వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించిన పొంగులేటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించిన పొంగులేటి

వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించిన పొంగులేటి

Written By news on Friday, January 9, 2015 | 1/09/2015


వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించిన పొంగులేటి
హైదరాబాద్: తెలంగాణలో వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కమిటీని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి  52 మందితో కమిటీని నియమించారు. అందులో 8 మంది ప్రధాన కార్యదర్శులు, 11 మంది కార్యదర్శులు, 11 మంది సంయుక్త కార్యదర్శులు, 4 జిల్లాలకు అధ్యక్షులు, 10 మంది అనుబంధ జిల్లాల అధ్యక్షులు, ముగ్గురు అధికార ప్రతినిధులను నియమించారు.
తెలంగాణలో పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం లభిస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. త్వరలోనే మరికొంతమంది పేర్లను కూడా ప్రకటించనున్నట్టు ఆయన వెల్లడించారు. తెలంగాణలో వైఎస్ఆర్ సీపీ బలోపేతానికి కృషి చేస్తామని పొంగులేటి తెలిపారు.
Share this article :

0 comments: