నెట్టెప్ప కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నెట్టెప్ప కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

నెట్టెప్ప కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

Written By news on Wednesday, May 13, 2015 | 5/13/2015


నెట్టెప్ప కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
అనంతపురం:  రైతులకు అండగా ఉంటామని, వారిలో స్థైర్యం నింపేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. యాత్ర మూడోరోజు బుధవారం వైఎస్ జగన్ గుంతకల్లు నియోజకవర్గంలో పర్యటించారు.  

గుంతకల్లు మండలంలోని గుండాల గ్రామంలో బండారి నెట్టెప్ప కుటుంబ సభ్యులను వైఎస్ జగన్‌ పరామర్శించారు. అంతకుముందు గుంతకల్లు మండలం వైటీ చెరువులో సుధాకర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ రోజు రైతు భరోసా యాత్రను గుత్తి నుంచి ప్రారంభమైంది. లక్తానుపల్లెలో ఆత్మహత్యకు పాల్పడిన శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. అన్నివిధాలా అండగా ఉంటానని వారికి భరోసాయిచ్చారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని జగన్ సూచించారు.
Share this article :

0 comments: