‘రైతు భరోసా’తో ప్రభుత్వానికి కనువిప్పు కల్గిస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘రైతు భరోసా’తో ప్రభుత్వానికి కనువిప్పు కల్గిస్తాం

‘రైతు భరోసా’తో ప్రభుత్వానికి కనువిప్పు కల్గిస్తాం

Written By news on Friday, February 20, 2015 | 2/20/2015

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి
 కూడేరు : రైతు భరోసా యాత్రతో ప్రభుత్వానికి కనువిప్పు కల్గిస్తామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు.  మండల పరిధిలోని అంతరగంగలో ఈ నెల 24న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి  చేపడుతున్న ‘రైతు భరోసా యాత్ర’ కు మండలంలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కూడేరులోని ఓ రైస్‌మిల్‌లో గురువారం ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆ యన ఏర్పాట్లపై నాయకులతో చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో దృతరాష్ట్ర పాలన కొనసాగుతోందన్నారు.
 
  ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దీక్షలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పుడు మా్ర తమే ప్రభుత్వానికి ప్రజా సమస్యలు గుర్తుకొస్తున్నాయన్నారు. కరువు ప్ర భావం వల్ల అప్పులపాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లభించడం లేదన్నారు.  బాధిత కుటుంబాలను పరామర్శించడానికి కూడా పాలకులు ముందుకు రావడం లేదని మండిపడ్డారు. జిల్లాలో రైతుల ఆత్మహత్యలు వైఎస్సార్ సీపీ నాయకులు, సాక్షి పత్రిక కల్పితాలని  స్వయాన జిల్లా మంత్రులు చెప్పడం సిగ్గు చేటన్నారు. ఆత్యహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించి, వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారి లబ్ధిచేకూర్చేందుకు జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా యాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారన్నారు.
 
 దీంతో  సీఎం చంద్రబాబుకు వణుకు పుట్టి  ఆఘమేఘాలపై బాధిత రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు చర్యలు చేపడుతున్నారన్నారు. రైతు భరోసా యాత్రతో రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. గ్రామగ్రామానా ఈ కార్యక్రమంపై విస్తృత ప్ర చారం చేయాలని ఎమ్మెల్యే సూచిం చారు. రైతులు వారి సమస్యలను జగన్‌కు చెప్పుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజశేఖర్, జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మ, సర్పం చ్‌లు, ఎంపీసీ సభ్యులు,  నాయకులు మాదన్న, దేవేంద్ర, తిమ్మారెడ్డి, మలోబులేసు, బాలన్న, మల్లికార్జున, తిమ్మారెడ్డి, సత్యనారాయణ, గంగాధర్, హనుమంతరెడ్డి, సూర్యనారాయణరె డ్డి,  సూర్యనారాయణ, నారాయణరెడ్డి, ఆది, పెన్నోబులేసు, చిదంబరం, ఓబులేసు, రాజు, శంకర్‌నాయక్, ఛత్రేనాయక్, శంక ర్‌రెడ్డి, తిరుపతయ్య,  ఉజ్జనప్పలు పాల్గొన్నారు.
Share this article :

0 comments: