
నేటి పుష్కరాల్లో కూడా వైఎస్సార్ తనయుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇదే ఘాట్ లో పుష్కర స్నానం ఆచరించారు. నేడు వైఎస్ జగన్ కూడా ప్రతిపక్ష నేత హోదాలోనే ఉన్నారు. తొలుత సంప్రదాయ పద్ధతిలో పంచె, ధోవతి ధరించి కాలినడకన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఘాట్ (వీఐపీ ఘాట్)కు వెళ్లారు. గోదావరి మాతకు సంకల్ప పూజ నిర్వహించి, నదీ స్నానమాచరించారు. ఆ తరువాత తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, తాత, నాయనమ్మలు రాజారెడ్డి, జయమ్మలకు, తాత, అమ్మమ్మలకు, ఇతర దివంగతులకు శాస్త్రోక్తంగా పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహానేత జ్ఞాపకాలు అభిమానులకు గుర్తుకొచ్చాయి.
0 comments:
Post a Comment