షర్మిల పరామర్శ యాత్ర పోస్టర్ ఆవిష్కరణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షర్మిల పరామర్శ యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

షర్మిల పరామర్శ యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

Written By news on Thursday, August 20, 2015 | 8/20/2015


షర్మిల పరామర్శ యాత్ర పోస్టర్ ఆవిష్కరణ
షర్మిల యాత్రను విజయవంతం చేయాలి
వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నేతలు
కొండా రాఘవరెడ్డి, జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి
 

కాజీపేట రూరల్ : హన్మకొండలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం వైఎస్సార్ సీపీ శ్రేణులు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల పరమార్శ యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ రాష్ర్ట అధికార ప్రతినిధి, జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో పర్యటించే షర్మిల పరమార్శ యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తట్టుకోలేక 650 మంది మృతి చెందారని తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాల్లో వెలుగులు నింపడానికి వైస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నల్ల కాల్వ వద్ద మాట ఇచ్చారని తెలిపారు. మాట తప్పని.. మడమ తిప్పని కుటుంబంలోని షర్మిల పరమార్శ యాత్రతో వారిని ఓదార్చనున్నట్లు తెలిపారు. షర్మిల ఈ నెల 24 నుంచి 28వ  తేదీ వరకు జిల్లాలో పరమార్శ యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. షర్మిలకు జిల్లావాసులు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వైఎస్ పాలనలో రాష్ట్ర ప్రజల కోసం ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో వెలుగులు నింపాయని.. అలాంటి మహానేతను వారి కుటుంబంను ప్రజలు ఎప్పటికి గుండెల్లో పెట్టుకుంటారన్నారు.

ఈనెల 24న ప్రారంభం
జిల్లాలో షర్మిల పరమార్శయాత్ర 24న ప్రారంభమై 28 వరకు సాగుతుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి అ న్నారు. జిల్లాలో 32 మంది కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ముని గాల విలియం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీడికం టి శివ, గ్రేటర్ అధ్యక్షుడు కాయిత రాజ్‌కుమార్ యాదవ్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు ఎర్రంరెడ్డి మహిపాల్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌రాజ్, జిల్లా అధికార ప్రతినిధులు అప్పం కిషన్, చల్లా అమరేందర్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మంచె అశోక్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దుప్పటి ప్రకాష్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు దోపతి సుదర్శన్‌రెడ్డి, జిల్లా నాయకులు సంగాల ఈర్మియ, ముజఫరుద్దీన్ ఖాన్, శంకరాచారి, బద్రుద్దీన్ ఖాన్, మాదాడి చరణ్‌రెడ్డి, భీంరెడ్డి రవితేజరెడ్డి, అచ్చిరెడ్డి, తౌట్‌రెడ్డి మాధవరెడ్డి, నోముల జయపాల్‌రెడ్డి, పులుగాల గాంధీ, బొడ్డు శ్రావణ్, పిడిశెట్టి సంపత్, నిమ్మరబోయిన రమేష్, గౌరబోయిన సమ్మయ్య, ఆరేపెల్లి రాజు, రామేశ్వర చారి, లోకు రమేష్, యాకూబ్‌లు పాల్గొన్నారు.
 
వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక
 హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో బుధవారం పలువురు వైఎస్సార్ సీపీలో చేరారు. ైవె ఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీడికంటి శివ ఆధ్వర్యంలో రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి సమక్షంలో 30 మంది చేరారు. పార్టీలో చేరిన ప్రతిక్, గౌతం, ప్రమోద్, మనోహర్, సాయికృష్ణ, సాయిరాం, అనిల్, వంశీ, హరీష్, పవన్‌కల్యాన్, ఫయిముద్దీన్ తదితరులను రాఘవరెడ్డి, మహేందర్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. వైఎస్సార్ సీపీలో కష్టపడి పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు.
 
Share this article :

0 comments: