పబ్లిసిటీ వస్తేనే బాబు సాయం చేస్తారా-జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పబ్లిసిటీ వస్తేనే బాబు సాయం చేస్తారా-జగన్

పబ్లిసిటీ వస్తేనే బాబు సాయం చేస్తారా-జగన్

Written By news on Monday, September 14, 2015 | 9/14/2015


ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు పబ్లిసిటీ వస్తుందని అనుకుంటే ఎన్ని లక్షలు అయినా ఇస్తారని, పేదలైన కూలీలకు మాత్రం తక్కువ పరిహారం ఇచ్చి సరిపెడతారని విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అదినేత జగన్ విమర్శించారు.రాజమండ్రిలో గండేపల్లి ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. తనకు పబ్లిసిటి వస్తుందనుకున్నప్పుడు కొన్ని కేసులలో మృతి చెందినవారికి ఐదు లక్షల సాయం ఇచ్చారని, ఆయన మేకప్ వేసుకుని షూటింగ్ చేస్తూ తొక్కిసలాట జరిగినప్పుడు మరణించినవారికి పది లక్షలు ఇచ్చారని ,కాని ఉపాది లేక ఎక్కడకో వెళ్లి వస్తూ ప్రమాదంలో చనిపోయినవారికి రెండు లక్షలే ఇస్తారా అని జగన్ ప్రశ్నించారు.ఈ ప్రమాదంలో జెన్ కో కి కూడా బాద్యత ఉందని, అందువల్ల పదిలక్షల పరిహారం ఇవ్వాలని ,లేకుంటే వారిని కోర్టుకు లాగుతామని జగన్ హెచ్చరించారు.తాను వస్తున్నానని తెలిసి బలవంతంగా ప్రమాదంలో మరణించినవారి మృతదేహాలను వ్యాన్ లో కుక్కి పంపించారని చెబుతున్నారని,తాను అంటే ప్రభుత్వానికి ఎందుకంత భయమని జగన్ ప్రశ్నించారు.
Share this article :

0 comments: