ఇసుక విధానాన్ని మార్చకపోతే వైఎస్సార్ సీపీ ఆందోళన బాట - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇసుక విధానాన్ని మార్చకపోతే వైఎస్సార్ సీపీ ఆందోళన బాట

ఇసుక విధానాన్ని మార్చకపోతే వైఎస్సార్ సీపీ ఆందోళన బాట

Written By news on Sunday, January 4, 2015 | 1/04/2015


చంద్రబాబు ఒక రూపాయికే ఇసుక ఇస్తున్నారు!
అనంతపురం:  ఆంధ్రప్రదేశ్ సర్కారుపై మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు పాలన పిచ్చితుగ్లక్ పాలనను తలపిస్తోందని ఎద్దేవా చేశారు. ఇసుక విధానం లోపభూయిష్టంగా ఉందని.. ట్రాక్టర్ ఇసుక రూ. 1,600 నుంచి రూ. 5వేలకు పెరిగిందని వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఎన్టీఆర్, వైఎస్సార్ కిలో బియ్యం రూ. 2 కే ఇస్తే.. చంద్రబాబు ఒక్క రూపాయికే కిలో ఇసుక ఇస్తున్నారన్నారు.
 
రైతులకు రుణాలు మాఫీ కాలేదని..కొత్త రుణాలు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు విధానాలతో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయన్నారు. ఇసుక విధానాన్ని మార్చకపోతే వైఎస్సార్ సీపీ ఆందోళన బాట పడుతోందని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు.
Share this article :

0 comments: