వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చారు

వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చారు

Written By news on Monday, August 31, 2015 | 8/31/2015


'వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రకటన చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గుర్తు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన సోమవారం మాట్లాడుతూ...  రాష్ట్ర విభజన జరిగింది ఏపీకి న్యాయం చేస్తామని ముగ్గురు కలిసి హామీ ఇచ్చి ఇప్పుడు ఆ హామీని గాలికి వదిలేశారన్నారు. ఇప్పుడు  ప్రత్యేక ప్యాకేజీ అంటూ తెరమీదకు తెచ్చారని మండిపడ్డారు.

ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకే చంద్రబాబాబు నాయుడు ప్రత్యేక హోదా అంశాన్ని తాకట్టు పెట్టారని చెవిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు కోరుకుంటే హోదా వస్తుందని ఆయన అన్నారు. ఓ వైపు ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి వైపు నడిచేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంతో సహకరించేందుకు సిద్ధంగా ఉంటే చంద్రబాబు మాత్రం ప్యాకేజీలంటూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
Share this article :

0 comments: