వైఎస్సార్‌సీపీ సదస్సు నేడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీ సదస్సు నేడు

వైఎస్సార్‌సీపీ సదస్సు నేడు

Written By news on Monday, April 6, 2015 | 4/06/2015


వైఎస్సార్‌సీపీ సదస్సు నేడు
ఎమ్మెల్యే ఈశ్వరి ఆధ్వర్యంలో  పెద్ద ఎత్తున ఏర్పాట్లు
హాజరుకానున్న పార్టీ  త్రిసభ్య కమిటీ సభ్యులు
ముఖ్యనేతలు, ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్యేలు రాక

 
పాడేరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సదస్సు పాడేరులో సోమవారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే గిడ్డిఈశ్వరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. నియోజకవర్గంలోని 5 మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నియోజకవర్గస్థాయి సదస్సులు పాడేరులో ప్రారంభమవుతుండటంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్ర పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి ప్రసాదరాజుతోపాటు ముఖ్య నేతలు ధర్మా న ప్రసాదరావు, సుజయ్‌కృష్ణ రంగారావు, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, అరకు పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్‌చార్జి బొడ్డేడ ప్రసాద్‌తోపాటు ఉత్తరాంధ్రలోని అరకు, మాడుగుల, కురుపాం, పాలకొండ, రంపచోడవరం, రాజాం, పాతపట్నం, సాలూరు ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, బూడి ముత్యాల నాయుడు, పుష్పశ్రీవాణి, కళావతి, రాజేశ్వరి, కంబాల జోగులు, కలమట వెంకటరమణమూర్తి, రాజన్నదొర, రంపచోడవరం నియోజకవర్గం ఇన్‌చార్జి అనంతబాబు హాజరవుతున్నారు.

పాడేరులో జరుగుతున్న వైఎస్సార్‌సీపీ తొలి నియోజక వర్గ సదస్సుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్థానిక పట్టణ పురవీధుల్లో వైసీపీ ర్యాలీ అనంతరం స్థానిక వెంకటరమణ థియేటర్‌లో సదస్సు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Share this article :

0 comments: