వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించడానికి జిల్లా పరిశీలకులను నియమించారు. సంస్థాగతంగా తీసుకురావాల్సిన మార్పులకు సంబంధించి కొద్ది రోజులుగా పార్టీ సీనియర్ నేతలతో అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్చించిన తర్వాత వీరి నియామకాలను ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ నెల 29వ తేదీన రాష్ట్ర బంద్ నిర్వహించ తలబెట్టిన నేపథ్యంలో కొత్తగా నియమితులైన జిల్లా పరిశీలకుల తొలి సమావేశం ఈ నెల 18వ తేదీన జరుగుతుందని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదలైన ఒక ప్రకటనలో తెలిపారు.
ఆ రోజు ఉదయం 11 గంటలకు జరిగే పరిశీలకుల సమావేశంలో బంద్ ఏర్పాట్లు, పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం వంటి అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. జిల్లాల వారీగా కొత్తగా నియమితులైన పరిశీలకుల వివరాలిలా ఉన్నాయి.
అనంతపురం - పెద్దిరెడ్డి మిథున్రెడ్డి
కర్నూలు - అనంత వెంకటరామిరెడ్డి
చిత్తూరు - పి.రవీంద్రనాథ్రెడ్డి
కడప - వైఎస్ అవినాష్రెడ్డి, మేరుగ నాగార్జున, సురేష్బాబు
నెల్లూరు - వైవీ సుబ్బారెడ్డి
ప్రకాశం - డీసీ గోవిందరెడ్డి
గుంటూరు - బొత్స సత్యనారాయణ
కృష్ణా - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పశ్చిమగోదావరి - పిల్లి సుభాష్చంద్ర బోస్
తూర్పుగోదావరి - ధర్మాన ప్రసాదరావు
విశాఖపట్టణం - వి.విజయసాయిరెడ్డి
విజయనగరం - ధర్మాన కృష్ణదాసు
శ్రీకాకుళం - ఆర్వీఎస్ఎస్కె రంగారావు(బేబి నాయన).
ఆ రోజు ఉదయం 11 గంటలకు జరిగే పరిశీలకుల సమావేశంలో బంద్ ఏర్పాట్లు, పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం వంటి అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. జిల్లాల వారీగా కొత్తగా నియమితులైన పరిశీలకుల వివరాలిలా ఉన్నాయి.
అనంతపురం - పెద్దిరెడ్డి మిథున్రెడ్డి
కర్నూలు - అనంత వెంకటరామిరెడ్డి
చిత్తూరు - పి.రవీంద్రనాథ్రెడ్డి
కడప - వైఎస్ అవినాష్రెడ్డి, మేరుగ నాగార్జున, సురేష్బాబు
నెల్లూరు - వైవీ సుబ్బారెడ్డి
ప్రకాశం - డీసీ గోవిందరెడ్డి
గుంటూరు - బొత్స సత్యనారాయణ
కృష్ణా - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పశ్చిమగోదావరి - పిల్లి సుభాష్చంద్ర బోస్
తూర్పుగోదావరి - ధర్మాన ప్రసాదరావు
విశాఖపట్టణం - వి.విజయసాయిరెడ్డి
విజయనగరం - ధర్మాన కృష్ణదాసు
శ్రీకాకుళం - ఆర్వీఎస్ఎస్కె రంగారావు(బేబి నాయన).
0 comments:
Post a Comment