పుష్కరాలలో తొక్కిసలాట ఘటనకు ఎవరు బాద్యత తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా ఉంది. తాజాగా జిల్లా కలెక్టర్ అరుణకుమార్ ప్రభుత్వానికి పంపిన నివేదిక సంచలనంగా ఉంది. ఆయన స్పష్టంగా పుష్కర ఘాట్ లో స్నానాలు చేయడం, ఎనిమిదిన్నర గంటలవరకు విఐపిలు అంతా అక్కడే ఉండడం, రెండు గంటలకు పైగా జనాన్ని రేవులోకి అనుమతించకపోవడంవల్లనే ఈ ఘటన జరిగిందని ప్రభుత్వానికి పంపిన ప్రాధమిక నివేదికలో తెలపడం విశేషం.ప్రతిపక్షాలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కర ఘాట్ లో స్నానానికి వెళ్లి రెండు గంటలకు పైగా ఉండడం వల్లనే జరగిందన్న ఆరోపణలకు కలెక్టర్ నివేదిక మద్దతు ఇచ్చది గా ఉంది. ఈ నివేదిక కాపీలు కూడా లీక్ అవడం విశేషం. జిల్లాలో కలెక్టర్,ఎస్.పిలకు పడడం లేదని, వారి మద్య సమన్వయం లేదని కొన్ని పత్రికలలో కధనాలు రాగా, దీనికి ప్రతిగానా అన్నట్లుగా కలెక్టర్ ఏకంగా విఐపిల వల్లే ఈ ప్రమాదం జరిగిందన్న సంకేతం ఇచ్చేలా నివేదికను ప్రభుత్వానికే పంపడం విశేషం . ఈ కేసులో రాజకీయ నాయకులు అదికారులపై నెపం నెట్టడానికి ప్రయత్నిస్తుంటే, అదికారులు రాజకీయ వ్యవస్థపైనే నివేదిక పంపడం సంచలనంగా ఉంది.
http://kommineni.info/articles/dailyarticles/content_20150716_17.php
http://kommineni.info/articles/dailyarticles/content_20150716_17.php
0 comments:
Post a Comment