న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ ఢిల్లీలో అరెస్టైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదలయ్యారు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్ నుంచి ఆయనను విడుదల చేశారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టిన తర్వాత పార్టీ శ్రేణులతో కలిసి వైఎస్ జగన్ పార్లమెంట్ కు బయలు దేరారు. భారీగా మొహరించిన సైనిక బలగాలు, పోలీసులు వీరిని అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్ సీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.
పోలీసులు అత్యుత్సాహంతో పలువురు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు గాయాలయ్యాయి. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నారనే కారణంతో వైఎస్ జగన్ ను పోలీసులు అరెస్ట్ చేసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్ కు తరలించారు. వైఎస్ జగన్ పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అమాయకులపై పోలీసులు ప్రతాపం చూపించడాన్ని ఆయన తప్పుబట్టారు.
0 comments:
Post a Comment