వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై బాంబు దాడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై బాంబు దాడి

వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై బాంబు దాడి

Written By news on Thursday, January 22, 2015 | 1/22/2015


గుంటూరు: ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీ ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తెలుగు తమ్ముళ్లు దాడులకు తెగబడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయపాలెంలోని ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు బాంబులతో దాడికి పాల్పడ్డారు.

ఈ దాడిలో మాజీ జెడ్పీటీసీ మర్రి అచ్చిరెడ్డి, రఫీ గాయపడ్డారు. ఓ కేసు విషయమై సత్తెనపల్లి కోర్టులో హాజరై తిరిగి వస్తుండగా వీరి వాహనంపై దాడి జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
Share this article :

0 comments: