జగన్ మాట్లాడింది జనం మాటే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ మాట్లాడింది జనం మాటే

జగన్ మాట్లాడింది జనం మాటే

Written By news on Wednesday, January 7, 2015 | 1/07/2015


జగన్ మాట్లాడింది జనం మాటేఅంబటి రాంబాబు
 తమను హింసిస్తున్న బాబు సర్కారు పడిపోవాలని రైతులు కోరుకుంటే తప్పేంటి?
జగన్‌ను ఎందుకు ఆడిపోసుకుంటున్నారు?
టీడీపీపై అంబటి రాంబాబు ధ్వజం

 సాక్షి, హైదరాబాద్: రైతులను ఉగ్రవాదుల మాదిరిగా చూస్తూ వారిని కర్కశంగా అణగదొక్కాలని చూస్తున్న టీడీపీ ప్రభుత్వం కూలిపోవాలని రైతాంగం కోరుకుంటే తప్పేమిటని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో పరిస్థితులు వివరించడానికి వచ్చిన రైతులను ఉద్దేశించి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగాన్ని తప్పు పడుతూ టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ముప్పేట దాడి చేయడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘జగన్ రైతులనుద్దేశించి మాట్లాడిన ప్రతి మాట ఆయనది కాదు.. జనం మాటే’ అని అంబటి స్పష్టం చేశారు. ప్రభుత్వం పడిపోవాలనేది జగన్ కోరిక కాదని, తుళ్లూరు ప్రాంత రైతులు తమను బాధలు పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లకే పడిపోతే బాగుండుననే భావనతో ఉన్నారని వివరించారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పోలీసులను ప్రయోగిస్తూ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదని, జగన్ ప్రతిపక్ష నేతే కాదంటున్న చంద్రబాబు తాబేదార్లు.. ప్రతిపక్ష నేత కాకపోతే జగన్‌పై ఎందుకింత అక్కసు వెళ్లగక్కుతున్నారని ఎద్దేవా చేశారు.

 అప్పుడు ప్రభుత్వాన్ని ఖబడ్దార్ అన్నారుగా!
 ‘2011 మే 14న చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో మాట్లాడుతూ రైతుల భూముల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పుడేమో రాజధాని ప్రాంత రైతులనే ఖబడ్దార్ అంటూ బెదిరిస్తున్నారు..’ అని అంబటి దుయ్యబట్టారు. అప్పట్లో టీడీపీ అనుకూల పత్రిక ఒకటి ఈ మేరకు రాసిన వార్త ప్రతిని విలేకరులకు చూపారు. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి భూములను సేకరించాలని, ఆ లాభం రైతులకే చెందాలని, రైతులే సెజ్‌లు పెట్టాలని, తాడేపల్లి, పెనుమాక గ్రామాల్లో భూసేకరణకు జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని హెచ్చరించిన చంద్రబాబు ఇప్పుడు మాట్లాడుతున్నదేమిటని ప్రశ్నించారు. జగన్ రాజధాని రైతుల పక్షాన మాట్లాడితే.. ఆయన ఇడుపులపాయలో రాజధాని పెట్టాలంటున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు జగన్ ఎప్పుడైనా సరే ఆ మాట అన్నారా? అని ప్రశ్నించారు. రాజధాని భూ సమీకరణ వ్యవహారంలో పోలీసులు తలదూరిస్తే ప్రజాస్వామ్యవాదులు సహించరని అంబటి హెచ్చరించారు. పోలీసులు శాంతిభద్రతలను పరిరక్షించాలే తప్ప భూములివ్వబోమని చెప్పిన రైతులను వేధించడం ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంత గ్రామాల్లో ప్రతిపక్ష నేత జగన్ తప్పకుండా పర్యటిస్తారని అంబటి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Share this article :

0 comments: