
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడే ఈ ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పి పక్కదోవ పట్టిస్తున్నారని, వాస్తవానికి ఆయన చెప్పింది నిజం కాదని వారు ఆరోపించారు. ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికి పోయిన చంద్రబాబు ఢిల్లీ వెళ్లి తన విషయం మాట్లాడుకుంటున్నారే తప్ప ఎత్తిపోతల పథకం గురించి కేంద్రానికి ఫిర్యాదు కూడా చేయలేదని వారు విమర్శించారు. రాష్ట్రంలో పరిపాలనను చంద్రబాబు పూర్తిగా గాలికొదిలేశారని ప్రజల, రైతుల సమస్యలు అసలు పట్టించుకోవడం లేదన్నారు. నాలుగేళ్లలో పూర్తి చే యాల్సిన పోలవరం పనులు పూర్తిగా నిలిచి పోయాయని అక్కడ ఒక్క తట్ట మట్టి కూడా తీయలేదని తెలిపారు. ఈ వ్యవహారంలో దోషులపై చర్యలు తీసుకోవాలని ఒక ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని కోరితే తప్పవుతుందా! అని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
0 comments:
Post a Comment