పామర్రు:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఫల్యాలపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టబోతున్నసమరదీక్షను విజయవంతం చేయాలని ఆ పార్టీ నేత విజయసాయి రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం పామర్రులో ఎమ్మెల్యే ఉప్పలేటి కల్పన అధ్యక్షతన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో విజయసాయిరెడ్డి, పార్థసారధి, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆదిశేషగిరిరావులు పాల్గొన్నారు. అనంతరం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాది పాలనలో రాష్ట్రానికి చేసింది శూన్యమని విమర్శించారు. జన్మభూమికి సంబంధించి కమిటీలు రాజ్యాంగ విరుద్ధమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
దీనిలో భాగంగానే వచ్చే 3,4 తేదీల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమరదీక్షకు సిద్ధమవుతున్నారన్నారు. ఈ దీక్షలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని విన్నవించారు.
దీనిలో భాగంగానే వచ్చే 3,4 తేదీల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమరదీక్షకు సిద్ధమవుతున్నారన్నారు. ఈ దీక్షలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని విన్నవించారు.
0 comments:
Post a Comment