హైదరాబాద్: గోదావరి పుష్కరాల్లో పనులకు జాప్యానికి కారణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నిధులు ఆలస్యంగా విడుదల చేసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు.
ఏపీ సీఎం చంద్రబాబు తన తప్పిదాన్ని అధికారులపై నెట్టి వేసే యత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతి పనిలో 50 శాతం అవినీతి లేకుండా జరగడం లేదని ఆయన ఆరోపించారు. పుష్కరాల్లో జరిగిన అవినీతిపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. గోదావరి పుష్కరాల్లో అవినీతి పాల్పడిన ఘనత చంద్రబాబుదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు తన తప్పిదాన్ని అధికారులపై నెట్టి వేసే యత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతి పనిలో 50 శాతం అవినీతి లేకుండా జరగడం లేదని ఆయన ఆరోపించారు. పుష్కరాల్లో జరిగిన అవినీతిపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. గోదావరి పుష్కరాల్లో అవినీతి పాల్పడిన ఘనత చంద్రబాబుదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
0 comments:
Post a Comment