6 నుంచి వైఎస్సార్సీపీ సదస్సులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 6 నుంచి వైఎస్సార్సీపీ సదస్సులు

6 నుంచి వైఎస్సార్సీపీ సదస్సులు

Written By news on Sunday, April 5, 2015 | 4/05/2015

హైదరాబాద్: ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) నియోజకవర్గస్థాయి అవగాహనా సదస్సులను ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా ఈ నెల 6న విశాఖజిల్లా పాడేరులో తొలి సదస్సును నిర్వహించనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన నేతలతోపాటు పార్టీకి చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీ, పంచాయితీవార్డు సభ్యులు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్షులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ఈ సదస్సులకు కేంద్ర కార్యాలయం నుంచి త్రిసభ్య కమిటీ సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వి.విజయసాయిరెడ్డి, సాగి దుర్గాప్రసాదరాజు హాజరవుతారు. ఉత్తరాంధ్రలో జరిగే ఈ సదస్సులో పార్టీ ప్రధాన కార్యదర్శులు ధర్మాన ప్రసాదరావు, సుజయ్‌కృష్ణ రంగారావు పాల్గొంటారు.
Share this article :

0 comments: