వైఎస్ జగన్ తిరిగి రాజమండ్రి చేరుకుని అయ్యప్పస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత ఉమామార్కేండేయేశ్వరస్వామివారి ఆలయంలో స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న పుష్కర సేవా కార్యక్రమాలను ఆయన పరిశీలిస్తారు. మధ్యాహ్నం కోటిలింగాల ఘాట్ను సందర్శించి పూజ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం మధురపూడి విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయల్దేరతారు.
వేద పండితులు,పురోహితులు దగ్గర ఉండి సంప్రదాయ బద్దంగా జగన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. జగన్ పట్టు లుంగి దరించి వచ్చి గోదావరిలో పండితుల సూచనల మేరకు ఆచారాలను పాటిస్తూ స్నానం చేశారు.జగన్ తన తండ్రి రాజశేఖరరెడ్డికి పిండప్రదానం చేశారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అక్కడ ఉన్నారు. కాగా వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న భాస్కర శర్మ భద్రాచలం సమీపంలో వైఎస్ పేరుతో తర్పణం గావించి పిండ ప్రదానం చేసి తన గౌరవాన్ని చాటుకున్నారు.
0 comments:
Post a Comment