గ్రామాల్లో తిరిగే దమ్ముందా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గ్రామాల్లో తిరిగే దమ్ముందా?

గ్రామాల్లో తిరిగే దమ్ముందా?

Written By news on Thursday, May 7, 2015 | 5/07/2015

సీఎం చంద్రబాబుకు వైఎస్సార్ సీపీ అధినేత జగన్ సూటిప్రశ్న
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతున్నా ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అబద్ధాలు చెబుతున్న మీకు గ్రావూల్లో తిరిగే ధైర్యం ఉందా?’-అని సీఎం చంద్రబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. బాబు అబద్ధాల పాలనకు రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చెబుదావుని ప్రజలకు జగన్ పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లాలోని పత్తికొండలో కాంగ్రెస్ పార్టీ మాజీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి వైఎస్సార్ సీపీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ‘రైతులు, డ్వాక్రా అక్కచెల్లెవ్ముల రుణాలను వూఫీ చేయకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబుకు దేవుడు మొట్టికాయలు వేస్తాడు’ అని ఆయన అన్నారు.   
 
వడ్డీ కూడా మాఫీ చేయలేదే..!
ఎన్నికల ముందు రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు.. రుణాలు కాదు కదా.. కనీసం వడ్డీ కూడా మాఫీ చేయలేదని వుండిపడ్డారు. ‘రూ.87 వేల కోట్లున్న వ్యవసాయ రుణాలు.. వడ్డీలు పెరిగి రూ.లక్ష కోట్లకు చేరింది చంద్రబాబు చలవవల్ల కాదా?’ అని నిలదీశారు. ‘రైతన్నలారా.. మీ రుణాలు మాఫీ అయ్యాయా?’ అని సభలో ఉన్న రైతులను జగన్ ప్రశ్నించారు. ఇందుకు రైతులు ‘లేదు.. లేదు’ అని బిగ్గరగా సమాధానమిచ్చారు. తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి రావాలన్నా.. జాబు కావాలన్నా బాబు రావాలని ఏ టీవీ ఆన్ చేసినా ప్రకటన వచ్చేదని జగన్ గుర్తుచేశారు. అయితే, చంద్రబాబు అధికారంలోకైతే వచ్చాడు కానీ.. తాకట్టులోని బంగారం మాత్రం ఇంటికి రాలేదన్నారు.

బాబు వచ్చాక ఉన్న జాబు కాస్తా ఊడిపోయిందని ధ్వజమెత్తారు. ‘ఏ సీఎంపైనైనా ప్రజా వ్యతిరేకత వచ్చేందుకు రెండు, వుూడేళ్ల సమయుం పడుతుంది. అరుుతే, దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ర్టంలో ఏడాది తిరగకవుుందే ‘మా కొద్దు బాబోయ్ ఈ బాబు పాలన’ అని ప్రజలు మండిపడుతున్నారు.’ అని జగన్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెబుతామని.. అందరూ కలసి పోరాడదావుని పిలుపునిచ్చారు.
 
ఆ కుయ్.. కుయ్ లేవీ?!
విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు బుధవారం నిర్వహించిన సభలో ఒక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు యుత్నించిన విషయూన్ని జగన్ ప్రస్తావించారు. అరుుతే, చంద్రబాబు వూత్రం ‘అది(రైతు ఆత్మహత్య యత్నం) పట్టించుకోకండి.. అందరూ ఇటే(తనవైపే) చూడండి’ అని అన్నారని విమర్శించారు. 108కి ఫోన్ చేస్తే కుయ్.. కుయ్ వుంటూ 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ రాలేదన్నారు. చివరకు ఆ రైతును ఆటోలో ఆస్పత్రికి తీసుకుపోవాల్సి వచ్చిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ పత్తికొండ నియోజకవర్గం బాధ్యతలను చెరుకులపాడు నారాయణరెడ్డి నిర్వర్తిస్తారన్నారు.
 
 100 మార్కులు సాధిస్తాం : భూమా
ప్రస్తుతం 11స్థానాల్లో ఉన్నా, రాబోయే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాలనూ కైవసం చేసుకుని నూటికి నూరు వూర్కులు సాధిస్తావుని పీఏసీ చైర్మన్, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఉద్ఘాటించారు.  రాబోయే రోజుల్లో పార్టీకి వుంచి భవిష్యత్తు ఉందని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ఫ్లోరైడ్ బారిన పడిన పత్తికొండ నియోజకవర్గానికి సాగు, తాగునీరు అందించిన ఘనత దివంగత వైఎస్‌దేనని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు.
 
అందుకే పార్టీలో చేరా: నారాయణరెడ్డి
పత్తికొండ అభివృద్ధికి అసెంబ్లీ వేదికగా ప్రశ్నించేందుకు వీలుంటుందనే వైఎస్సార్ సీపీలో చేరినట్టు చెరుకులపాడు నారాయణరెడ్డి చెప్పారు. వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్నందునే తనపై తప్పుడు కేసులు మోపుతున్నారన్నారు.  సభలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి, ఎమ్మెల్యేలు సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, మణిగాంధీ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఐజయ్య, వూజీ ఎమ్మెల్యేలు కొత్తకోట ప్రకాష్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, పార్టీ నేతలు పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి, సీఈసీ సభ్యులు హఫీజ్ ఖాన్ పాల్గొన్నారు.
 
మీకు చేతకాకపోతే మేమే నీళ్లిస్తాం: వైఎస్ జగన్
సాక్షి, కర్నూలు: ‘శ్రమదానంతో నిర్మించిన వెంకటాపురం చెరువు కింద 15 గ్రామాలకు సాగునీరందే అవకాశాలున్నాయి. అలాంటి చెరువు నేడు బీటలువారింది. సమీపంలోనే హంద్రీనీవా కాలువ ఉన్నా.. చెరువుకు నీళ్లివ్వాలనే యోచన సీఎంకిగానీ, మంత్రులకుగానీ రావడం లేదు. వచ్చేది మన ప్రభుత్వం.. హంద్రీ కాలువ నుంచి నేను చెరువుకు నీళ్తు తీసుకోస్తాను.’-అని జగన్ అన్నారు.

కర్నూలు పర్యటనలో భాగంగా బుధవారం డోన్‌కు చేరుకున్న ఆయన తొలుత గాజులదిన్నె తాగునీటి పథకం పంప్‌హౌస్‌ను పరిశీలించి, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘దివంగత సీఎం వైఎస్ డోన్ మీదుగా పాదయాత్ర చేపట్టినప్పుడు.. నీటికోసం డోన్ ప్రజల ఇబ్బందులు చూశారు. బిందెడు నీళ్లను రూ.2కు కొనుగోలు చేస్తున్న దుస్థితి చూసి చలించిపోయారు. అధికారంలోకి రాగానే సుమారు 62 కిలోమీటర్ల దూరంలోని గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పైపుల ద్వారా ఇక్కడికి నీళ్లు తీసుకొచ్చేందుకు రూ.53 కోట్లు ఖర్చు చేశారు. అంతకుముందు అధికారంలో ఉన్న సీఎంలు ఎవరికీ ఈ ఆలోచన రాలేదు.’ అని జగన్ ధ్వజమెత్తారు.
 
విపక్ష నేతకు ఎస్కార్ట్ కరువు
విపక్ష నేత, కేబినెట్ హోదా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి.. కర్నూలు పర్యటనకు వస్తున్నా రని తెలిసికూడా.. పోలీసులు కనీస భద్రతను కల్పించలేదు. ఆయన వెంట రక్షణగా ఉండాల్సిన ఎస్కార్ట్ గానీ, రోప్‌పార్టీగానీ కనిపించలేదు. కర్నూలు చేరుకున్న జగన్‌కి నగర శివార్లవరకే పోలీసులు ఎస్కార్ట్‌గా వచ్చి వెనుదిరిగారు. జగన్ ప్యాపిలి, కలుచట్ల, శభాష్‌పురం, రాంపల్లి క్రాస్, ఎద్దులదొడ్డి మీదుగా పత్తికొండ మార్గంలో ప్రమాదకర కొండల మధ్య ప్రయాణించినా బందోబస్తు కల్పించలేదు.
Share this article :

0 comments: