ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడం ఇష్టం లేక జీతాలకు డబ్బులే లేవంటున్నారని, కావాలనే చంద్రబాబు బీద ఆరుపులు అరుస్తున్నారని, పిఆర్సి ఇవ్వాల్సి వస్తుందనే ఆయన అలా అంటున్నారని చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో రూ. 375 కోట్ల మిగుల బడ్జెట్ ఉందని జనవరి 7న చంద్రబాబు ప్రభుత్వం మంత్రులు, ఉన్నతాధికారు సమావేశంలో ప్రకటించారని ఆయన చెప్పారు. కాని ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు లేవని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.రాష్ట్ర మిగులు బడ్జెట్ అంతా ముఖ్యమంత్రి ప్రత్యేక విమానాల ఖర్చులకు సరిపోయిందా అని ఆయన అన్నారు.నిజంగానే రాష్ట్రం ఇబ్బందులలో ఉంటే ప్రత్యేక విమానాలలో చంద్రబాబు ఎలా తిరుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఏభై కోట్లతో సి.ఎమ్ ఆఫీస్ ఎలా మరమ్మత్తు చేయించారని అన్నారు.కోట్లు ఖర్చు పెట్టి విజయవాడలో సభలు,సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారని చెవిరెడ్డి అన్నారు.
0 comments:
Post a Comment