హైదరాబాద్: ప్రముఖ న్యూస్ రీడర్ బద్రి ఆకస్మిక మృతిపట్ల వైఎస్సార్ సీపీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పార్టీ తరుపున సానుభూతి తెలియజేశారు. బద్రి మృతి మీడియా రంగానికి లోటేనన్నఅంబటి పార్టీ తరపున సంతాపం తెలిపారు.
ద్వారకాతిరుమల వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ న్యూస్ రీడర్ బద్రి దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన వెళుతున్న కారు చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. తొలుత ఆయన ప్రయాణిస్తున్న కారు టైరు పేలి పోవడంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బద్రి మృతి చెందగా, ఆయన భార్య లక్ష్మీ సుజాత, ఇద్దరు పిల్లలు సాయి, సాత్విక్ లకు తీవ్ర గాయాలు కావడంతో వారిని ఏలూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఆయన మృతిపట్ల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ద్వారకాతిరుమల వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ న్యూస్ రీడర్ బద్రి దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన వెళుతున్న కారు చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. తొలుత ఆయన ప్రయాణిస్తున్న కారు టైరు పేలి పోవడంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బద్రి మృతి చెందగా, ఆయన భార్య లక్ష్మీ సుజాత, ఇద్దరు పిల్లలు సాయి, సాత్విక్ లకు తీవ్ర గాయాలు కావడంతో వారిని ఏలూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఆయన మృతిపట్ల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
0 comments:
Post a Comment