బాబు సీఎం అయ్యాక పెరిగిన బాంబు దాడులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు సీఎం అయ్యాక పెరిగిన బాంబు దాడులు

బాబు సీఎం అయ్యాక పెరిగిన బాంబు దాడులు

Written By news on Thursday, January 22, 2015 | 1/22/2015


'బాబు సీఎం అయ్యాక పెరిగిన బాంబు దాడులు'
గుంటూరు : చంద్రబాబు సీఎం అయ్యాక బాంబు దాడులు పెరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు జిల్లా పాపాయపాలెంలో టీడీపీకి చెందిన కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై బాంబులతో దాడి చేశారని చెప్పారు. ఈ ఘటనలో వైఎస్సార్ సీపీకి చెందిన మాజీ జెడ్పీటీసీ అచ్చిరెడ్డి, రఫీ గాయపడ్డారని తెలిపారు. బాంబు దాడి ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు.

గతంలో కూడా మంత్రుల స్థాయిలో ఉన్న నేతలు బాంబులు వేయించిన సంఘటనలు ఉన్నాయని అంబటి గుర్తు చేశారు. ప్రశాంతంగా ఉన్న గుంటూరులో మళ్లీ ఇప్పుడు బాంబుల సంస్కృ విపరీతంగా పెరిగిందని పేర్కొన్నారు. తమ పార్టీ నేతలపై జరిగిన బాంబు దాడి ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: