9 నుంచి నల్లగొండ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 9 నుంచి నల్లగొండ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర

9 నుంచి నల్లగొండ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర

Written By news on Wednesday, June 3, 2015 | 6/03/2015


9 నుంచి నల్లగొండ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఈ నెల 9 నుంచి నల్లగొండ జిల్లాలో రెండో విడత పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శిస్తారు. 9 నుంచి 12 వరకు నాలుగు రోజుల పాటు 17 కుటుంబాలను ఓదారుస్తారు. వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శులు శివకుమార్, గట్టు శ్రీకాంత్ రెడ్డి.. వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర వివరాలను వెల్లడించారు.

9వ తేదీ ఉదయం 9:30 గంటలకు వైఎస్ షర్మిల పరామర్శ యాత్రకు బయల్దేరివెళ్లనున్నారు. భువనగిరి నియోజకవర్గంలోని బీబీ నగర్ మండలం వెంకిర్యాల గ్రామంలో యాత్ర ప్రారంభమవుతుంది. భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, నల్లగొండ, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర సాగుతుందని శివకుమార్, గట్టు శ్రీకాంత్ రెడ్డి చెప్పారు
Share this article :

0 comments: