హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో ఆత్మహత్యాయత్నం చేసుకున్న మునికామ కోటి కుటుంబాన్ని ఫోన్లో వైఎస్ జగన్ పరామర్శించారు. ఆదివారం కోటి సోదరుడికి వైఎస్ జగన్ ఫోన్ చేశారు. మునికామ కోటి ఆరోగ్య పరిస్థితిని అతడి సోదరుడిని వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారు. కోటి ఆర్యోగం విషమంగా ఉందని అతడి సోదరుడు ఆందోళన వ్యక్తం చేశాడు. దాంతో మునికామకోటి త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
అయితే తమిళనాడులోని రాయవేలూరులో సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోటి ఆరోగ్య పరిస్థితి ఆదివారం మరింత విషమించింది. దాంతో అతడిని చెన్నైలోని కీల్పాక్ ఆసుపత్రికి తరలించారు.
0 comments:
Post a Comment