రేపటి నుంచి వైఎస్సార్ సీపీ బస్సుయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపటి నుంచి వైఎస్సార్ సీపీ బస్సుయాత్ర

రేపటి నుంచి వైఎస్సార్ సీపీ బస్సుయాత్ర

Written By news on Tuesday, April 14, 2015 | 4/14/2015


రేపటి నుంచి వైఎస్సార్ సీపీ బస్సుయాత్ర
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాజెక్టుల స్థితిగతులు తెలుసుకునేందుకు వైఎస్సార్ సీపీ చేపట్టనున్న బస్సుయాత్ర  బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రలో పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు పాల్గొనున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
 
రాజమండ్రి నుంచి ప్రారంభం కానున్న బస్సుయాత్ర మూడు రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలిపారు.  రేపటి యాత్రలో తొలుత ధవళేశ్వర బ్యారేజీ వద్ద కాటన్, వైఎస్సార్ విగ్రహాలకు వైఎస్ జగన్ నివాళులు అర్పించిన అనంతరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని సందర్శించనున్నట్లు రఘురాం తెలిపారు.  దీనిలో భాగంగానే పట్టిసీమ రేవు వద్ద రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు.
Share this article :

0 comments: