శాంతి భద్రతల దృష్ట్యా అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ అరాచకాలు చేస్తున్న ఎమ్మెల్యేను అరెస్టు చేయకపోవటం దారుణం అన్నారు. కోనా రఘుపతి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కృష్ణమూర్తికి ఒక సామాజిక వర్గం ఉందని తెలిసి కూడా అరెష్టు చేయడం అగ్గి మీద కిరోసిన్ పోసినట్లు ఉందని పేర్కొన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ టీడీపీకి పోలీసులు కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని, అధికారం ఒకరి సొత్తు కాదని తెలుసుకోవాలన్నారు.
జిల్లా సేవాదళ్ అధ్యక్షులు చిన్నప్పరెడ్డి, పిడుగురాళ్ల , దాచేపల్లి జెడ్పీటీసీలు వీరబద్దుని రామిరెడ్డి, ములుగొండ ప్రకాష్రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ మాబు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మొగిలి మధుసూదన్రావు, బీసీ సెల్ రాష్ట్ర సభ్యులు కోడిరెక్క దేవదాసు, జిల్లా సంయుక్త కార్యదర్శి తాటికొండ చిన్న ఆంజనేయులురెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రేపాల శ్రీనివాసరావు, రాష్ట్ర విభజన అధ్యక్షులు కొఠారి నరసింహారావు, రాష్ట్ర బీసీ కార్యవర్గ సభ్యులు కుందుర్తి గురవాచారి, బీసీ సెల్ సభ్యులు దూదేకుల మీరావలి తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment