రోజా అనుచరులను పోలీసులు వేధిస్తున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రోజా అనుచరులను పోలీసులు వేధిస్తున్నారు

రోజా అనుచరులను పోలీసులు వేధిస్తున్నారు

Written By news on Sunday, August 16, 2015 | 8/16/2015

తిరుపతి:  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో పోలీసుల ఆకృత్యాలు శృతిమించుతున్నాయని మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. నగరిలో పథకం ప్రకారం ఎమ్మెల్యే రోజాను తుదిముట్టించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఎమ్మెల్యే రోజా, ఆమె అనుచరులపై అక్రమ కేసులు బనాయిస్తూ పోలీసులు వేధిస్తున్నారని భూమన చెప్పారు.

టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఒత్తిడి వల్లే వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు టార్గెట్ చేస్తున్నారని భూమన ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు, టీడీపీ నేతల దౌర్జన్యాలను ఎదుర్కొంటామని భూమన చెప్పారు.
Share this article :

0 comments: