తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామిని మంగళవారం వైఎస్సార్సీపీ ఎమ్యెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు. ఆయన మంగళవారం తెల్లవారు జామున తిరుమలకు చేరుకుని వీఐపీ ప్రారంభదర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ అధికారులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కాగా గరుడ పంచమి సందర్భంగా తిరుమల శ్రీవారికి మంగళవారం గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు మలయప్ప స్వామి గరుడ వాహనంపై ఆలయ పురవీధుల్లో ఊరేగనున్నారు. అయితే, ఈ నెలలో ఓ విశేషం నెలకొంది. ఈ నెల 2 న పౌర్ణమి సందర్భంగా శ్రీనివాసుడికి గరుడ వాహన సేవ నిర్వహించారు. అలాగే, ఈ నెల 31న పౌర్ణమి సందర్భంగా మరోసారి గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. ఒకే నెలలో మూడు సార్లు గరుడ వాహన సేవలు నిర్వహించడం ఇదే తొలిసారి.
కాగా గరుడ పంచమి సందర్భంగా తిరుమల శ్రీవారికి మంగళవారం గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు మలయప్ప స్వామి గరుడ వాహనంపై ఆలయ పురవీధుల్లో ఊరేగనున్నారు. అయితే, ఈ నెలలో ఓ విశేషం నెలకొంది. ఈ నెల 2 న పౌర్ణమి సందర్భంగా శ్రీనివాసుడికి గరుడ వాహన సేవ నిర్వహించారు. అలాగే, ఈ నెల 31న పౌర్ణమి సందర్భంగా మరోసారి గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. ఒకే నెలలో మూడు సార్లు గరుడ వాహన సేవలు నిర్వహించడం ఇదే తొలిసారి.
0 comments:
Post a Comment