పోలవరం ప్రాజెక్టును డెడ్ స్టోరేజీలోకి నెట్టి, పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తేవడం దారుణమని, దీనికోసం జారీచేసిన జీవోలోని అంశాలన్నీ భయం, విస్మయం గొలిపేలా ఉన్నాయన్నారు. ఆయా చట్టాలతో రాష్ట్రం అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రధానికి వివరించామన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు వస్తే గోదావరి ట్రిబ్యూనల్ ప్రకారం ఏపీకి ఎలాంటి అన్యాయం జరుగుతుందో వివరించినట్లు తెలిపారు.
వైఎస్ జగన్ ప్రస్తావించినవాటిలో కొన్ని ముఖ్యాంశాలు..
► గోదావరి ట్రిబ్యూనల్ లోని 7 ఎఫ్ క్లాజ్ ప్రకారం ఎంత నీటిని ఏపీ వాడుకుంటుందో అంతే నీటిని కర్ణాటక, మహారాష్ట్రలూ తీసుకుంటాయి. జీవో జారీ అయింది కాబట్టి నిర్మాణంతో నిమిత్తం లేకుండా ఆ రెండు రాష్ట్రాలు ఇప్పటి నుంచే నీటిని వాడుకుంటాయిని భయపడుతున్నాం.
► ఎగువ రాష్ట్రాలు నీటిని తీసుకుంటారేమోనన్న భయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు.
► పోలవరం ప్రాజెక్టుకు 130 టీఎంసీల స్టోరేజీ నిర్మాణం ఉంది. కానీ పట్టిసీమ ప్రాజెక్టుతో ఒక్క టీఎంసీ నీటిని కూడా స్టోర్ చేసుకోలేం.
► భారీ ఎక్సెస్ తో టెండర్లను రూపొందించారు. అనుయాయులకు లబ్ధి చేకూరేలా సీఎం వ్యవహరిస్తున్నారు.
► ఎఫ్ సీఐ ద్వారా ధాన్యం సేకరించొద్దనే నిర్ణయాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి. దీనిపై శాంతకుమార్ రూపొందించిన నివేదికను పరిగణనలోకి తీసుకోవద్దని మనవి. ఈ నిర్ణయంతో మద్దతు ధర లభించక రైతులు విలవిలలాడే పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి.
0 comments:
Post a Comment