మంత్రి గారికి కోపం వచ్చింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మంత్రి గారికి కోపం వచ్చింది

మంత్రి గారికి కోపం వచ్చింది

Written By news on Friday, May 1, 2015 | 5/01/2015

వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాదరెడ్డి హత్యకేసులో ఎస్ఐ, సీఐలను వీఆర్ కు పంపడంపై మంత్రి పరిటాల సునీత తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ప్రభుత్వం తనకు కేటాయించిన ముగ్గురు గన్ మెన్, ఐదుగురు ఎస్కార్ట్ సిబ్బందిని వెనక్కి పంపేశారు.

ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు చెప్పాలని కూడా ఆమె చెప్పారు. వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాదరెడ్డి హత్య కేసులో ఇటుకులపల్లి ఎస్ఐ, రాప్తాడు సీఐలను డీఐజీ బాలకృష్ణ వీఆర్ కు పంపిన విషయం తెలిసిందే. ఈ విషయమే మంత్రి పరిటాల సునీతకు కోపం తెప్పించింది.

అనంతపురం : అనంతపురం జిల్లా రాప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రసాద్ రెడ్డి హత్య కేసులో పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఇటుకలపల్లి సీఐ శ్రీనివాసులు, రాప్తాడు ఎస్ ఐ నాగేంద్ర ప్రసాద్ లను వీఆర్ (వేకెన్సీ రిజర్వ్‌) కు పంపుతూ జిల్లా ఎస్పీ రాజేశేఖరబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.  కాగా ప్రసాద్ రెడ్డి హత్య నేపథ్యంలో పోలీసుల తీరుపై విమర్శులు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. కాగా  రాప్తాడు మండల నేత భూమిరెడ్డి శివప్రసాదరెడ్డి(49)ని బుధవారం రాజకీయ ప్రత్యర్థులు వేటకొడవళ్లతో విచక్షణా రహితంగా దాడిచేసి నరికి చంపిన విషయం తెలిసిందే.
Share this article :

0 comments: