Home »
» రైతులను ఆదుకోవాలి: వైఎస్ జగన్
రైతులను ఆదుకోవాలి: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకోవడానికి యుద్ధప్రాతిపదికన తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు రాయలసీమ జిల్లాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, పలువురు మృతి పడ్డారని పేర్కొన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఈ సందర్భంగా జగన్ తన సంతాపాన్ని ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాల కారణంగా రైతులు బాగా నష్టపోయారని, పార్టీ నేతలు, శ్రేణులు ఆయా ప్రాంతాల్లో సందర్శించి బాధితులను పరామర్శించి తోడుగా నిలవాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.
0 comments:
Post a Comment