- పార్టీలో చేరిన కొణిజర్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు
నల్గొండ జిల్లాలో షర్మిల చేపట్టిన పరామర్శ యాత్రకు సంఘీభావం తెలిపేందుకు పార్టీ వైరా నియోజకవర్గ ఇన్చార్జి బొర్రా రాజశేఖర్ నేతృత్వంలో 5 మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా త రలి వెళ్లారు. ఆత్మకూరు మండలంలో షర్మిలను కలిసి పార్టీలో చేరారు. సైదులునాయక్తో పాటు కాంగ్రెస్ మండల మాజీ సహాయ కార్యదర్శి గుడివాడ వెంకటేశ్వర్లు, వైరా మార్కెట్ కమిటీ మాజీ డైరక్టర్ గుగులోత్ బాలు, జార ఆంజనేయులు తదితరులకు షర్మిల పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారందరికీ అండగా ఉంటామని, పొంగులేటి శీనన్న నేతృత్వంలో తెలంగాణలో పార్టీ బలమైన శక్తిగా మారబోతోందని, భయపడాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా షర్మిల అభయమిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, యువజన విభాగం రెండు జిల్లాల కోఆర్డినేటర్ సాధు రమేష్ రెడ్డి, నాయకులు దొడ్డపనేని రామారావు, నల్లమల వెంకటేశ్వరావు, కొణిజర్ల, వైరా, ఏన్కూర్, జూలూరుపాడు, కారేపల్లి మండలాల కన్వీనర్లు రాయల పుల్లయ్య, సూతగాని జైపాల్, ముక్తి వెంకటేశ్వర్లు, ఇమ్మడి తిరపతిరావు ,అల్లాడి నరసింహారావు, కొణిజర్ల, కారేపల్లి వైస్ ఎంపీపీలు తాళ్లూరి చిన్నపుల్లయ్య, రమాదేవి, సర్పంచ్లు అప్పం సురేష్, సవళ్ల ముత్తయ్య, బాణోత్ రవి.
0 comments:
Post a Comment