స్పీకర్ పై అవిశ్వాసం పెట్టే యోచనలో వైఎస్ఆర్ సీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » స్పీకర్ పై అవిశ్వాసం పెట్టే యోచనలో వైఎస్ఆర్ సీపీ

స్పీకర్ పై అవిశ్వాసం పెట్టే యోచనలో వైఎస్ఆర్ సీపీ

Written By news on Thursday, March 19, 2015 | 3/19/2015

హైదరాబాద్ :  వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ..స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు సమాలోచనలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న ప్రతిపక్షం గొంతునొక్కేందుకు ప్రయత్నిస్తుందంటూ... ఈ విషయాన్ని గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకు వెళ్లేందుకు వైఎస్ఆర్ సీపీ సిద్దమైంది. అంతేకాకుండా  ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై గవర్నర్ కు వినతిపత్రం సమర్పించే యోచనలో ఉంది.
కాగా గురువారం అసెంబ్లీలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతుండగా ప్రసంగం ముగించాలని స్పీకర్‌ పదే పదే హెచ్చరించారు. తాను మాట్లాడేది ఇంకా ఉందని జగన్‌ అంటుంటే...  విపక్షానికి వాళ్లు కోరినంత సమయం ఇవ్వలేమని స్పీకర్‌ ప్రకటించారు.  ' యూ కెన్‌ నాట్‌ స్పీక్ అంటూ మైక్‌ కట్‌ చేశారు'.
ఈ క్రమంలో విపక్ష సభ్యులంతా స్పీకర్‌ పోడియం చుట్టుముట్టారు. తీవ్ర గందరగోళం మధ్య స్పీకర్‌ సభను పది నిమిషాలు వాయిదా వేశారు.  వాయిదా అనంతరం వైఎస్‌ఆర్‌ సీపీ సభ్యుల సస్పెన్షన్‌ తీర్మానాన్ని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు.  మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఈ నెల 23 వరకు సస్పెండ్‌ చేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు.
Share this article :

0 comments: