అనంతపురం ఎడ్యుకేషన్ : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర శుక్రవారం ఐదో రోజుకు చేరుకుంటుంది. ఉదయం ఉరవకొండ పట్టణంలో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన రైతు అందెల వన్నప్ప కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి వజ్రకరూరు మండలం పందికుంట గ్రామానికి చేరుకుంటారు.
అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతు ఓబులేసు (అలియాస్ పెన్నోబిలేసు) కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి నేరుగా వెంకటాంపల్లి పెద్దతండాకు వెళతారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కొర్ర గోవింద నాయక్ (అలియాస్ నాగు నాయక్) కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత రాయదుర్గం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం వెల్లడించారు.
అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతు ఓబులేసు (అలియాస్ పెన్నోబిలేసు) కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి నేరుగా వెంకటాంపల్లి పెద్దతండాకు వెళతారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కొర్ర గోవింద నాయక్ (అలియాస్ నాగు నాయక్) కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత రాయదుర్గం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం వెల్లడించారు.
0 comments:
Post a Comment