ఏపీకి ప్రత్యేక హోదాకోసం ప్రాణాత్యాగం చేసినవారి కుటుంబాలకు ఇప్పటి వరకు ప్రభుత్వం దమ్మిడి కూడా ఇవ్వలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటంవల్లే వారు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని చంద్రబాబు అనలేదా, ప్రత్యేక హోదా రాదని మీడియా సమావేశంలో చంద్రబాబు చెప్పలేదా అని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో ఆత్మ బలిదానానికి పాల్పడిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం యువత ఆందోళన చెందవద్దని సీఎం కోరారు. అనంతరం వైఎస్ జగన్ ప్రభుత్వం తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాత్యాగం చేసినవారి కుటుంబాలకు ఇప్పటి వరకు ప్రభుత్వం దమ్మిడి కూడా ఇవ్వలేకపోయిందని చెప్పారు. వారి కుటుంబాలను కనీసం పలకరించలేదని, పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో ఆత్మ బలిదానానికి పాల్పడిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం యువత ఆందోళన చెందవద్దని సీఎం కోరారు. అనంతరం వైఎస్ జగన్ ప్రభుత్వం తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాత్యాగం చేసినవారి కుటుంబాలకు ఇప్పటి వరకు ప్రభుత్వం దమ్మిడి కూడా ఇవ్వలేకపోయిందని చెప్పారు. వారి కుటుంబాలను కనీసం పలకరించలేదని, పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అన్నారు.
0 comments:
Post a Comment