సొమ్మసిల్లి పడిపోయిన రోజా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సొమ్మసిల్లి పడిపోయిన రోజా

సొమ్మసిల్లి పడిపోయిన రోజా

Written By news on Saturday, April 11, 2015 | 4/11/2015


సొమ్మసిల్లి పడిపోయిన రోజా
తిరుపతి: చిత్తూరు జిల్లా పుత్తూరు సీఐ కార్యాలయం ఎదుట శనివారం ధర్నాకు దిగిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా సొమ్మసిల్లి పడిపోయారు. దాంతో ఆమెను వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం పుత్తూరు ఎంపీడీవో కార్యాలయంలో సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ బీసీ రుణాల విషయమై అధికారులను ఎమ్మెల్యే రోజా నిలదీశారు. ఆ క్రమంలో అక్కడే ఉన్న టీడీపీ నాయకులు రోజాతో వాగ్వివాదానికి దిగారు. దాంతో రోజా ధర్నాకు దిగారు.
ఆ సమయంలో రోజా చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు గోరంతలు కొండంతలు చేశారు. టీడీపీ నాయకులు శుక్రవారం సాయంత్రం రోజా వ్యాఖ్యాలపై పుత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదు చేసి ఎస్ఐ, సీఐలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం పుత్తూరు సీఐ కార్యాలయం ఎదుట రోజా ధర్నా నిర్వహించారు. ఆ క్రమంలో రోజా  సొమ్మసిల్లి పడ్డిపోయారు.
 
Share this article :

0 comments: