* గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడానికి పార్టీ సహకరిస్తుంది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 5, 6 జోన్లలో ఎంపికైన 301 మంది ఆంధ్రా ఇంజనీర్ల సమస్యను పరిష్కరించాల్సిందిగా ఏపీ, తెలంగాణ సీఎంలకు లేఖలు రాస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సమస్యను రాష్ట్ర గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళతామన్నారు. సమస్యను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు వీలుగా వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు ఇంజనీర్ల ప్రతినిధి బృందాన్ని గవర్నర్ వద్దకు తీసుకెళతారని చెప్పారు.
ఇంజనీర్ నాగభూషణం నేతృత్వంలోని ఆంధ్రా ఇంజనీర్ల బృందం సోమవారం జగన్ను కలిసి.. తమ సమస్య పరిష్కారానికి సహాయం అందించాలని విజ్ఞప్తి చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని 5, 6 జోన్ల(తెలంగాణ ప్రాంతంలోవి)లో ఎంపికైన 301 మంది ఆంధ్రా ఇంజనీర్లు విభజన సమయానికి ఏపీలోని వివిధ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నారు. తెలంగాణ జోన్లలో ఎంపికైన ఇంజనీర్లను తెలంగాణ ప్రభుత్వానికి పంపిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, వారికి పోస్టింగ్స్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం నిరాకరించింది. ఫలితంగా 4 నెలలుగా వారంతా పోస్టింగ్స్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు.
0 comments:
Post a Comment