రాజధాని పేరుతో చంద్రబాబు సమస్యలు సృష్టిస్తున్నారని రోజా అన్నారు. రాజధాని సామాన్యులకు అందుబాటులో ఉండాలని, మాస్టర్ ప్లాన్ లో రైతులు, బడుగులకు చోటెక్కడ ఉందని ఆమె ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటని నిలదీశారు. చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ మాని ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు.
ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి.. ఇప్పుడు దానిపై నుంచి ప్రజల దృష్టి మరలించేందుకే ఈ మాస్టర్ ప్లాన్ ను చంద్రబాబు తెరమీదకు తెచ్చారని రోజా అన్నారు. అంతర్జాతీయ రాజధాని పేరుతో ప్రజలను కలల్లో విహరింప చేయడమే అని, మాస్టర్ ప్లాన్ ఫ్రీగా ఇవ్వడానికి సింగపూర్ ఏమైనా ధార్మిక సంస్థా, బడుగు, బలహీన వర్గాలకు నూతన రాజధానిలో చోటివ్వరా?, 2050 వరకూ రాజధాని నిర్మాణం చేపడితే భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటని అన్నారు. భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యామ్నాయంగా ఏమిస్తారో చెప్పాలని, రాజధాని మాస్టర్ ప్లాన్ రియల్ ఎస్టేట్ బ్రోచర్ లా ఉందని అన్నారు.
0 comments:
Post a Comment