సీఆర్ డీఏ కమిషనర్ శ్రీకాంత్ పై వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో రెండో పంట వేయొద్దని చెప్పడానికి శ్రీకాంత్ ఎవరని ప్రశ్నించారు. 'శ్రీకాంత్ నీవు రాష్ట్రపతివా... లేక రాజ్యాంగేతర శక్తివా? నీకు దమ్ముంటే రెండో పంట వేయవద్దని జీవో ఇవ్వు.
'సోంపేట, కాకరాపల్లి నరమేధం సృష్టించింది నీవుకాదా?. ఈ నరహంతకుడికి చంద్రబాబు సీఆర్ డీఏ బాధ్యతలు ఇస్తారా? చంద్రబాబు నీ హెరిటేజ్ మూసివేస్తే ఊరుకుంటావా?. రాష్ట్రంలో ఉంది ప్రభుత్వమా...లేక రాక్షస పాలనా? ఔరంగజేబు కూడా ఇలా పాలించలేదు' అంటూ తమ్మినేని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ తణుకు దీక్షతో ప్రభుత్వంలో వణుకు ప్రారంభమవుతోందని ఆయన అన్నారు. జగన్ దీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజానికం తరలి వస్తున్నారని తమ్మినేని తెలిపారు.
'సోంపేట, కాకరాపల్లి నరమేధం సృష్టించింది నీవుకాదా?. ఈ నరహంతకుడికి చంద్రబాబు సీఆర్ డీఏ బాధ్యతలు ఇస్తారా? చంద్రబాబు నీ హెరిటేజ్ మూసివేస్తే ఊరుకుంటావా?. రాష్ట్రంలో ఉంది ప్రభుత్వమా...లేక రాక్షస పాలనా? ఔరంగజేబు కూడా ఇలా పాలించలేదు' అంటూ తమ్మినేని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ తణుకు దీక్షతో ప్రభుత్వంలో వణుకు ప్రారంభమవుతోందని ఆయన అన్నారు. జగన్ దీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజానికం తరలి వస్తున్నారని తమ్మినేని తెలిపారు.
0 comments:
Post a Comment