ఢిల్లీలో వైఎస్ జగన్ సమరభేరి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఢిల్లీలో వైఎస్ జగన్ సమరభేరి

ఢిల్లీలో వైఎస్ జగన్ సమరభేరి

Written By news on Monday, August 10, 2015 | 8/10/2015

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా ప్రారంభమైంది. సోమవారం ఉదయం ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదిక వద్దకు వైఎస్ జగన్ చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ధర్నా కొనసాగనుంది.

ధర్న వేదిక వద్దకు భారీ సంఖ్యలో వైఎస్ ఆర్ సీపీ నాయకులు,  కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. వేలాదిమంది రాకంతో జంతర్ మంతర్ వద్ద రోడ్లు కిక్కిరిసిపోయాయి. ధర్నా కోసం ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్లారు. రెండు ప్రత్యేక రైళ్లలో ఢిల్లీ చేరుకున్నారు. ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్ కు మద్దతుగా ఢిల్లీలోని తెలుగువారు తరలివచ్చారు. వైఎస్ఆర్ సీపీ నేతలు విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మహిళా నాయకులు హాజరయ్యారు.
Share this article :

0 comments: