కోటిలింగాల పుష్కర ఘాట్ పరిశీలించిన వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కోటిలింగాల పుష్కర ఘాట్ పరిశీలించిన వైఎస్ జగన్

కోటిలింగాల పుష్కర ఘాట్ పరిశీలించిన వైఎస్ జగన్

Written By news on Saturday, July 4, 2015 | 7/04/2015

కోటిలింగాల పుష్కర ఘాట్ పరిశీలించిన వైఎస్ జగన్
రాజమండ్రి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం కోటిలింగాల పుష్కర ఘాట్ను పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'పుష్కరాల పనులకు టెండర్లు లేకుండా నామినేటెడ్ పద్ధతిలో ఇష్టం వచ్చినవాళ్లకు ఇచ్చారు. అందినంత దోచుకుంటున్నారు, పుష్కరాలకు లక్షలాదిమంది భక్తులు వస్తారు. కోటిలింగాల రేవు కుంగిపోయిందని తెలిసి కూడా నాసిరకం పనులు జరుపుతున్నారు' అని మండిపడ్డారు.

కాగా వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
Share this article :

0 comments: