ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ అమెరికా పర్యటన వివాదాస్పదంగా మారుతోంది. పెట్టుబడులకోసం అమెరికాలో పర్యటిస్తున్నానని లోకేష్ ప్రకటించగా, ఆయనకు తోడుగా మరో ఇద్దరు అదికారులను విడి,విడిగా అమెరికాకు ప్రభుత్వ ఖర్చుతో పంపడం పై విమర్శలు వస్తున్నాయి. దీనిని ఎవరికి తెలియకుండా ఉంచాలని ప్రయత్నించారని , అయినా ఆ విషయాలు బయటపడిపోయాయని కధనాలు వస్తున్నాయి.లోకేష్ కు అత్యంత సన్నిహిత మిత్రుడు అభీష్టతో పాటు,ఒక అదికారి కార్తికేయ మిశ్రలను అమెరికా పంపించారు.వారిద్దరూ సొంత ఖర్చులపై వెళితే పర్వాలేదు.కాని ప్రభుత్వం జి.ఓలు ఇచ్చి మరీ పంపించడం వివాదంగా మారింది.అభీష్ట కోసం (జీవో 1326), కార్తికేయ మిశ్రా కోసం మరో జీవో (నంబర్ 1336) జారీ చేశారు. ఇద్దరూ 3 వ తేదీ నుంచి 12 వరకు అమెరికాలో పర్యటిస్తారని, ఇద్దరికీ అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని జీవోలలో తెలిపారు. వారు ముగ్గురూ అమెరికా కలిసే తిరుగుతున్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో వారు ముగ్గురూ కలిసి దిగిన ఫోటోలు మీడియా దృష్టిలో పడ్డాయి.అవి ప్రచారంలోకి వచ్చాయి.
http://kommineni.info/articles/dailyarticles/content_20150507_5.php?p=1430970228611
0 comments:
Post a Comment