రభుత్వం అడ్డగోలు వ్యవహారానికి తెరలేపింది. రైతులకు 70 శాతం కాకుండా 50 శాతం మాత్రమే ఇస్తామని సీఆర్‌డీఏ బిల్లులో పెట్టింది. డెవపల్‌మెంట్ పేరుతో 10 శాతం భూములను ముందుగానే లాగేసుకుంటున్న ప్రభుత్వం మిగిలిన భూముల్లోనూ దోపిడీకి దిగింది.

50 వేల ఎకరాల్లో అభివృద్ధికి 50 శాతం పేరుతో తీసివేయగా మిగిలిన 25 వేల ఎకరాల్లో న్యాయంగా (70 శాతం) అయితే రైతులకు 17,500 ఎకరాలు ఇవ్వాలి. మిగిలిన (30 శాతం) 7,500 ఎకరాలు మాత్రమే అభివృద్ధి చేసినందుకుగాను డెవలపర్‌గా ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఇక్కడా 50:50 నిష్పత్తిలో రైతాంగానికి అన్యాయమే చేస్తున్నారు. రైతులకు 12,500 ఎకరాలు ప్రభుత్వానికి 12,500 ఎకరాల చొప్పున కేటాయిస్తామని సీఆర్‌డీఏ బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు.

పైసా ఖర్చు లేకుండా పది వేల ఎకరాలు సొంతం...
భూముల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసమంటూ అదనంగా ఐదు వేల ఎకరాలు లాగేసుకుంటున్న ప్రభుత్వం.. ఆ తర్వాత ఆ సౌకర్యాలు కల్పించిన భాగస్వామిగా మరో ఐదు వేల ఎకరాలు అప్పనంగా రైతుల నుంచి కైవసం చేసుకుంటోంది. ఈ లెక్కన మొత్తంగా పది వేల ఎకరాల భూమి.. అంటే 4.84 కోట్ల గజాల భూమిని.. పైసా పెట్టుబడి లేకుండా ప్రభుత్వం కాజేస్తోంది. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం చెబుతున్న ధర మేరకు గజానికి 25 వేల లెక్క చూసుకున్నా లక్షా ఇరవై వేల కోట్ల విలువైన భూములు అన్యాయంగా అదనంగా ప్రభుత్వం కాజేస్తోంది. ఇలా భారీ కుంభకోణానికి పూర్వరంగం సిద్ధం చేసుకుంది.

కార్పొరేట్లకు కట్టబెట్టే అవకాశం...
భూ సమీకరణలో భూముల అభివృద్ధి పనులు చేపట్టడానికి లెసైన్స్ పొందిన ఏదైనా జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీకి కట్టబెట్టడానికి సీఆర్‌డీఏ బిల్లులో వె సులుబాటు కల్పించారు. ఇప్పటికే సింగపూర్ లాంటి దేశాలకు చెందిన సంస్థలతో మాస్టర్ ప్రణాళిక సిద్ధం చేయిస్తున్న ప్రభుత్వం రేపటి రోజున అభివృద్ధి పేరుతో ‘జాతీయ, అంతర్జాతీయ’ కార్పొరేట్ సంస్థలకు ద్వారాలు తెరవడానికి ఈ బిల్లు అవకాశం కల్పిస్తోంది.

రాజధాని ప్రాంతంలో భూములు అభివృద్ధి చేయడానికి ఆయా సంస్థలు సీఆర్‌డీఏకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇక్కడే ప్రభుత్వం తన యుక్తిని ప్రదర్శించి తనకు కావాల్సిన వారికి డెవలప్‌మెంటు బాధ్యతలు అప్పగించే విధంగా సీఆర్‌డీఏ బిల్లు తొమ్మిదో చాప్టర్‌లోని 54వ సెక్షన్‌లో పొందుపరిచింది. డెవలప్‌మెంటు సంస్థ దరఖాస్తు చేసుకునే ముందే సీఆర్‌డీఏ కమిషనర్ నుంచి లెసైన్సు పొందాలనే నిబంధన ‘సొంత ప్రయోజనాల’ పరిరక్షణకేనని కచ్చితంగా తెలుస్తోంది.

ప్రజలపై చట్టాల ప్రయోగం...
రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతంలో ఎలాంటి స్థిర, చరాస్తులైనా సేకరించే అధికారాన్ని సీఆర్‌డీఏకు కట్టబెట్టారు. ఈ విషయంలో రైతులకు ప్రశ్నించే అధికారాలు లేవు. రేపటి రోజున రైతులు, ఆ ప్రాంత పరిధిలో నివశించే అందరూ ప్రతి విషయంలోనూ ప్రభుత్వ అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేశారు. అలాగే ప్రభుత్వం అభివృద్ధి పరిచిన ప్రాంతంలో రైతులు, అక్కడ నివాసం ఉండే వారిపై భారీ స్థాయిలో లెసైన్స్ ఫీజులు, యూజర్ చార్జీల భారం వేయనున్నారు. ఆంక్షలు, పరిమితులు, అనుమతుల పేరుతో ఒకరకంగా ఆ ప్రాంత ప్రజలంతా ప్రభుత్వ అనుమతి లేనిదే ఒక్క అడుగు కూడా ముందుకు వేయని ఒకరకమైన ఎమర్జెన్సీ పరిస్థితులకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. సీఆర్‌డీఏ కమిషనర్‌కు బిల్లులో విశేష అధికారాలను కల్పించారు.

కమిషనర్ తీసుకునే నిర్ణయాలు, జారీ చేసే ఉత్తర్వులపై ఎవరూ కూడా ఏ న్యాయస్థానంలోను అప్పీల్ చేయరాదని బిల్లులో పేర్కొన్నారు. సీఆర్‌డీఏ కమిషనర్ అనుమతి లేనిదే రాజధాని ప్రాంతంలో ఏదీ చేయరాదు. సొంత ఇళ్లు, భవనాల్లో గానీ ఎటువంటి మార్పులు చేయరాదు. సొంత భూమిలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టరాదు. కమిషనర్ అనుమతికి విరుద్ధంగా ఎవరైనా అభివృద్ధి పనులను చేపడితే మూడేళ్ల పాటు జైలు శిక్షతో పాటు ఆ భూమి విలువలో 20 శాతం జురిమానా విధిస్తారు. చట్టం ప్రకారం నిర్ధారించిన వ్యక్తిని భూమి, భవనాల్లోకి అనుమతించకుండా అడ్డంకులు సృష్టిస్తే అలాంటి వారికి ఆరు నెలల పాటు జైలు శిక్షతో పాటు పది వేల రూపాయలు జరిమానా విధిస్తారు.

Popular Posts

Topics :